Lady: బాంగ్లాదేశ్ యువతి గ్యాంగ్ రేప్, బీర్ బాటిల్స్ చెక్కేసి?, వీడియోలు, బెంగళూరు కోర్టు తీర్పు !
బెంగళూరు: ఐటీ హబ్ తో పాటు దేశవ్యాప్తంగా కలకలం రేపిన బాంగ్లాదేశ్ యువతి గ్యాంగ్ రేప్ కేసులో కోర్టు సంచలన తీర్పు చెప్పింది. యువతి మీద గ్యాంగ్ రేప్ చెయ్యడమే కాకుండా ఆమె సున్నితమైన భాగాల్లో బ్లేడ్ లతో కోసి, ఆమె మర్మాంగంలో బీరు బాటిల్స్ చెక్కి, సామూహిక అత్యాచారం చేసే సమయంలో తీసిన వీడియోలు సోషల్ మీడియాలో పోస్టు చెయ్యడం కలకలం రేపింది. నిందితులు గ్యాంగ్ రేప్ చేసే సమయంలో తీసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో అదే వీడియో ఆధారంగా కామాంధులు, కిరాతకులకు కోర్టు యావజ్జీవ కారాగార శిక్ష విధించింది. బాంగ్లాదేశ్ యువతి గ్యాంగ్ రేప్ కేసులో అరెస్టు అయిన నిందితురాలికి కోర్టు 20 ఏళ్లు శిక్ష విధించింది. ఈ కేసులో కొంత మందికి తక్కువ శిక్ష పడిందని బెంగళూరులోని రామమూర్తి నగర పోలీసులు మీడియాకు చెప్పారు.
Wife: ముగ్గురు మొగుళ్లు, భార్య ఫినిష్, కిలాడీ లేడీకి బాయ్ ఫ్రెండ్స్ ఎక్కువని చంపేశాను, భర్త !
బాంగ్లాదేశ్ యువతితో మందు పార్టీ
బెంగళూరు నగరంలోని రామమూర్తి నగర పోలీస్ స్టేషన్ పరిధిలో కొందరు బాంగ్లాదేశ్ కు చెందిన వారు నివాసం ఉండేవారు. 2021 మే 27వ తేదీన రామమూర్తి నగర్ లోని బాంగ్లాదేశ్ కు చెందిన కొందరు మద్యం పార్టీ చేసుకున్నారు. ఇదే లిక్కర్ పార్టీకి బాంగ్లాదేశ్ కు చెందిన 23 ఏళ్ల యువతి హాజరైయ్యింది. లిక్కర్ పార్టీ జరిగిన తరువాత అక్కడ సీన్ మొత్తం మారిపోయింది.
యువతి మీద గ్యాంగ్ రేప్.... బీరు బాటిల్స్ తో ?
మద్యం మత్తులో ఉన్న కొందరు యువకులు యువతి మీద గ్యాంగ్ రేప్ చేశారు. యువతిని నిర్బంధించిన తరువాత ఆమె మీద ఒకరి తరువాత ఒకరు అత్యాచారం చెయ్యడమే కాకుండా ఆమె సున్నితమైన భాగాల్లో బ్లేడ్ లతో కోసి, ఆమె మర్మాంగంలో బీరు బాటిల్స్ చెక్కి, సామూహిక అత్యాచారం చేశారు. యువతి మీద అత్యాచారం చేసే సమయంలో తీసిన వీడియోలు సోషల్ మీడియాలో పోస్టు చెయ్యడం కలకలం రేపింది.
సోషల్ మీడియాలో వీడియో వైరల్
యువతి మీద అత్యాచారం చేసే సమయంలో తీసిన వీడియోలు సోషల్ మీడియాలో పోస్టు చెయ్యడంతో వైరల్ అయ్యాయి. గ్యాంగ్ రేప్ కు గురైన యువతి ప్రాణ భయంతో కేరళపారిపోయింది. సోషల్ మీడియాలో వైరల్ అయిన వీడియోల ఆధారంగా కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేసి చివరికి నిందితులను పట్టుకున్నారు.
యావజ్జీవ కారాగార శిక్ష
నిందితులు గ్యాంగ్ రేప్ చేసే సమయంలో తీసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో అదే వీడియో ఆధారంగా కామాంధులు, కిరాతకులకు బెంగళూరులో 54వ సీసీహెచ్ న్యాయస్థానం యావజ్జీవ కారాగార శిక్ష విధించింది. బాంగ్లాదేశ్ యువతి గ్యాంగ్ రేప్ కేసులో అరెస్టు అయిన నిందితురాలికి కోర్టు 20 ఏళ్లు శిక్ష విధించింది.
కోర్టు సంచలన తీర్పు
ఈ కేసులో ప్రధాన నిందితుడులు సోబుజ్, హైదయ్ బాబాు, రఫ్సాన్ మండల్, రాకిబల్, ఇస్లాం సాగర్, మోహమ్మద్ బాబాు, దలీం, అజీమ్ అనే నిందితులను యావజ్జీవ కారాగార శిక్ష పడింది. బాంగ్లాదేశ్ యువతి గ్యాంగ్ రేప్ కేసులో అరెస్టు అయిన నిందితురాలు తానియాకు కోర్టు 20 ఏళ్లు శిక్ష, జమాల్ కు 5 సంవత్సరాలు, నస్రత్, కాజల్ కు కోర్టు 9 నెలల శిక్ష విధించిందని. బెంగళూరులోని రామమూర్తి నగర పోలీసులు చెప్పారు.