Lady: వాటర్ ఫాల్స్ లో శవమైన అటవి శాఖ ఉద్యోగి, 11 మంది ఫ్రెండ్స్ హత్య చేశారని కేసు పెట్టిన భార్య!
థానే: వివాహం చేసుకున్న దంపతులు సంతోషంగా కాపురం చేస్తున్నారు. భర్త ప్రభుత్వ ఉద్యోగం చేస్తుండటంతో అతని భార్య సంతోషంగానే ఉంటున్నది. అటవి శాఖలో ఉద్యోగం చేస్తున్న భర్త అతని భార్యను చాలా సంతోషంగా చూసుకుంటున్నాడు. భర్తతో పాటు అతని భార్య, స్నేహితులు కలిసి వాటర్ ఫాల్స్ దగ్గరకు విహారయాత్రకు వెళ్లారు. అందరూ వాటర్ ఫాల్స్ దగ్గర ఎంజాయ్ చేస్తున్నారు. ఆ సందర్బంలో ఆటవి శాఖలో ఉద్యోగం చేస్తున్న వ్యక్తి వాటర్ ఫాల్స్ లో పడిపోవడంతో అతని ప్రాణాలు పోయాయి. మాతో పాటు విహారయాత్రకు వచ్చిన 11 మందిలో కొందరు తన భర్తను వాటర్ ఫాల్స్ లోకి తేసేసి హత్య చేశారని ఫారెస్టు గార్డు భార్య కేసు పెట్టడం కలకలం రేపింది.
Illegal affair: నేను లేనప్పుడు ఎందుకు వస్తున్నాడు ?, భార్యను షూ లేస్ తో చంపేసిన సులేమాన్ !
అటవి శాఖలో ఉద్యోగం
మహారాష్ట్రలోని థానే జిల్లాలోని సహపూర్ ప్రాంతంలో కుందన్ అనే వ్యక్తి అటవి శాఖల్ గార్డుగా ఉద్యోగం చేస్తున్నాడు. వివాహం చేసుకున్న కుందన్ అతని భార్య సుప్రియాతో కలిసి చాలా సంతోషంగా కాపురం చేస్తున్నాడు. కుందన్ ప్రభుత్వ ఉద్యోగం చేస్తుండటంతో అతని భార్య సుప్రియా సంతోషంగానే ఉంటున్నది.
విహారయాత్రకు వెళ్లి?
అటవి శాఖలో ఉద్యోగం చేస్తున్న కుందన్ అతని భార్య సుప్రియాను చాలా సంతోషంగా చూసుకుంటున్నాడు. భర్త కుందన్, అతని భార్య సుప్రియా, కుందన్ తో పాటు ఉద్యోగాలు చేస్తున్న అతని స్నేహితులు కలిసి భోయిర్ మహులి వాటర్ ఫాల్స్ దగ్గరకు విహారయాత్రకు వెళ్లారు. అందరూ వాటర్ ఫాల్స్ దగ్గర ఎంజాయ్ చేస్తున్నారు.
శవమైన కుందన్
కుందన్, అతనితో పాటు ఉద్యోగాలు చేస్తున్న వారు వాటర్ ఫాల్స్ దగ్గర పిచ్చపాటిగా ఎంజాయ్ చేస్తున్నారు. ఆ సందర్బంలో కుందన్ కాలు జారి వాటర్స్ ఫాల్స్ లో పడిపోయి చనిపోయాడని అతనితో పాటు ఉద్యోగాలు చేస్తున్న వ్యక్తులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. వాటర్ ఫాల్స్ లో గాలించి కుందన్ శవాన్ని బయటకు తీసి ఆసుపత్రికి తరలించామని పోలీసులు అన్నారు.
ఫ్రెండ్ప్ మీద హత్య కేసు పెట్టిన భార్య
ఫారెస్టు గార్డు కుందన్ ప్రమాదవశాత్తు వాటర్ ఫాల్స్ లో పడిపోయి చనిపోయాడని పోలీసులు కేసు నమోదు చేశారు. అయితే కుందన్ ను అతనితో పాటు ఉద్యోగాలు చేస్తున్న వారు బలవంతంగా వాటర్ ఫాల్స్ దగ్గరకు పిలుచుకుని వెళ్లారని అక్కడ 11 మంది ఉన్నారని, వారిలోనే కొందరు నా భర్త కుందన్ ను వాటర్ ఫాల్స్ లో తోసేసి హత్య చేసి ఉంటారని కుందన్ భార్య సుప్రియా పోలీసు కేసు పెట్టింది. పోస్టుమార్టం నివేదిక వచ్చిన తరువాతే అసలు మ్యాటర్ బయటకు వస్తుందని, కేసు విచారణలో ఉందని థానే జిల్లా పోలీసులు తెలిపారు.