Lady: ఏదో చెయ్యాలని అనుకున్నాడు, ఏదో జరిగిపోయింది, ఓవర్ గా ఆలోచిస్తే ?
బెంగళూరు/చెన్నై/తిరువూర్: వివాహం చేసుకున్న రెండు కుటుంబాల దంపతులు సంతోషంగా కాపురం చేశారు. వేర్వేరు ప్రాంతాలకు చెందిన రెండు కుటుంబాలు ఒకే ఊరిలో కాపురం పెట్టారు. రెండు కుటుంబాలు కలుసుకుంటాన్నాయి. ఆ సందర్బంలో అసలు కథ మొదలైయ్యింది. ఎవరు ఎక్కడి నుంచి వచ్చారో తెలీకుండా కథ ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్లిపోయింది.
తమిళనాడులోని తిరుపూర్లో తన భార్యతో వివాహేతర సంబంధం పెట్టుకున్న బీహార్కు చెందిన యువకుడిని నరికి చంపిన జార్ఖండ్ కూలీ కోసం పోలీసులు వెతుకుతున్నారు. బీహార్ రాష్ట్రానికి చెందిన పవన్ యాదవ్ తన కుటుంబంతో కలిసి తిరుపూర్ వీవర్ కాలనీలో ఉంటూ బనియన్ గార్మెంట్స్ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు.

అదేవిధంగా జార్ఖండ్కు చెందిన ఉపేంద్ర థారి అలియాస్ ఉపేంద్ర అదే వీవర్స్ కాలనీ ప్రాంతంలో అతని కుటుంబంతో కలిసి ఉంటూ డ్రైవర్గా పనిచేస్తున్నాడు. భవాన్యాదవకు ఉపేంద్ర భార్య చిత్రాదేవితో అక్రమ సంబంధం పెట్టుకున్నాడు. చాలా కాలం పాటు ఈ విషయం బయటకు రాలేదు. తరువాత ఈ విషయం ఉపేంద్రకు తెలిసింది.
ఈ విషయంపై నేరుగా పవన్ యాదవ్ ను అడగవచ్చని భావించిన ఉపేంద్ర రాత్రి పవన్ యాదవ్ ఇంటికి వెళ్లి వాగ్వాదానికి దిగాడు. ఈ వాగ్వాదం కొద్ది సేపటికే ఎక్కడికో వెళ్లిపోయింది. దీంతో కోపోద్రిక్తుడైన ఉపేంద్ర తాను పట్టుకున్న కొడవలితో పవన్ యాదవ్ తల, చేతులతో పాటు అతని శరీరంలోని ఇతర చోట్ల నరికి పారిపోయాడు.
ఇందులో తీవ్రంగా గాయపడిన పవన్ యాదవ్ను 108 అంబులెన్స్లో తిరుపూర్ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. మెరుగైన చికిత్స నిమిత్తం కోయంబత్తూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. చికిత్స విఫలమై అతను మృతి చెందాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు పవన్ యాదవ్ మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పరారైన ఉపేంద్ర కోసం గాలిస్తున్నారు.












Click it and Unblock the Notifications