Lady leader: లీడర్ రేఖాను వదిన, అనుచరులే చంపేశారు, 780 పేజీల చార్జ్ షీట్, ఫ్రెండ్స్ తో డీల్ !
బెంగళూరు: ఐటీ హబ్ బెంగళూరులో మాజీ కార్పోరేటర్ రేఖా కదిరేషన్ అలియాస్ రేఖాను ఆమె కుటంబ సభ్యులు, నమ్ముకున్న అనుచరులే హత్య చేశారని పోలీసులు నిర్దారించారు. పట్టపగలు చుట్టుపక్కల వాళ్లు చూస్తున్న సమయంలోనే మాజీ కార్పోరేటర్, అధికార బీజేపీ పార్టీకి చెందిన రేఖా కదిరేషన్ హత్యకు గురైయ్యింది. తనకు రక్షణ కల్పిస్తాడని వెంటపెట్టుకున్న బాడీగార్డు, అతని అనుచరులు కలిసి రేఖా కుటుంబ సభ్యులతో కుమ్మక్కు అయ్యి ఆమెను దారుణంగా నరికి చంపేశారని పోలీసుల విచారణలో వెలుగు చూసింది. రేఖా హత్య కేసులో 8 మంది మీద కేసు నమోదు చేసిన పోలీసు అధికారులు 780 పేజీల చార్జ్ షీటు తయారు చేశారని విశ్వసనీయ సమాచారం. రాజకీయ ప్రత్యర్థులు కాకుండా నమ్ముకున్న వాళ్లు, కుటుంబ సభ్యులు, రోజు వెంటఉండే వాళ్లు రేఖా కదిరేషన్ ను దారుణంగా హత్య చేశారని వెలుగు చూడటంతో ఆమె అనుచరులు హడలిపోయారు. గతంలో రేఖా భర్త, బీజేపీ నాయకుడు కదిరేషన్ ను ఆయన గుడి ఆవరణంలో ఆయన వెంట ఉన్న అనుచరులే దారుణంగా నరికి చంపేశారు.

మాజీ కార్పోరేటర్
బెంగళూరు నగరంలోని ఛలవాదిపాళ్య వార్డు మాజీ కార్పోరేటర్, బీజేపీ నాయకులురాలు రేఖా కదిరేష్ జూన్ 24వ తేదీన ఉదయం ప్లవర్ గార్డెన్ లోని ఆమె కార్యాలయానికి వెళ్లింది. తరువాత కార్యాయంలో శుభ్రం చేసే వ్యక్తి వెళ్లాడు. కార్యాలయం బయట రేఖా కదిరేశన్ బాడీగార్డు ఉన్నాడు. ఉదయం 10. 30 గంటల సమయంలో అక్కా అంటూ బయట నుంచి ఇద్దరు పిలిచారు. రేఖా కదిరేష్ కార్యాలయంలో నుంచి లేచి బయటకు వెళ్లింది.

నడిరోడ్డులో నరికి చంపేశారు
కార్యాలయం నుంచి రేఖా కదిరేష్ బయటకు వచ్చిన వెంటనే అక్కడ ఉన్న ముగ్గురు ఒక్కసారిగా కత్తులతో ఆమెను నరికేశారు. కిందపడిన రేఖా కదిరేష్ గొంతుకోసేశారు. నిమిషంలోనే పనిముగించుకున్న నిందితులు అక్కడి నుంచి పరారైనారు. కిందపడిపోయిన రేఖా గొంతు తెగిపోవడంతో కేకలు వెయ్యలేకపోయింది. విషయం గుర్తించిన స్థానికులు రేఖాను కెంపేగౌడ ఆసుపత్రికి తరలించారు. గొంతు పూర్తిగా తెగిపోవడం, శరీరం మీద కత్తిపోట్లు ఎక్కువ పడడటంతో చికిత్స విఫలమై రేఖా ప్రాణాలు పోయాయి. బెంగళూరులో మాజీ కార్పోరేటర్, కర్ణాటకలో అధికారంలో ఉన్న బీజేపీ నాయకురాలు రేఖా కదిరేష్ హత్యకు గురి కావడం అప్పట్లో బెంగళూరులో కలకలం రేపింది.

రేఖా మాజీ రైట్ హ్యాండ్
మాజీ కార్పోరేటర్ రేఖా కదిరేష్ కు ప్రత్యర్థుల నుంచి ప్రాణహాని ఉండటంతో ఆమె పీటర్ అనే బాడిగార్డును పెట్టుకున్నారు. తరువాత పీటర్ ను రేఖా కదిరేషన్ దూరం పెట్టింది. జూన్ 24వ తేదీ ఉదయం 10.30 గంటల వరకు రేఖా కార్యాలయం బయట ఆమె మాజీ బాడీగార్డు పీటర్ ఉన్నాడు. ఉదయం 10.35 గంటలకే రేఖా కదిరేష్ మీద ముగ్గురు దాడి చేసి నరికేశారని ప్రత్యక్షసాక్షు అప్పట్లో పోలీసులకు చెప్పారు. రేఖాను ఆమె మాజీ బాడీగార్డు పీటర్, అతని బంధువు స్టీఫెన్, అజయ్ హత్య చేశారని అప్పట్లో పోలీసులు అనుమానం వ్యక్తం చేశారు.

రేఖా భర్త కూడా అదే టైపులో హత్య
ఛలవాదిపాళ్య మాజీ కార్పోరేటర్ రేఖా భర్త కదిరేషన్ కూడా గతంలో ఇలాగే దారుణ హత్యకు గురైనాడు. 2018 ఫిబ్రవరి 7వ తేదీన ప్లవర్ గార్డెన్ లోని ఓ దేవాలయం ఆవరణంలోనే కదిరేషన్ ను శోభన్, స్టీఫెన్ అతని అనుచరులు దారుణంగా నరికి చంపేశారు. కదిరేషన్ హత్య కేసులో జైలుకు వెళ్లిన స్టీఫెన్ ఇటీవలే బెయిల్ మీద బయటకు వచ్చాడు. భర్త కదిరేషన్ ను చంపిన స్టీఫెన్ అతని అనుచరులు బీజేపీ నాయకురాలు రేఖాను కూడా దారుణంగా చంపేయడం కలకలం రేపింది.

రేఖా వదిన మాలా ప్రతీకారం
కదిరేషన్ సోదరి మాలా బీజేపీ నాయకురాలు రేఖా కదిరేషన్ హత్య కేసులో ప్రధాన నిందితురాలు. అప్పట్లో సోదరుడు కదిరేషన్ తో కలిసి మాలా రౌడీయిజం చేసి ఛలవాదిపాళ్య, ఫ్లవర్ గార్డెన్ లో లేడీ ఢాన్ గా గుర్తింపు తెచ్చుకుంది. రేఖా కదిరేషన్ ను వివాహం చేసుకున్న తరువాత కదిరేషన్ ఆమె అక్క మాలాను పెద్దగా పట్టించుకోలేదని, అందుకే మాలా ఆమె ఆడపడుచు రేఖా మీద కక్ష పెంచుకుందని పోలీసు అధికారులు అంటున్నారు.

8 మంది మీద ఎఫ్ఐఆర్, చార్జ్ షీట్
బీజేపీ నాయకురాలు రేఖా కదిరేషన్ హత్య కేసులో 8 మంది మీద బెంగళూరులో కాటన్ పేట పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. రేఖా ఆడపడుచు మాలా, కదిరేష్ మాజీ రైట్ హ్యాండ్ పీటర్ (46), సూర్యా (20), స్టీఫెన్ (21), పురుషోత్తమ్ (22), అజయ్ (21), అరుణ్ కుమార్ (36), సెల్వరాజ్ అలియాస్ క్యాప్టెన్ (36) అనే నిందితుల మీద ఎఫ్ఐఆర్ నమోదు అయ్యింది.

రేఖా హత్య కేసులో 780 పేజీల చార్జ్ షీట్ !
బీజేపీ నాయకురాలు రేఖా హత్య కేసులో 8 మంది మీద కేసు నమోదు చేసిన పోలీసు అధికారులు 780 పేజీల చార్జ్ షీటు తయారు చేశారని విశ్వసనీయ సమాచారం. రాజకీయ ప్రత్యర్థులు కాకుండా నమ్ముకున్న వాళ్లు, కుటుంబ సభ్యులు, రోజు వెంటఉండే వాళ్లు రేఖా కదిరేషన్ ను దారుణంగా హత్య చేశారని వెలుగు చూడటంతో ఆమె అనుచరులు హడలిపోయారు.
Recommended Video

నమ్ముకున్న వాళ్లు, కుటుంబ సభ్యులే కిల్లర్స్
ఐటీ హబ్ బెంగళూరులో మాజీ కార్పోరేటర్ రేఖా కదిరేషన్ అలియాస్ రేఖాను ఆమె ఆడపడుతు మాలా, భర్త కదిరేషన్ నమ్ముకున్న అనుచరులే ఆమెను హత్య చేశారని పోలీసులు నిర్దారించారు. పట్టపగలు చుట్టుపక్కల వాళ్లు చూస్తున్న సమయంలోనే మాజీ కార్పోరేటర్, అధికార బీజేపీ పార్టీకి చెందిన రేఖా కదిరేషన్ హత్యకు గురైయ్యింది. తనకు రక్షణ కల్పిస్తాడని వెంటపెట్టుకున్న ఒకప్పటి బాడీగార్డు, అతని అనుచరులు కలిసి రేఖా కుటుంబ సభ్యులతో కుమ్మక్కు అయ్యి ఆమెను దారుణంగా నరికి చంపేశారని పోలీసుల విచారణలో వెలుగు చూసింది.
-
పీఎం కిసాన్ - అన్నదాత సుఖీభవ నిధుల జమ: ఖాతాల్లో రూ 6 వేలు, తాజా నిర్ణయం..!! -
మోదీ కేబినెట్ లోకి జనసేన, ఏపీలో బీజేపీకి మరో మంత్రి పదవి - ఆయనకే ఛాన్స్..!! -
మందుబాబులకు కిక్ ఇచ్చే కబురు- ఏప్రిల్ 1 నుండి.. -
విజయ్, త్రిష పెళ్లి డేట్ ఫిక్స్.. ఎన్నికలకు ముందే..!! -
T20 World Cup Final: అచ్చిరాని స్టేడియంలో కివీస్ తో ఫైనల్-పిచ్ లో కీలక మార్పు..! -
T20 WC 2026 ఫైనల్ గెలిచేది ఆ జట్టే: మహమ్మద్ అమీర్ -
T20 World Cup: భారత్ కు అదే మైనస్, మాకు ప్లస్-ఫైనల్ పై తేల్చేసిన కివీస్ కెప్టెన్..! -
H1B Visa న్యూ రూల్- గుడ్ న్యూస్ -
140 కోట్ల మంది కలలు ఛిద్రం.. ప్రపంచ కప్ నుంచి భారత్ అవుట్! -
విజయ్ నన్ను రోడ్డున పడేశాడు: మళ్లీ కోర్టుకెక్కిన సంగీత -
వారానికో సూపర్ హిట్ సినిమా ఎలా ఇస్తావ్ అన్నా..! -
today rashiphalalu: మీనరాశిలో శనిశుక్రుల బలమైన సంయోగంతో వీరికి జాక్ పాట్!












Click it and Unblock the Notifications