Lady: భర్తకు గుడ్ బై, ప్రియుడితో రొమాన్స్ చేస్తున్న ముగ్గురు కూతుర్ల తల్లి, వీడియోలు తీసి వైరల్ చేసి ?
చెన్నై/విల్లుపురం: భర్తతో విడిపోయిన వివాహిత మహిళ వేరే యువకుడితో అక్రమ సంబంధం పెట్టుకుంది. ప్రియుడితో కలిసి ఆమె నిర్జనప్రదేశంలోకి వెళ్లి రొమాన్స్ చేస్తోంది. ఇద్దరు యువకులు అక్రమ సంబంధం పెట్టుకున్న జంట రొమాన్స్ చేస్తున్న సమయంలో వీడియో తీశారు. మరోరోజు అదే ప్రాంతానికి ఆ జంట వెళ్లింది. ఆ రోజు ప్రియుడిని చితకబాది అక్కడి నుంచి తరిమేసిన కామాంధులు ఆమె మీద సామూహిక అత్యాచారం చేస్తూ వీడియోలు తీశారు. అప్పటి నుంచి ఆమెను బ్లాక్ మెయిల్ చేసి పిలిపించుకుని పదేపదే అత్యాచారం చేస్తూ చివరికి డబ్బులు వసూలు చేశారు. ఇదిచాలదు అన్నట్లు ముగ్గురు కూతుర్ల తల్లి రొమాన్స్ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ చేసి ఆమె జీవితంతో చెలగాటం ఆడుకున్నారు.
Wife: కూతురికి పెళ్లి చేశారు, ఆంటీ మీద అంకుల్ కు డౌట్, ఇంటికి వెళ్లి ఏం చేశాడంటే ?, బెడ్ రూమ్ లో !
ముగ్గురు కుమార్తెలు
తమిళనాడులోని విల్లుపురం జిల్లాలోని మరకానం ప్రాంతంలో 42 ఏళ్ల మహిళ నివాసం ఉంటున్నది. వివాహం చేసుకున్న మహిళ ఆమె భర్తతో కొన్ని సంవత్సరాలు సంతోషంగా కాపురం చేసింది. దంపతులకు ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. మూడు సంవత్సరాల క్రితం త దంపతులు మద్య తేడాలు వచ్చి విడిపోయారు.
ప్రియుడిని సెట్ చేసుకున్న మహిళ
కొత్త కుప్పం ప్రాంతంలోని చిన్నముడియార్ లో కూతుర్లతో కలిసి వివాహిత మహిళ వేరుగా కాపురం ఉంటున్నది. భర్తతో విడిపోయిన వివాహిత మహిళ పుదుచ్చేరికి చెందిన యువకుడితో అక్రమ సంబంధం పెట్టుకుంది. ముగ్గురు కుమార్తెను పోషించడానికి ఆమె విల్లుపురంలోని ఓ లాడ్జ్ లో ఉద్యోగం చేస్తోంది. ఉద్యోగానికి వెళ్లి వస్తున్న ఆమె ప్రియుడితో కలిసి నిర్జనప్రదేశంలోకి వెళ్లి రొమాన్స్ చేస్తోంది.
కామాంధులు ఎంట్రీ
ఎప్పటిలాగే వివాహిత మహిళ ఆమె ప్రియుడితో కలిసి తైలమరాలో కలుసుకుంది. తైలమరాలో నివాసం ఉంటున్న భరతన్ అనే యువకుడు, అతని స్నేహితుడు అటువైపు వెళ్లారు. ఆ సందర్బంలో వివాహిత మహిళ, ఆమె ప్రియుడు మంచిరసపట్టులో రొమాన్స్ చేస్తున్న విషయం గమినించిన భరతన్ అతని స్నేహితులు వీడియోలు తీశారు.
మహిళ మీద గ్యాంగ్ రేప్, వీడియోలు తీసిన కామాంధులు
మహిళ రొమాన్స్ వీడియోలు తీసిన భరతన్ అతని స్నేహితుడు ఆరోజు సైలెంట్ గా ఉండిపోయారు. రెండు రోజుల తరువాత ఆ జంట అదే ప్రాంతానికి వెళ్లింది. ఆ రోజు ప్రియుడిని చితకబాదిన భరతన్, అతని స్నేహితుడు ఇక్కడే ఉంటే చంపేస్తామని అతన్ని అక్కడి నుంచి తరిమేశారు. తరువాత కామాంధులు భరతన్, అతని ఫ్రెండ్ మహిళ మీద సామూహిక అత్యాచారం చేస్తూ వీడియోలు తీశారు.
రొమాన్స్ వీడియోలతో బ్లాక్ మెయిల్
మహిళ మీద గ్యాంగ్ రేప్ చేసిన భరతన్, అతని స్నేహితుడు ఈ విషయం బయటకు చెబితే నిన్ను, నీ ప్రియుడిని చంపేస్తామని ఆమెను బెదిరించి వదిలేశారు. అప్పటి నుంచి ఆమెను బ్లాక్ మెయిల్ చేసి పిలిపించుకుంటున్న భరతన్,అతని స్నేహితుడు పదేపదే ఆమె మీద సామూహిక అత్యాచారం చేస్తూ వీడియోలు తీసి ఆమెను బ్లాక్ మెయిల్ చేశారు.
టార్చర్ తట్టుకోలేక ?
మహిళ భయపడిందని తెలుసుకున్న భరతన్ ఆమెను బ్లాక్ మెయిల్ చేసి డబ్బులు వసూలు చేశాడు. టార్చర్ ఎక్కువ కావడంతో మహిళ ఆత్మహత్య చేసుకోవాలని అనుకుంది. ఆత్మహత్య చేసుకుంటే ముగ్గురు కుమార్తెలు అనాథలు అవుతారని భయపడిన మహిళ వెనక్కి తగ్గింది. ఇంతకాలం కామాంధులు కోరికలు తీర్చుతూ వచ్చింది.
సోషల్ మీడియాలో వైరల్
ఇటీవల
తన
దగ్గర
డబ్బులు
లేవని,
మీరు
పిలిచిన
ప్రతిసారి
నేనురాలేనని
మహిళ
భరతన్
కు
ఎదురుతిరిగింది.
మా
కోరికలు
తీర్చడానికి
రాలేదని
రగిలిపోయిన
భరతన్,
అతని
ఫ్రెండ్
ముగ్గురు
కూతుర్ల
తల్లి
రొమాన్స్
వీడియోలు
వాట్సాప్
గ్రూప్స్
లో,
సోషల్
మీడియాలో
వైరల్
చేశారు.
విషయం
తెలుసుకున్న
బాధితురాలు
కొత్త
కుప్పం
పోలీసులకు
ఫిర్యాదు
చేసింది.
భరతన్,
అతని
స్నేహితుడి
మీద
కేసు
నమోదు
చేసి
వారి
కోసం
గాలిస్తున్నామని
పోలీసులు
తెలిపారు.