అంబేడ్కర్ పేరు మర్చిపోతారా?- గణతంత్ర వేడుకల్లో మంత్రిపై మహిళా ఆఫీసర్ ఫైర్ !!
భారతదేశ 77వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా మహారాష్ట్ర నాసిక్లో నిర్వహించిన వేడుకలు అనుకోని ఘటనతో ఒక్కసారిగా ఉత్కంఠకు తెరలేపాయి. స్థానిక పోలీస్ పరేడ్ గ్రౌండ్లో జరిగిన ఈ వేడుకల్లో రాష్ట్ర గ్రామీణాభివృద్ధి మంత్రి గిరీశ్ మహాజన్ ప్రసంగిస్తుండగా, అటవీ శాఖకు చెందిన మహిళా అధికారిణి మాధవి (మధురి) జాదవ్ అకస్మాత్తుగా నిరసన వ్యక్తం చేయడం సంచలనంగా మారింది.
అంబేడ్కర్ పేరు ప్రస్తావించలేదని నిరసన..
కాగా జాతీయ జెండా ఆవిష్కరణ అనంతరం మంత్రి మహాజన్ ప్రసంగం ప్రారంభించారు. అయితే ఆయన తన ప్రసంగంలో భారత రాజ్యాంగ నిర్మాత డా. బి.ఆర్. అంబేడ్కర్ పేరును ప్రస్తావించలేదని గమనించిన మాధవి జాదవ్ తీవ్ర ఆవేదనకు గురయ్యారు. వెంటనే తన సీటు నుంచి లేచి, "రాజ్యాంగం అమల్లోకి వచ్చిన ఈ పవిత్ర దినాన, రాజ్యాంగ నిర్మాత పేరే చెప్పరా?" అంటూ వేదిక వైపు దూసుకెళ్లారు. ఆమె గట్టిగా ప్రశ్నించడం వల్ల కార్యక్రమంలో కాసేపు గందరగోళం నెలకొంది.

పరేడ్ గ్రౌండ్లో కలకలం..
అయితే మాధవి జాదవ్ నినాదాలు చేస్తూ ముందుకు రావడంతో అక్కడ ఉన్న అధికారులు, ప్రజలు, భద్రతా సిబ్బంది అయోమయంలో పడ్డారు. కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న యాంకర్ కూడా అంబేడ్కర్ పేరును ప్రస్తావించకపోవడం ఆమె ఆగ్రహానికి మరో కారణంగా మారింది. దీంతో అధికారిక వేడుకలు కొన్ని నిమిషాలు నిలిచిపోయాయి. పరిస్థితి మరింత ఉద్రిక్తంగా మారకుండా పోలీసులు వెంటనే స్పందించారు. మహిళా కానిస్టేబుళ్లు మాధవి జాదవ్ను అదుపులోకి తీసుకుని అక్కడి నుంచి తరలించారు. భద్రతా చర్యలతో కొద్ది సేపట్లోనే పరిస్థితి అదుపులోకి వచ్చి, మిగతా కార్యక్రమాన్ని ప్రశాంతంగా పూర్తి చేశారు.
సోషల్ మీడియాలో వీడియోలు వైరల్..
ఈ ఘటనకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వేగంగా వైరల్ అయ్యాయి. వాటిలో మాధవి జాదవ్ భావోద్వేగంగా మాట్లాడుతూ, "నన్ను సస్పెండ్ చేసినా సరే, ఉద్యోగం పోయినా భయపడను. అవసరమైతే కూలీ పని చేసుకుంటాను. కానీ బాబాసాహెబ్ అంబేడ్కర్ గౌరవాన్ని విస్మరించడం చూస్తూ ఊరుకోను" అని చెప్పిన మాటలు చర్చనీయాంశంగా మారాయి. సమానత్వం, న్యాయం, హక్కులు అన్నీ అంబేడ్కర్ కృషి వల్లే సాధ్యమయ్యాయని ఆమె పేర్కొన్నారు.
అలానే మాధవి జాదవ్ ఇంకా మాట్లాడుతూ.. ప్రోటోకాల్ ప్రకారమే వేదిక దగ్గరకు వెళ్లానని.. మంత్రి కనీసం ఒక్కసారి కూడా బాబాసాహెబ్కు నివాళి అర్పించలేదని వాపోయారు. యాంకర్కు చెప్పినా, భద్రత కారణాలతో తనను అడ్డుకున్నారని చెప్పుకొచ్చారు. మొత్తం కార్యక్రమం స్క్రిప్ట్ ప్రకారమే సాగిందని.. అందులో ఎక్కడా అంబేడ్కర్ స్మరణ లేదంటూ ఆవేదన వ్యక్తం చేశారు. అలాగే తపోవన్ ప్రాంతంలో చెట్ల నరికివేత అంశాన్ని కూడా మంత్రికి తెలియజేయాలనుకున్నానని తెలిపారు.

మంత్రి గిరీశ్ మహాజన్ స్పందన..
ఇక వివాదం తీవ్రతరం కావడంతో మంత్రి గిరీశ్ మహాజన్ స్పందించారు. "డా. బి.ఆర్. అంబేడ్కర్ పేరును ఉద్దేశపూర్వకంగా వదిలేయలేదు. అది అనుకోకుండా జరిగిన పొరపాటు మాత్రమే. దాని వెనుక ఎలాంటి దురుద్దేశం లేదు. జరిగినదానికి విచారం వ్యక్తం చేస్తున్నాను" అని ఆయన తెలిపారు. తాను 'భారత్ మాతాకీ జై', 'వందేమాతరం', 'శివాజీ మహారాజ్ కీ జై' వంటి నినాదాలు చేశానని కూడా స్పష్టం చేశారు. ఈ ఘటన రాష్ట్రవ్యాప్తంగా చర్చకు దారి తీసింది. గణతంత్ర దినోత్సవం వంటి రాజ్యాంగ ప్రాముఖ్యత ఉన్న కార్యక్రమాల్లో డా. అంబేడ్కర్ ప్రస్తావన ఎంత ముఖ్యమో మరోసారి గుర్తు చేసింది. అదే సమయంలో అధికారిక వేడుకల్లో ప్రోటోకాల్, భద్రతా నిబంధనలు పాటించాల్సిన అవసరంపై కూడా పరిపాలనా వర్గాల్లో చర్చ జరుగుతోంది.
-
'ఆ ఒక్క కండీషన్ తో స్టార్ హీరోతో నిజంగానే శోభనం'.. హీరోయిన్ సంచలనం..!! -
అల్లు అర్జున్ "పుష్ప - 3"లో స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ భార్య.. -
హిట్ కొట్టాడురా సామీ!.. మిస్టరీ థ్రిల్లర్ అదిరిపోయింది..! -
ఓటీటీలోకి పవన్ కల్యాణ్ 'ఉస్తాద్ భగత్ సింగ్'.. ఆ రోజు నుంచే స్ట్రీమింగ్..? -
ఈ సినిమా చూస్తే ఈఎంఐల జోలికే పోరు సామి! -
వంట గ్యాస్ బుక్ చేసినా రావటం లేదా, ఇలా చేయండి.. వెంటనే..!! -
తిరుమలకు వెళ్లేవారికి గుడ్ న్యూస్, ఇక నేరుగా...సులభంగా..!! -
ప్రభాస్ ఫాలో అవుతున్న ఏకైక తెలుగు హీరో ఎవరో తెలుసా..? -
ఆసియాలోనే అతిపెద్ద, ప్రపంచంలో నాలుగో అతిపెద్ద విమానాశ్రయాన్ని ప్రారంభించనున్న ప్రధాని మోదీ -
ఏపీలో పెరగనున్న అసెంబ్లీ సీట్లు, జిల్లాల వారీ జాబితా - కలిసొచ్చేదెవరికి..!! -
కోర్టు బ్యూటీ శ్రీదేవీ "బ్యాండ్ మేళం" తో మళ్లీ హిట్ కొట్టేసిందయ్యో !!! -
Holidays: వరుసగా మూడు రోజులు విద్యాసంస్థలు, బ్యాంకులు క్లోజ్












Click it and Unblock the Notifications