lady principal: కారు అడ్డగించి మేడమ్ ను కిందకు దింపి పెట్రోల్ పోసి నిప్పంటించిన ఓల్డ్ స్టూడెంట్ !
కాలేజ్ లో బాగా చదువుకున్న ఓ యువకుడు అదే కాలేజ్ లేడీ ప్రిన్సిపాల్ మీద కక్ష పెంచుకున్నాడు. ఇప్పటికే ఒకసారి హత్యాయత్నం చేసిన ఆ యువకుడు రెండో సారి ఆమె మీద పెట్రోల్ పోసి తగలబెట్టాడు.
భోపాల్/మధ్యప్రదేశ్: కాలేజ్ లో బాగా చదువుకున్న ఓ యువకుడు అదే కాలేజ్ లేడీ ప్రిన్సిపాల్ మీద కక్ష పెంచుకున్నాడు. ఇప్పటికే ఆమె మీద ఒకసారి హత్యాయత్నం చేసిన ఆ యువకుడు చివరికి రెండో సారి ఆమె మీద పెట్రోల్ పోసి తగలబెట్టాడు. కాలేజ్ లో చదువు పూర్తి చేసినా తనకు మార్కులిస్టు ఇవ్వడం లేదని ఆరోపిస్తూ కాలేజ్ లేడీ ప్రిన్సిపాల్ కు నిప్పంటించాడు.
మధ్యప్రదేశ్లోని ఇండోర్లోని బిఎమ్ కాలేజ్ ఆఫ్ ఫార్మసీ కాలేజ్ ప్రిన్సిపాల్ విముక్తా శర్మా ( 54) అనే మహిళ సాయంత్రం నాలుగు గంటలకు కాలేజ్ లో పని ముగించుకుని కారులో ఇంటికి బయలుదేరడానికి సిద్దం అయ్యారు. కళాశాల పూర్వ విద్యార్థి అశుతోష్ శ్రీవాత్సవ (24) కారును అడ్డుకున్నాడు. తరువాత కాలేజ్ ప్రిన్సిపాల్ విముక్తా శర్మాతో వాగ్వాదానికి దిగాడు. ఆ సమయంలో ఆమె మీద పెట్రోల్ పోసి సిగరెట్ లైటర్ తో నిప్పంటించాడు.

ఈ మంటల్లో లేడీ ప్రిన్సిపాల్ విముక్తా శర్మా కాలిపోయి ఆర్తనాదాలు చేశారు. కేకలు వినిపించడంతో ఆ ప్రాంతంలో ఉన్న వారు కళాశాల సిబ్బంది ఆమెను రక్షించి ఆసుపత్రికి తరలించారు. అప్పటికే దాదాపు 80 శాతం కాలిన గాయాలతో ఆస్పత్రిలో చేరిన కాలేజ్ ప్రిన్సిపాల్ విముక్తా శర్మా పరిస్థితి విషమంగా ఉండడంతో ఐసీయూలో చికిత్స పొందుతున్నారు. ఈ ఘటన అనంతరం ఆత్మహత్యకు యత్నించిన మాజీ విద్యార్థి శ్రీవత్సవాను పోలీసులు అరెస్ట్ చేశారు.
గతేడాది జులైలో చదువు పూర్తి చేశానని, తనకు మార్కుల జాబితా ఇవ్వకుండా కళాశాల యాజమాన్యం వేధిస్తోందని శ్రీవత్సవా ఆరోపిస్తున్నాడు, ఈ నేపథ్యంలో కళాశాల యాజమాన్యం మార్కుల పత్రం ఇవ్వడంలో జాప్యం చేయడంతో విద్యార్థి ఆగ్రహం వ్యక్తం చేసినట్లు సమాచారం. ఈ విషయంలో గతంలో కాలేజీ ప్రొఫెసర్పై కత్తితో దాడి చేశాడని, ప్రిన్సిపాల్ మీద దాడి చేసి జైలుకు వెళ్లి బెయిల్పై బయటకు వచ్చాడని పోలీులు అన్నారు. బెయిల్ మీద వచ్చిన శ్రీవత్సవ చివరికి లేడీ ప్రిన్సిపాల్ మీద పెట్రోల్ పోసి నిప్పంటించడం కలకలం రేపింది.
-
ఆ లాజిక్ ఏంటో ? చంద్రబాబును ఇరుకునపెట్టేసిన సాయిరెడ్డి..! -
40 ఏళ్లలో లేని అతిపెద్ద పసిడి పతనం. 1983 సీన్ రిపీట్! -
పాతాళానికి బంగారం ధరలు- రంజాన్ పండగ వేళ -
తమిళనాడులో ఆ పార్టీదే అధికారం: విజయ్ రాకతో మారిన ఈక్వేషన్లు -
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
మేషరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, ధనుస్సు రాశులకు ఏప్రిల్ నెలలో రాజయోగం -
బంగాళాఖాతంపై ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
త్వరలో తిరుపతి, హైదరాబాద్కు నేరుగా రైళ్లు: ఆ జిల్లాకు కేంద్రమంత్రి తీపికబురు! -
రామ్ చరణ్ బర్త్ డేకు బిగ్ సర్ ప్రైజ్: `పెద్ది` నుంచి -
తిరుమలలో సీఎం చంద్రబాబుకు భక్తుల స్పెషల్ రిక్వెస్ట్, అక్కడే ఆదేశాలు..!!












Click it and Unblock the Notifications