Lady: అపార్ట్ మెంట్ లో ఒంటరి మహిళ దారుణ హత్య, మొబైల్ ఫోన్ డేటా, సీసీటీవీల దెబ్బతో ?, మ్యాటర్ !
బెంగళూరు: అపార్ట్ మెంట్ లో నివాసం ఉంటున్న మహిళ వడ్డీ వ్యాపారం చేస్తోంది. మహిళకు పరిచయం ఉన్న వాళ్లు, బంధువులు సూచించిన వాళ్లకు ఆమె వడ్డీకి డబ్బులు ఇస్తోంది. మహిళ దగ్గర వడ్డీకి డబ్బులు తీసుకున్న వాళ్లు కొందరు ఆమె అపార్ట్ మెంట్ కే వెళ్లి వడ్డీ చెల్లిస్తున్నారు. కొందరి దగ్గరకు ఆమె వెళ్లి వడ్డీ వసూలు చేసుకున్నది, తెలిసిన వాళ్లకు వడ్డీకి డబ్బులు ఇప్పించిన బంధువులు వడ్డీ వసూలు చేసి టైమ్ ఉన్నప్పుడు మహిళ ఇంటికి వెళ్లి ఇస్తున్నారు. ఇటీవల వడ్డీ వ్యాపారం చేస్తున్న మహిళ ఆమె నివాసం ఉంటున్న అపార్ట్ మెంట్ లోనే దారుణ హత్యకు గురైయ్యింది. ఇంట్లో ఒంటరిగా ఉంటున్న మహిళ హత్యకు గురికావడంతో ఆ ప్రాంతంలోని ప్రజలు హడలిపోయారు. రంగంలోకి దిగిన పోలీసులు మహిళ మొబైల్ నెంబర్ కాల్ డేటా, అపార్ట్ మెంట్ లో, ఆ పరిసర ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన సీసీటీవీ కెమెరాలు పరిశీలించి ఇద్దరిని పట్టుకున్నారు. మహిళ హత్య కేసులో మరో కేటుగాడు తప్పించుకున్నాడని పోలీసులు అంటున్నారు.
Aunty: కూతురి ఫ్రెండ్ మీద లైంగిక దాడి చేసిన ఆంటీ, రివర్స్ లో ?. కామాంధురాలి కథ ఫినిష్, దెబ్బకు !
ఒంటరిగా ఉంటున్న మహిళ
బెంగళూరు నగరంలోని వర్తూరు పోలీస్ స్టేషన్ పరిధిలోని కాచమారనహళ్లిలోని ఓ అపార్ట్ మెంట్ లో సునితా ప్రసాద్ అలియాస్ సునితా (55) అనే మహిళ నివాసం ఉంటున్నారు. అపార్ట్ మెంట్ లో నివాసం ఉంటున్న సునితా ప్రసాద్ తెలిసి వాళ్లతో మాత్రమే డబ్బులు ఇచ్చి తక్కువ వడ్డీ తీసుకుని వ్యాపారం చేస్తోందని సమాచారం.
ఇంటికే వెళ్లి ఇస్తున్నారు
సునితా ప్రసాద్ కు పరిచయం ఉన్న వాళ్లు, బంధువులు సూచించిన వాళ్లకు ఆమె చాలా తక్కువ వడ్డీకి డబ్బులు ఇస్తోంది. సునితా ప్రసాద్ దగ్గర వడ్డీకి డబ్బులు తీసుకున్న వాళ్లు కొందరు ఆమె అపార్ట్ మెంట్ కే వెళ్లి వడ్డీ చెల్లిస్తున్నారు. సునితా ప్రసాద్ కొందరి దగ్గరకు వెళ్లి వడ్డీ వసూలు చేసుకున్నదని సమాచారం.
అపార్ట్ మెంట్ లో దారుణ హత్య
తెలిసిన వాళ్లకు వడ్డీకి డబ్బులు ఇప్పించిన బంధువులు వడ్డీ వసూలు చేసి టైమ్ ఉన్నప్పుడు సునితా ప్రసాద్ అపార్ట్ మెంట్ కే వెళ్లి డబ్బులు ఇస్తున్నారు. ఇటీవల వడ్డీ వ్యాపారం చేస్తున్న సునితా ప్రసాద్ ఆమె నివాసం ఉంటున్న అపార్ట్ మెంట్ లోనే దారుణ హత్యకు గురైయ్యింది. సునితా ప్రసాద్ హత్యకు గురైన కొన్ని రోజుల తరువాత విషయం వెలుగు చూసింది.
ఆర్థిక లావాదేవీలు
ఇంట్లో ఒంటరిగా ఉంటున్న సునితా ప్రసాద్ హత్యకు గురికావడంతో ఆ ప్రాంతంలోని ప్రజలు హడలిపోయారు. రంగంలోకి దిగిన వర్తూరు పోలీసులు మహిళ మొబైల్ నెంబర్ కాల్ డేటా, అపార్ట్ మెంట్ లో, ఆ పరిసర ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన సీసీటీవీ కెమెరాలు పరిశీలించి ఇద్దరిని పట్టుకున్నారు. ఇమ్రాన్, వెంకటేష్ అనే ఇద్దరు సునితా హత్య కేసులో అరెస్టు అయ్యారు. అరెస్టు అయిన వారిలో ఆటో డ్రైవర్ కూడా ఉన్నాడని, సునితా ప్రసాద్ హత్య కేసులో మరో కేటుగాడు కిరణ్ తప్పించుకున్నాడని, నగదు వ్యవహారం వలనే ఆమె హత్యకు గురైయ్యిందని వర్తూరు పోలీసులు అంటున్నారు.