Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

Viral Video: రైతులపై దూసుకెళ్లిన కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి కారు

లక్నో: ఉత్తర ప్రదేశ్‌లోని లఖింపూర్ ఖేరిలో హింసాత్మక పరిస్థితులకు దారి తీసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. మొత్తంగా ఎనిమిది మంది మరణానికి కారణమైంది ఈ ఘటన. నలుగురు రైతులు కారు కింద పడి దుర్మరణం పాలు కాగా.. ఆ తరువాత చోటు చేసుకున్న అలర్లు, హింసాత్మక వాతావరణంలో మరో నలుగురు మరణించారు. ఇద్దరు రైతులు సంఘటనా స్థలంలోనే మృతి చెందారు. తీవ్రంగా గాయపడ్డ మరో ఇద్దరు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు.

కేంద్ర మంత్రి కారు..

కేంద్ర మంత్రి కారు..

లఖింపూర్ ఖేరి లోక్‌సభ సభ్యుడు, కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి అజయ్ కుమార్ మిశ్రా, ఆయన కుమారుడు ఆశీష్ మిశ్రా, ఉత్తర ప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కేశవ్ ప్రసాద్ మౌర్య ప్రయాణించిన నల్లరంగు ఎస్‌యూవీ కారు అది. లఖింపూర్ ఖేరి సమీపంలోని టికూనియా వద్ద జెండాలను పట్టుకుని రోడ్డు మీద నిరసన ప్రదర్శనలను చేస్తోన్న రైతులపై ఉద్దేశపూరకంగా కేంద్ర మంత్రి తన కారును పోనిచ్చారంటూ వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. ఈ విషయంలో అజయ్ మిశ్రా, ఆయన కుమారుడిపై హత్యానేరం కింద కేసు కూడా నమోదైంది.

వీడియోను వెలుగులోకి తెచ్చిన కాంగ్రెస్..

వీడియోను వెలుగులోకి తెచ్చిన కాంగ్రెస్..


ఈ వీడియోను కాంగ్రెస్ పార్టీ వెలుగులోకి తీసుకొచ్చింది. తన అధికారిక సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ట్విట్టర్‌లో దీన్ని పోస్ట్ చేసింది. 27 సెకెన్ల నిడివి ఉన్న వీడియో ఇది. జెండాలను పట్టుకుని ముందుకు నడుస్తోన్న రైతులపై ఓ నల్లరంగు ఎస్‌యూవీ కారు దూసుకెళ్లడం ఇందులో స్పష్టంగా రికార్డయింది. తొలుత తెల్లరంగు షర్ట్, లేత ఆకుపచ్చని తలపాగాను ధరించిన ఓ వృద్ధుడిని ఢీ కొట్టడం, అతను ఎగిరి బోనెట్ మీద పడటాన్ని ఈ వీడియోలో చూడొచ్చు.

ఎస్‌యూవీ వెనుకే మరో కారు..

మరి కొందరు రైతులు తమను తాము రక్షించుకోవడానికి రోడ్డు పక్కకు దూకడం ఇందులో కనిపించింది. ఎక్కడా ఆగకుండా ఎస్‌యూవీ ముందుకు దూసుకెళ్లింది. ఆ ఎస్‌యూవీ వెనుకే మరో లగ్జరీ కారు వెళ్లడం ఈ వీడియోలో రికార్డయింది. కారు దూసుకెళ్లిన తరువాత రైతులు దిగ్భ్రాంతికి గురి అయ్యారు. ఈ ఘటనలో ఇద్దరు అక్కడికక్కడే దుర్మరణంపాలు కాగా.. మరో ఇద్దరు ఆసుపత్రిలో చికిత్స పొందుతు మరణించారు. మూడు వ్యవసాయ చట్టాలకు నిరసనగా ప్రదర్శనలు చేస్తోన్న రైతులపై ఉద్దేశపూరకంగానే కేంద్ర మంత్రి తన కారును పోనిచ్చారనేది ఈ వీడియోతో స్పష్టమైందని కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆరోపిస్తోన్నారు.

హింసాత్మక పరిస్థితులు..

హింసాత్మక పరిస్థితులు..

ఆ తరువాత చోటు చేసుకున్న హింసాత్మక పరిస్థితుల్లో ముగ్గురు భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు, కారు డ్రైవర్ మృతి చెందారు. అక్కడి పరిస్థితులు పూర్తిగా అదుపు తప్పాయి. లఖింపూర్ ఖేరిలో పలుచోట్ల 144 సెక్షన్‌ను విధించింది యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం. పదవీ విరమణ చేసిన హైకోర్టు న్యాయమూర్తితో ఈ దీనిపై సమగ్ర దర్యాప్తునకు ఆదేశించింది. మృతుల కుటుంబాలకు 45 లక్షల రూపాయల ఎక్స్‌గ్రేషియోను చెల్లిస్తామని ప్రకటించిది.

Recommended Video

    పెరిగిన నిత్యవసర సరుకులపై కార్యాచరణ ప్రకటించిన టీపిసిసి మహిళా నేత సునిత రావు
    ఇంటర్‌నెట్ బంద్..

    ఇంటర్‌నెట్ బంద్..

    లఖింపూర్‌ ఖేరిలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో కొత్త వారు ఎవరూ నగరంలోనికి రాకుండా ఉండేలా పోలీసులు సరిహద్దులను మూసివేశారు. బాధిత కుటుంబాలను పరామర్శించడానికి బయలుదేరిన అఖిల భారత కాంగ్రెస్ కమిటీ ప్రధాన కార్యదర్శి, ఉత్తర ప్రదేశ్ తూర్పు ప్రాంత ఇన్‌ఛార్జ్ ప్రియాంక గాంధీ వాద్రా, మాజీ ముఖ్యమంత్రి, సమాజ్‌వాది పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్‌ సహా పలువురు ప్రతిపక్ష పార్టీల నేతలను పోలీసులు అరెస్ట్ చేశారు. ప్రియాంక గాంధీ వాద్రా ఇంకా పోలీస్ కస్టడీలోనే ఉన్నారు. లఖింపూర్ ఖేరిలో నెలకొన్న పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని జిల్లా అధికారులు ఇంటర్‌నెట్‌ను నిలిపి వేశారు.

    More From
    Prev
    Next
    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+