శుభవార్త: ఆధార్తో పాన్కార్డు లింకుకు డిసెంబర్ 31 వరకు గడువు
ఆధార్తో పాన్కార్డును లింక్ చేసే గడువును 2017, డిసెంబర్ 31వరకు పొడిగింపుసంక్షేమ పథకాలకు కూడ గడువును డిసెంబర్ 31వరకు పొడిగించిన కేంద్రంపాన్కార్డును ఆధార్తో లింక్ చేయకపోవడం వల్ల ఐటీ రిటర్న్స్ దాఖలు
న్యూఢిల్లీ: ఆధార్తో పాన్కార్డు లింకు చేయడానికి ఈ ఏడాది డిసెంబర్ 31 వకు కేంద్రం అవకాశం కల్పించింది. ఆధార్తో పాన్కార్డును లింక్ చేసుకోవడానికి ఆగష్టు 31వ, తేది చివరి తేదిగా తొలుత ప్రకటించింది.అయితే దీనిపై అనేక వినతులు వచ్చినందున కేంద్రం ఈ ఏడాది డిసెంబర్నాటికి గడువును పొడిగిస్తూ నిర్ణయం తీసుకొంది.
ఆధార్తో పాన్కార్డ్ను లింక్ చేయకపోతే ఐటీ రిటర్న్స్ దాఖలు చేయడం కుదరదు. అయితే ఆదాయపు పన్నుశాఖ ఆగష్టు 31వ, తేదిన ఆధార్తో పాన్కార్డును లింక్ చేసే ప్రక్రియకు డిసెంబర్ 31వరకు అవకాశాన్ని కల్పించింది.
2017 ఆగష్టు5వరకు ఆదాయపు పన్ను రిటర్న్స్ దాఖలు చేసినవారికి ఇది అతి పెద్ద ఊరట. ఐటీఆర్ ఫైల్ చేసే తుది గడువును ఆగష్టు 5వ, తేదివరకు పొడిగించిన కేంద్రం కేంద్ర ప్రత్యక్ష పన్ను బోర్డు, అదనంగా ఆ పన్ను చెల్లింపుదారులకు పాన్కార్డును ఆధార్తో లింక్ చేసుకోవడానికి ఆగష్టు 31వ, తేదిని గడువుగా విధించింది.
పన్ను చెల్లింపుదారులు ఆధార్తో పాన్కార్డును అనుసంధానం చేసుకోలేదు. దీంతో ఐటీఆర్ను ఫైల్ చేసుకోలేదు. ప్రభుత్వ సంక్షేమ పథకాలకు కూడ ఆధార్ కార్డును అనుసంధానం చేసుకొనే ప్రక్రియను కూడ ఈ ఏడాది డిసెంబర్ 31వ, తేది వరకు కేంద్రాన్ని సుప్రీంకోర్టు ఆదేశించింది. దీంతో అటార్నీ జనరల్ కెకె వేణుగోపాల్ మరో మూడు నెలలపాటు ఈ గడువును పెంచుతున్నట్టు సుప్రీంకోర్టుకు తెలిపారు.