లతా మంగేష్కర్ అంత్యక్రియలు .. ప్రధాని మోదీ, ఉద్ధవ్ ఠాక్రే, సచిన్, షారూక్ నివాళులు
ప్రముఖ గాయని, భారత రత్న లతా మంగేష్కర్ అంత్యక్రియలు ముంబైలోని శివాజీ పార్కులో ముగిశాయి. ఆమె అంతిమ సంస్కారాలలో పెద్ద ఎత్తున రాజకీయ, సినీ ప్రముఖులు, అభిమానులు పాల్గొన్నారు. గానకోకిల లతా జీ అంత్యక్రియలకు ప్రధాని నరేంద్ర మోదీ హాజరయ్యారు. ఆమె భౌతిక కాయానికి అంతిమ నివాళులర్పించారు. ప్రభుత్వ లాంఛనాలతో లతా అంతిమ సంస్కారాలకు నిర్వహించారు..
శివాజీ పార్కులో అంత్యక్రియలు
లతా మంగేష్కర్ మృతి పట్ల కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విచారం వ్యక్తం చేశాయి. ఆమె జ్ఞాపకార్థం రెండు రోజుల పాటు సంతాప దినాలను పాటించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. మహారాష్ట్ర ప్రభుత్వం కూడా వారం రోజుల పాటు సంతాప దినాలుగా ప్రకటించింది. శివాజీ పార్కులో లతా మంగేష్కర్ అంత్యక్రియలు నిర్వహించారు. ఈ ప్రాంతమంతా పలువురు సినీ ప్రముఖులు, రాజకీయ ప్రముఖులు, అభిమానులతో కిక్కిరిసిపోయింది. అమర్ రహే అమర్ రహే నినాదాలు మారు మ్రోగాయి. ప్రభుత్వ లాంఛనాల మధ్య లతా మంగేష్కర్ అంత్యక్రియలను నిర్వహిస్తున్నారు
లతా మంగేష్కర్ భౌతికకాయానికి ప్రధాని మోదీ నివాళులు
లతా మంగేష్కర్ అంత్యక్రియలకు ప్రధాని మోదీ హాజరయ్యారు. ఆమె భౌతిక కాయానికి నివాళులర్పించారు. అంతిమ సంస్కారాలలో పాల్గొన్నారు. లతా మంగేష్కర్ కుటుంబ సభ్యులకు ప్రగాడ సానుబూతిని తెలిపారు.
ఉద్ధవ్ ఠాక్రే నివాళులు
ముంబైలోని శివాజీ పార్క్లో ప్రముఖ గాయని లతా మంగేష్కర్కు మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్ ఠాక్రే, రాష్ట్ర మంత్రి ఆదిత్య ఠాక్రే తుది నివాళులర్పించారు. మహారాష్ట్ర ప్రభుత్వం లతా మంగేష్కర్కు ఆంత్యక్రియలను ప్రభుత్వ లాంఛనాలతో మధ్య నిర్వహించింది. ఈ కార్యక్రమానికి బీజేపీ, శివసేన, కాంగ్రెస్, ఎన్సీపీ నేతలు హాజరై లతా మంగేష్కర్ కు నివాళులర్పించారు.
లతా మంగేష్కర్ భౌతికకాయానికి సచిన్, షారూక్ నివాళులు
లతా మంగేష్కర్ అంతిమ సంస్కారాలకు క్రికెటర్ సచిన్ టెండూల్కర్, నటుడు షారూక్ ఖాన్ దంపతులు హజరైయ్యారు. ఆమె భౌతికకాయానికి నివాళులర్పించారు. వివాదాలకు అతీతంగా, అభిమానులకు సమీపంగా ఉండే మహోన్నత వ్యక్తిత్వం ఆమెదని పేర్కొన్నారు.
కరోనాతో పోరాడుతూ కన్నుమూత
గాన కోకిల లతా మంగేష్కర్ కరోనాతో పోరాడుతూ.. ముంబయి బ్రీచ్ క్యాండీ ఆసుపత్రిలో తుదిశ్వాస విడిచారు. ఆమె భౌతికకాయాన్ని మధ్యాహ్నం 12:30 గంటలకు స్వగృహానికి తీసుకువచ్చారు. మధ్యాహ్నం 2గంటల వరకు ప్రజల సందర్శనార్థం ఉంచారు. అనంతరం ముంబాయిలోని శివాజీ పార్కుకు తరలిస్తారు. అక్కడ ప్రభుత్వ లాంఛనాలతో మహారాష్ట్ర ప్రభుత్వం అంత్యక్రియలు నిర్వహించింది..