జస్టిస్ లోయా మృతి ఆర్డర్పై సమీక్ష కోరుతూ సుప్రీంను ఆశ్రయించిన లాయర్ల బృందం
న్యూఢిల్లీ: ముంబైకు చెందిన లాయర్ల బృందం సిబిఐ ప్రత్యేక జడ్జి జస్టిస్ లోయా మృతి కేసు ఆర్డర్ ను సమీక్షించాలని కోరుతూ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. గతంలో జస్టిస్ లోయామృతి కేసుపై స్వతంత్ర్య దర్యాప్తును తోసిపుచ్చుతూ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును సమీక్షించాలని కోరుతూ సుప్రీంకోర్టును ఆశ్రయించారు.
సిబిఐ ప్రత్యేక జడ్జి జస్టిస్ లోయా మృతి కేసును స్వతంత్ర్య దర్యాప్తు చేయాలని గతంలో కొందరు సుప్రీం కోర్టును ఆశ్రయించారు. అయితే ఈ తీర్పును సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. ఈ తరుణంలో ముంబైకి చెందిన లాయర్ల బృందం మరోసారి ఈ విషయమై అత్యున్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించడం ప్రాధాన్యతను సంతరించుకొంది.
సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ దీపక్ మిశ్రాతో పాటు జడ్జిలు ఎ.ఎం. ఖనివిల్కర్, డివై. చంద్రచూడ్ నేతృత్వంలోని ముగ్గురు జడ్జిల బెంచ్ ఏప్రిల్ 19వ తేదిన వచ్చిన ఇదే తరహ పిటిషన్ ను కొట్టివేసింది.
సిబిఐ ప్రత్యేక న్యాయమూర్తి జస్టిస్ లోయా మృతి సహజ మరణమేనని రికార్డులు తెలుపుతున్నాయని ఆ తీర్పు విషయంలో ఈ తీర్పులో సుప్రీంకోర్టు జడ్జిలు అభిప్రాయపడ్డారు.
సంచనలం చేయడానికి మాత్రమే ఈ తరహ పిటిషన్లను దాఖలు చేయడం లేదని లాయర్స్ అసోసియేషన్ అభిప్రాయపడింది.జస్టిస్ లోయా మృతిపై సమీక్ష కోరుతూ లాయర్ల బృందం వేసిన పిటిషన్ మహరాష్ట్ర పోలీసు అధికారులు తయారు చేసినవిచారణ నివేదిక ఖచ్చితత్వాన్ని ప్రశ్నించారు. అయితే ఈ విషయమై
జస్టిస్ లోయా మృతి కేసుపై స్వతంత్ర విచారణ పిటిషన్ ను సుప్రీం కోర్టు కొట్టివేయడంతో విపక్ష పార్టీలకు చెందిన ఎంపీలు కూడ చీఫ్ జస్టిస్ దీపక్ మిశ్రాపై అభిశంసన తీర్మాన నోటీసును కూడ రాజ్యసభ ఛైర్మెన్ వెంకయ్యనాయుడుకు ఇచ్చారు. అయితే ఈ తీర్మాన నోటీసును రాజ్యసభ ఛైర్మెన్ వెంకయ్యనాయుడు కొట్టిపారేశారు.