లక్ష్మీస్ ఎన్టీఆర్ ఎఫెక్ట్ : కడప జేసీపై బదిలీవేటు
న్యూఢిల్లీ : ఎన్నికల నియామవళి ఉల్లంఘిస్తోన్న వారిపై ఎన్నికల సంఘం కొరడా ఝులిపిస్తోంది. చిన్న, పెద్ద అనే తేడా లేకుండా కఠిన చర్యలు తీసుకుంటుంది. నేతలే కాదు అధికారులపై కూడా కఠినంగా వ్యవహరిస్తోంది. తాజాగా కడప జిల్లా జాయింట్ కలెక్టర్పై బదిలీ వేటు వేసింది.

కడపలో మాత్రం ప్రదర్శన
లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమాను ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వం నిషేధించింది. అయితే కడపలోని కొన్ని థియేటర్లలో సినిమా ప్రదర్శించారు. దీంతో ఎన్నికల సంఘం ఆగ్రహం వ్యక్తం చేసింది. సినిమా థియేటర్లలో మూవీ రిలీజైతే ఏం చేస్తున్నారని జాయింట్ కలెక్టర్ పులిపాటి కోటేశ్వరరావును ప్రశ్నించింది. దానికి జేసీ ఇచ్చిన సమాధానంతో సంతృప్తి చెందని ఈసీ ... ఆయనను బదిలీ చేసింది. అంతేకాదు ఎన్నికల విధులకు కూడా దూరంగా ఉంచాలని నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ఏపీ ప్రభుత్వానికి ఆదేశాలు కూడా జారీచేసింది.
ఆది నుంచి కాంట్రవర్సీ
వివాదాస్పద దర్శకుడు రాంగోపాల్ వర్మ లక్ష్మీస్ ఎన్టీఆర్ మూవీని తెరకెక్కించాడు. ఈ మూవీ తొలి నుంచే కాంట్రవర్సీ అయ్యింది. ఈ క్రమంలో కొందరు కోర్టును ఆశ్రయించగా సినిమా విడుదల నిలిపివేయాలని స్పష్టంచేసింది. అయితే ఏపీ మినహా దేశవ్యాప్తంగా విడుదలకు తెలంగాణ హైకోర్టు అనుమతిచ్చింది. ఏపీలో మాత్రం హైకోర్టు విడుదలకు అంగీకరించలేదు. దీంతో వర్మ సుప్రీంకోర్టును ఆశ్రయించిన ఫలితం లేకుండా పోయింది. ఈ క్రమంలో కడపలోని థియేటర్లలో సినిమా విడుదలవడం సంచలనం సృష్టించింది. దీనిపై స్పందించిన ఈసీ నివేదిక ఇవ్వాలని కోరింది. ఈ మేరకు జేసీపై చర్యలు తీసుకుంది.
వర్మ తరహాలో ..
లక్ష్మీఎస్ ఎన్టీఆర్ సినిమాలో వర్మ ఉన్నది ఉన్నట్టు చూపించాడని .. చంద్రబాబుకు వ్యతిరేకంగా తెరకెక్కించాడని సినిమాను ఏపీ సర్కార్ నిలిపివేసింది. దీంతో కోర్టులకెళ్లడం ... ఏపీలో మాత్రం విడుదలకు లైన్ క్లియర్ కాలేదు. ఈ క్రమంలోనే కడపలో సినిమా విడుదలై .. ఎన్నికల్లో ప్రభావం చూపస్తోందనే కారణంతో ధియేటర్లు పర్యవేక్షించాల్సిన జేసీ నిర్లక్ష్యం ఉందని నిర్ధారణకు వచ్చి చర్యలు తీసుకున్నారు.
-
Work From Home ఇచ్చేశారు. ప్రభుత్వం, ఐటీ దిగ్గజాల కీలక ప్రకటన! -
తమిళ నాట అధికారం వారిదే, విజయ్ కు దక్కే సీట్లెన్ని- తేల్చేసిన కేకే సర్వే..!! -
అంచనాలను తలకిందులు చేస్తోన్న బంగారం ధరలు -
2024 నాటి భీభత్సం మళ్లీ వస్తుంది: ఈ వేసవి చాలా కాలం ఉంటుంది! -
ఇన్నాళ్లూ ఆచితూచి- ఇప్పుడు ప్రధాని మోదీపై సీఎం డైరెక్ట్ అటాక్? -
ICC T20I ర్యాంకింగ్స్: దూసుకొచ్చిన సంజూ, ఇషాన్ - అభిషేక్ ఏ స్థానంలో..!! -
ఉగాది నుంచి మిథున రాశి, కర్కాటక రాశి వారి జాతక ఫలం -
తెలంగాణ నూతన డీజీపీ ఖరారు, అనూహ్య ఎంపిక..!! -
న్యూజిలాండ్ ఫస్ట్ సిరీస్- టీ20 వరల్డ్ కప్ ఫైనల్ తర్వాత జట్టులో భారీ మార్పలు -
దేశంలో తొలి `కారుణ్య మరణం`- తీర్పు చెబుతూ కన్నీళ్లు పెట్టిన సుప్రీంకోర్టు ధర్మాసనం -
"ఆయన్ను తట్టుకోలేక నరకం చూశా.. 16 సినిమాలు తిరస్కరించా" -
రిలయన్స్ ఇండస్ట్రీస్ బంపర్ ఆఫర్ ఇచ్చిన డొనాల్డ్ ట్రంప్












Click it and Unblock the Notifications