ప్రభుత్వ జోక్యంపై దీపక్ మిశ్రాకు చలమేశ్వర్ లేఖ
న్యూఢిల్లీ: హైకోర్టుల్లో న్యాయమూర్తుల నియామకాల విషయంలో ప్రభుత్వ జోక్యంపై చర్చించడానికి పూర్తి కోర్టును సమావేశపరచాలనిసుప్రీంకోర్టు సీనియర్ న్యాయమూర్తి జాస్తి చలమేశ్వర్ ప్రధాన న్యాయమూర్తి దీపక్ మిశ్రాను కోరారు. ఈ మేరకు ఆయన ప్రధాన న్యాయమూర్తికి గతవారం లేఖ రాశారు.
జాస్తి చలమేశ్వర్ లేఖపై ప్రధాన న్యాయమూర్తి ఇప్పటి వరకు కూడా స్పందించలేదు. ప్రధాన న్యాయమూర్తికి రాసిన ఐదు పేజీల లేఖ ప్రతులను ఆయన 22 మంది సుప్రీంకోర్టు న్యాయమూర్తులకు కూడా పంపించారు.

ఆ లేఖపై జాస్తి చలమేశ్వర్ర మార్చి 21వ తేదీన సంతకం చేశారు. హైకోర్టుల్లో న్యాయమూర్తులను నియమించే విషయంలో సుప్రీంకోర్టు కొలీజయం చేసిన సిఫార్సులను ఆమోదించడంలో సెలెక్టివ్గా వ్యవహరిస్తోందని ఆయన అన్నారు. తమకు అసౌకర్యం కలిగిస్తారని భావించే పేర్లను విస్మరిస్తోందని, దానివల్ల న్యాయవ్యవస్థ స్వయంప్రతిపత్తిపై ప్రభావం పడుతుందని ఆయన అన్నారు.
న్యాయవ్యవస్థ పరిపాలన వ్యవహారాలకు సంబంధించిన అత్యత ప్రదానమైన విషయంపై ప్రదాన న్యాయమూర్తి సాధారణంగా పూర్తి కోర్టును సమావేశపరుస్తారు. తన అభిశంసనకు రాజ్యసభలో ప్రతిపక్షాలు సంతకాల సేకరణ జరుపుతున్న సమయంలో పూర్తి కోర్టును సమావేశపరచాలనే చలమేశ్వర్ లేఖ ప్రధాన న్యాయమూర్తని మరింత ఒత్తిడికి గురి చేసే అవకాశం ఉందన అంటున్నారు.
-
దేశవ్యాప్తంగా 'ఎనర్జీ లాక్ డౌన్'.. ప్రతి బుధవారం సెలవు.. కఠినమైన రూల్స్ అమల్లోకి..! -
వాస్తు ప్రకారం ఐశ్వర్యాన్ని తెచ్చేది మనీప్లాంట్ కాదు.. 'క్రాసులా' మొక్కను పెంచాలి -
కేసీఆర్ ఫోన్, పరుగులు పెట్టిన ఆఫీసర్లు. -
మరో 100 కోట్ల బొమ్మ.. హిట్ మీద హిట్ కొట్టడం నీకే సాధ్యం అన్న -
విద్యార్థులకు గుడ్ న్యూస్.. మరో 4 రోజులు స్కూళ్లకు సెలవులు..! -
మూడు జోన్లుగా తిరుమల -
IPL 2025: రూ.26 కోట్ల ఆటగాడు ముంచితే.. రూ.2.6 కోట్ల కుర్రాడు గెలిపించాడు! -
ఈ రాశులకు అద్భుతం జరగబోతోంది -
రైతు భరోసా రెండు, మూడో విడత నిధుల జమ షెడ్యూల్ ఫిక్స్- ఎవరికి ఎప్పుడు..!! -
రామ్ చరణ్ "పెద్ది" కోసం ప్రభాస్ ఫేవరెట్ బ్యూటీ.. -
పదో తరగతి ఫలితాల విడుదల పై తాజా నిర్ణయం..!! -
నితీష్ కొత్త ఎత్తుగడ.. కేంద్రానికి బిగ్ షాక్!












Click it and Unblock the Notifications