బడ్జెట్ రోజే చనిపోయిన ఎంపీలు: అహ్మద్ లాగే.. అప్పట్లోను..
1954లో ఏప్రిల్ 19న రైల్వే బడ్జెట్ ప్రవేశపెట్టాల్సిన రోజే ఎంపీ జుజుహర్ పాల్ సోరియన్ మరణించారు.
న్యూఢిల్లీ: కేరళకు చెందిన మాజీ కేంద్రమంత్రి, ఎంపీ అహ్మద్ నేటి ఉదయం కన్నుమూయడంతో.. పార్లమెంటులో ఈరోజు ప్రవేశపెట్టాల్సిన బడ్జెట్ ను వాయిదా వేస్తారా? అన్న అనుమానాలు కలిగాయి.
అయితే లోక్సభ స్పీకర్ ఇందుకు నిరాకరించడంతో ఎంపీ మృతికి సంతాపం ప్రకటించిన అనంతరం ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీ బడ్జెట్ ను ప్రవేశపెట్టారు. కాగా, గతంలోను రెండుసార్లు బడ్జెట్ ప్రవేశపెట్టే రోజే ఎంపీలు మరణించిన సందర్బాలు ఉన్నాయి.

1971లో ఇందిరాగాంధీ ప్రధానమంత్రిగా ఉన్న సమయంలో బడ్జెట్ ప్రవేశపెట్టాల్సిన రోజే మంత్రి ఎంబీ రానా కన్నుమూశారు.అయితే అప్పటి స్పీకర్ జీఎస్ థిల్లాన్ పార్లమెంటులో బడ్జెట్ ప్రవేశపెట్టేందుకు అంగీకరించడంతో.. అదేరోజు సాయంత్రం 5గం.కు బడ్జెట్ ప్రవేశపెట్టారు.
మరో సందర్బంలో.. 1954లో ఏప్రిల్ 19న రైల్వే బడ్జెట్ ప్రవేశపెట్టాల్సిన రోజే ఎంపీ జుజుహర్ పాల్ సోరియన్ మరణించారు. అయితే స్పీకర్ అంగీకారంతో జుజుహర్ మృతికి సంతాపం ప్రకటించిన అనంతరం అదే రోజు సాయంత్రం 5గం.కు బడ్జెట్ ప్రవేశపెట్టారు.
-
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం -
కోట్లకు పడగెత్తిన విజయ్ రైట్ హ్యాండ్ -
సిమెంట్- స్టీల్ ధరలు భారీగా పెంపు, ఇక నుంచి..!? -
ఏపీ ప్రభుత్వం మరో ఎన్నికల హామీ అమలు, రేపే ప్రారంభం..!! -
తిరుపతిలో ఎయిర్ పోర్టును తలదన్నేలా..!! -
ఏపీ ప్రజలకు డిసెంబర్ లోగా మరో బహుమానం.. ఫిక్స్ చేసిన సీఎం చంద్రబాబు -
బిగ్ షాక్: ఏప్రిల్ 1 నుంచి పెరగనున్న పెట్రోల్, డీజిల్ ధరలు.. -
రాహుల్ గాంధీతో డేటింగ్ కోరిక తీరలేదు - బాలీవుడ్ స్టార్ -
అనుష్క కొత్త సినిమా ట్రైలర్ రిలీజ్.. ప్రభాస్ బాహుబలిని మించి !! -
ఆ పార్టీ కండువా కప్పుకొన్న టెన్నిస్ దిగ్గజం- రాజకీయాల్లో ఎంట్రీ -
మహిళలకు నెలకు రూ.3వేలు.. అస్సాంలో బీజేపీ మ్యానిఫెస్టో రిలీజ్












Click it and Unblock the Notifications