ఐఎస్ లాగే ఆరెస్సెస్ : అభిప్రాయాలను ద్వేషించేవారిని శత్రువులు ? టీఎన్ పీసీసీ చీఫ్ కామెంట్స్
న్యూఢిల్లీ : ఎన్నికల వేళ కాంట్రవర్సీ కామెంట్లు ఎక్కవవుతున్నాయి. నేతల నోటిదురుసు పీక్కి చేరుతోంది. ఎస్పీ నేత ఆజాంఖాన్ సహా మిగిలిన నేతలు మితిమీరి వ్యాఖ్యానిస్తున్నారు. వీరి ప్రచారంపై ఎన్నికల సంఘం చర్యలు తీసుకున్నా .. వారి తీరులో మాత్రం మార్పు రాకపోవడం ఆందోళన కలిగిస్తోంది.

కాంట్రవర్సీ కామెంట్స్
తాజాగా తమిళనాడు కాంగ్రెస్ చీఫ్ కేఎస్ అళగిరి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. హిందు ఎజెండాతో పనిచేస్తోన్న ఆరెస్సెస్ ను ఐఎస్ ఉగ్రవాద సంస్థతో పోల్చి తేనేతుట్టెను కదలించారు. ఐఎస్ లానే ఆరెస్సెస్ కూడా తమ శత్రువు అభిప్రాయాలను ద్వేషిస్తోందని కామెంట్ చేశారు. అళగిరి చేసిన కామెంట్స్ తీవ్ర దుమారం రేపింది. దీనిని విపక్ష బీజేపీ నేతలు తప్పుపట్టారు. అళగిరి తన సొంత అభిప్రాయాన్ని అందరిపై రుద్దే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు.

సపోర్ట్ చేస్తున్నా ..
కమల్ హాసన్ చేసిన వ్యాఖ్యలతో ఏకీభవిస్తున్నానని .. పూర్తిగా మద్దతిస్తున్నట్టు అళగిరి స్పష్టంచేశారు. 100 శాతం కాదు వెయ్యి శాతం కమల్ వ్యాఖ్యలు సరైనవని స్పష్టంచేశారు. ఆరెస్సెస్ హిందూయిజం ఐఎస్ ఇస్లానికి తీసిపోదనన్నారు. అరబ్ దేశాల్లో ఉన్న ముస్లింలు ఐఎస్ అభిప్రాయాలతో విభేదిస్తే .. బహిష్కరణ చేస్తారని గుర్తుచేశారు. భారతదేశంలో ఆరెస్సెస్ కూడా హిందువులపై అదే పద్ధతిని అనుసరిస్తోందని గుర్తుచేశారు. వారి మతం, విధానాలు అంతా ఒక్కటేనని ... ఏ మార్పులేదని నొక్కివక్కానించారు. అయితే అళగిరి వ్యాఖ్యలను ఆరెస్సెస్ తోసిపుచ్చింది. అళగిరి పసలేదని వాదనలు చేస్తున్నారని ఖండించింది. ఆరెస్సెస్, జనసంఘ్, హిందు మహాసభ ... తమ అభిప్రాయాలను విభేదించేవారిని బహిష్కరిస్తుంది తప్ప .. అందరినీ కాదని తేల్చిచెప్పింది.

కమల్ కాంట్రవర్సీ కామెంట్స్
నిన్న తమిళనాడులోని ఆరవకురిచి ర్యాలీలో కమల్ హాసన్ సంచలన వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. దేశంలో మొదటి ఉగ్రవాది హిందువు అని చెప్పారు. గాంధీని కాల్చిన గాడ్సే ఉగ్రవాదని ... గాంధీ విగ్రహాం ఎదుట చెప్తున్నానని హాట్ కామెంట్స్ చేశారు. ఇక్కడ ముస్లింలు ఎక్కువగా ఉన్నారని అలా అనడం లేదని క్లారిటీ ఇచ్చారు.
-
బెంగాల్ టైగర్ ఎవరో తేల్చేసిన సర్వేలు.. దీదీ మళ్లీ సీఎం అవుతారా? -
దానం నాగేందర్కు బిగ్ షాక్.. అనర్హత వేటుపై అనూహ్య ట్విస్ట్..!! -
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
విజయ్కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తెలంగాణ ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్-అసెంబ్లీలో ప్రకటన..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్












Click it and Unblock the Notifications