45మందితో మోడీ కేబినెట్: స్మృతికి ఛాన్స్, అద్వానీకి నో
న్యూఢిల్లీ: నరేంద్ర మోడీ తన కేబినెట్ సభ్యుల జాబితాను రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీకి సోమవార ఉదయం పంపించారు. 45 మంత్రులతో తన కేబినెట్ను ఏర్పాటు చేయనున్నారు. ఇందులో 24 మంది కేబినెట్, 10 మంది స్వతంత్ర హోదా మంత్రులు, 11 మంది సహాయ మంత్రులు ఉన్నారు.
కేబినెట్లో చేరబోయే మంత్రులు
రాజ్నాథ్ సింగ్, సుష్మా స్వరాజ్, అరుణ్ జైట్లీ, వెంకయ్య నాయుడు, ఉమా భారతి, నిర్మలా సీతారామన్, రవిశంకర ప్రసాద్, పీయూష్ గోయల్, హర్షవర్ధన్, అనంత్ గీతె, స్మృతి ఇరానీ, గోపినాథ్ ముండే, సదానంద గౌడ, జువాల్ ఓరమ్, రాధా మోహన్ సింగ్, టిసి గెహ్లాట్, అనంతకుమార్, కల్ రాజ్ మిశ్రా, హెచ్ఎం కౌర్, నరేంద్ర సింగ్ తోమర్, వికె సింగ్, అశోక గజపతి రాజు, ఇంద్రజిత్ సింగ్, రాం విలాస్ పాశ్వాన్, నితిన్ గడ్కరీ, నజ్మా హెప్తుల్లా, పీయూష్ గోయల్, సంతోష్ గంగవార్, జవదేకర్, పీయూష్ గోయల్.. తదితరులు.

సహాయ మంత్రులు.
రావ్ సాహెబ్ ధన్వే, రాధాకృష్ణన్, కిరణ్, రిజిజు, కిషన్ పాల్ గుర్జాన్, జిఎం సిద్ధేశ్వర్, మనోజ్ సిన్హా, ఉపేంద్ర కుష్వాహా, విష్ణుదేవ్, సుదర్శన్ భగత్, సంజీవ్ కుమార్.
సీనియర్లకు నో
లాల్ కృష్ణ అద్వానీ వంటి సీనియర్ నేతలకు నరేంద్ర మోడీ కేబినెట్లో చోటు దక్కలేదు. అద్వానీని ఎన్డీయే కన్వీనర్గా నియమించే అవకాశముంది. మిత్ర పక్షాలకు తలో కేబినెట్ పదవి కేటాయించారు.
రక్షణ శాఖను మోడీ తన వద్దే ఉంచుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. సుష్మా స్వరాజ్కు విదేశీ వ్యవహారాలు, రవిశంకర్ ప్రసాద్కు సమాచార, ప్రసారాల శాఖ, రాజ్ నాథ్ సింగ్కు హోం, అరుణ్ జైట్లీకి ఆర్థిక శాఖ ఇచ్చే అవకాశముంది.












Click it and Unblock the Notifications