వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఫామ్ హౌజ్ లో కాళ్లు చేతులు నరికేశారు

|
Google Oneindia TeluguNews

చండీగడ్: పంజాబ్ లో దారుణం జరిగింది. అధికార పార్టీకి చెందిన ఓ నాయకుడి ఫామ్ హౌజ్ లో ఇద్దరి కాళ్లు, చేతులు నరికేశారు. చికిత్స విఫలమై ఒకరు మరణించారు. మరో వ్యక్తి పరిస్థితి విషమంగా ఉందని పోలీసులు తెలిపారు.

పంజాబ్ లోని పజిల్కా జిల్లాలోని అబోహర్ ప్రాంతంలో అక్కడి అధికార పార్టీ అకాలీదళ్ నేత శివలాల్ దోడా అనే వ్యక్తి ఫామ్ హౌజ్ ఉంది. ఈ ఫామ్ హౌజ్ లో శనివారం బీమ్ టంక్ అనే వ్యక్తి రెండు కాళ్లు, చేతులు నరికేశారు.

తరువాత గుర్జిత్ సింగ్ అనే వ్యక్తి ఓ చెయ్యి, కాలు నరికేశారు. ఇద్దరిని ఆసుపత్రికి తరలిస్తున్న సమయంలో బీమ్ టంక్ అనే వ్యక్తి మార్గం మద్యలో మరణించాడు. గుర్జిత్ సింగ్ అమృత్ సర్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు.

Limbs of two men Cut off allegedly at a Farmhouse in Punjab

గుర్జిత్ సింగ్ పరిస్థితి విషమంగా ఉందని పోలీసులు చెప్పారు. నరబలి కోసం ఇద్దరిని హత్య చెయ్యడానికి ప్రయత్నించారని నిరసనలు వ్యక్తం అవుతున్నాయి. ఈ దారుణ సంఘటనపై పంజాబ్ లో పెద్ద ఎత్తున ఆందోళనలు చేస్తున్నారు.

ఈ ఘటనకు సంబంధించి అకాలీదళ్ నేత శివలాల్ దోడా, ఆయన మేనల్లుడితో సహా మొత్తం 11 మంది మీద కేసులు నమోదు చేసి ఎఫ్ఐఆర్ తయారు చేశామని పోలీసులు తెలిపారు. అయితే ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉందని, ఎలాంటి అరెస్టులు చెయ్యలేదని పోలీసులు తెలిపారు.

English summary
Bheem Tank died on the way to the hospital after both his hands and legs were cut off, while Gurjant Singh who lost his one hand was admitted in a serious condition in Amritsar.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X