ట్రంప్ భార్యకు మోడీ ఇచ్చిన గిఫ్ట్ ఏంటో తెలుసా?: హిమాచల్ నుంచి తెప్పించారు..
అమెరికా పర్యటన నేపథ్యంలో.. భారత ప్రధాని నరేంద్రమోడీకి అక్కడ ఘనస్వాగతం లభించిన సంగతి తెలిసిందే. అధ్యక్ష దంపతులు సహా అమెరికా వైట్ హైజ్ వర్గాలు మోడీకి సాదరంగా ఆహ్వానం పలికాయి.
వాషింగ్టన్: అమెరికా పర్యటన నేపథ్యంలో.. భారత ప్రధాని నరేంద్రమోడీకి అక్కడ ఘనస్వాగతం లభించిన సంగతి తెలిసిందే. అధ్యక్ష దంపతులు సహా అమెరికా వైట్ హైజ్ వర్గాలు మోడీకి సాదరంగా ఆహ్వానం పలికాయి. ఈ సందర్భంగా అమెరికా అధ్యక్షుడు ట్రంప్.. వైట్ హౌజ్ లో మోడీకి విందు ఇచ్చారు.
ఈ సందర్భంగా మోడీ.. అమెరికా అధ్యక్ష దంపతులకు చిరు కానుకలు ఇవ్వడం విశేషం. అమెరికా ప్రఖ్యాత అధ్యక్షుడు అబ్రహం లింకన్ శత వర్దంతి సందర్భంగా.. 1965లొ భారత ప్రభుత్వం విడుదల చేసిన ఒరిజినల్ స్టాంపును ట్రంప్ కు మోడీ అందించారు. ఇదే విషయాన్ని భారత పీఎంవో వర్గాలు ట్విట్టర్ ద్వారా వెల్లడించాయి. దీనికి సంబంధించి పీఎంవో వర్గాలు ట్విట్టర్లో పెట్టిన పోస్టులో.. భారత జాతిపిత గాంధీ, లింకన్.. ఇద్దరూ ఒకే తరహా ఆదర్శాలు కలవారని పేర్కొంది.
ఇక ట్రంప్ భార్య మెలానియాకు హిమాచల్ ప్రదేశ్లో తయారుచేసిన వెండి బ్రాస్లెట్, టీ, కాంగ్రా ప్రాంతానికి చెందిన తేనే, జమ్మూ కశ్మీర్ ,హిమాచల్ ప్రదేశ్కు చెందిన హ్యాండ్ వోవెన్ షాల్స్ను మోడీ బహుమతిగా అందించారు. ఇందుకు ప్రతిగా ట్రంప్ అమెరికా శ్వేతసౌధం టూర్ గైడ్ను మోడీకి అందించారు. ఇందులో అబ్రహం లింకన్ బెడ్రూమ్ వివరాలు కూడా ఉన్నట్లు తెలుస్తోంది.