వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

సభలో గందరగోళం: లోకసభ గంట, రాజ్యసభ 15 ని.లు వాయిదా, వెంకయ్య అసహనం

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: సభ ప్రారంభమైన నిమిషాల్లోనే మంగళవారం లోకసభ వాయిదా పడింది. పదకొండు గంటలకు సభ ప్రారంభమైంది. కావేరీ బోర్డు కోసం అన్నాడీఎంకే సభ్యులు ఆందోళన చేపట్టారు. దీంతో సభ పన్నెండు గంటల వరకు వాయిదాపడింది. వైసీపీ ఎంపీలు పార్లమెంటు వద్ద ప్లకార్డులతో నిరసన తెలిపారు.

అమిత్ షా! ఆధారాలివిగో, మా ఐక్యత దెబ్బతిస్తారా?: పవన్‌ను ఉద్దేశించి రామ్మోహన్ నాయుడుఅమిత్ షా! ఆధారాలివిగో, మా ఐక్యత దెబ్బతిస్తారా?: పవన్‌ను ఉద్దేశించి రామ్మోహన్ నాయుడు

మరోవైపు రాజ్యసభలోను ఇదే పరిస్థితి. సభ్యులు ఆందోళన చేశారు. కావేరీ బోర్డు ఏర్పాటు చేయాలని అన్నాడీఎంకే సభ్యులు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు.

Lok Sabha adjourned for one hour, Rajya Sabha adjourned for 15 minutes

మరోవైపు, ఏపీకి అన్యాయం జరిగిందంటూ టీడీపీ సభ్యులు కూడా రాజ్యసభలో ఆందోళన నిర్వహించారు. సభ్యులు తమ తమ స్థానాల్లో కూర్చోవాలని, సభకు ఆటంకం కలిగించవద్దని రాజ్యసభ చైర్మన్ వెంకయ్య నాయుడు పదేపదే విజ్ఞప్తి చేశారు. సభ్యుల తీరు సరికాదని ఆయన అసహనం వ్యక్తం చేశారు. అనంతరం సభ్యులను పార్టీల నేతలను తన చాంబర్‌కు రావాలని చెప్పి రాజ్యసభ వాయిదా వేశారు.

English summary
Opposition members in the Upper House have also begun shouting slogans.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X