సభలో గందరగోళం: లోకసభ గంట, రాజ్యసభ 15 ని.లు వాయిదా, వెంకయ్య అసహనం
న్యూఢిల్లీ: సభ ప్రారంభమైన నిమిషాల్లోనే మంగళవారం లోకసభ వాయిదా పడింది. పదకొండు గంటలకు సభ ప్రారంభమైంది. కావేరీ బోర్డు కోసం అన్నాడీఎంకే సభ్యులు ఆందోళన చేపట్టారు. దీంతో సభ పన్నెండు గంటల వరకు వాయిదాపడింది. వైసీపీ ఎంపీలు పార్లమెంటు వద్ద ప్లకార్డులతో నిరసన తెలిపారు.
మరోవైపు రాజ్యసభలోను ఇదే పరిస్థితి. సభ్యులు ఆందోళన చేశారు. కావేరీ బోర్డు ఏర్పాటు చేయాలని అన్నాడీఎంకే సభ్యులు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు.

మరోవైపు, ఏపీకి అన్యాయం జరిగిందంటూ టీడీపీ సభ్యులు కూడా రాజ్యసభలో ఆందోళన నిర్వహించారు. సభ్యులు తమ తమ స్థానాల్లో కూర్చోవాలని, సభకు ఆటంకం కలిగించవద్దని రాజ్యసభ చైర్మన్ వెంకయ్య నాయుడు పదేపదే విజ్ఞప్తి చేశారు. సభ్యుల తీరు సరికాదని ఆయన అసహనం వ్యక్తం చేశారు. అనంతరం సభ్యులను పార్టీల నేతలను తన చాంబర్కు రావాలని చెప్పి రాజ్యసభ వాయిదా వేశారు.
More From
-
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !! -
ఏపీలో స్థానిక సంస్థల పునర్విభజన- మారిపోతున్న ముఖచిత్రాలు -
PNGకి మారకపోతే LPG సిలెండర్ కట్..! కేంద్రం డెడ్ లైన్..! -
చమురు, గ్యాస్ పరిస్ధితి ఇదీ- అఖిలపక్ష భేటీలో తేల్చేసిన కేంద్రం..! -
నన్ను ఆ డైరెక్టర్ ఎక్కడెక్కడో పట్టుకున్నాడు.. కానీ అమ్మానాన్న సర్దుకుపోమన్నారు !! -
Iran: ట్రంప్ కు ఇరాన్ దిమ్మతిరిగే షాక్..! సీజ్ ఫైర్ కు కఠిన షరతులివే..! -
ఇంధన కొరత వేళ.. తెలంగాణ ఆర్టీసీ సంచలన నిర్ణయం -
‘దీదీ’ రాజీనామా.. ఎన్నికల వేళ మమత సంచలన నిర్ణయం! -
ఏపీలో తెలంగాణ సీఎం.. లోకేష్ బంపర్ ఆఫర్












Click it and Unblock the Notifications