Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

సీఎంకు షాక్, అధికార పార్టీ నాయకుల మైండ్ బ్లాక్, సర్వేలో షాకింగ్ సమాచారం, కూటమిదే హవా !

ఈ నెలలోనే లోక్‌సభ ఎన్నికల పోలింగ్ ప్రారంభం కానుంది. దేశంలోని 543 లోక్‌సభ నియోజకవర్గాలకు ఏడు దశల్లో లోక్ సభ ఎన్నికలు జరగనుండగా, తొలి దశ పోలింగ్ ఏప్రిల్ 19వ తేదీన జరగనుంది. కర్ణాటకలోని కొన్ని జిల్లాల్లో ఏప్రిల్ 26వ తేదీన పోలింగ్ జరగనుంది. కర్ణాటకలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీకి ఓ సర్వే ఫలితాలు ఊహించని షాక్ ఇచ్చింది. ఆ సర్వే దెబ్బతో కాంగ్రెస్ నాయకులు అయోమయంలో పడిపోయారు.

కర్ణాటకలో రెండు దశల్లో అంటే ఏప్రిల్ 26వ తేదీ, మే 7వ తేదీల్లో లోక్ సభ ఎన్నికలు జరగనున్నాయి. అదేవిధంగా చివరి ఏడో దశ పోలింగ్ జూన్ 1వ తేదీన జరగనుంది. జూన్ 4వ తేదీన దేశవ్యాప్తంగా లోక్‌సభ ఎన్నికల ఫలితాలు వెల్లడిస్తామని భారత ఎన్నికల సంఘం ఇప్పటికే ప్రకటించింది. లోక్ సభ ఎన్నికల్లో గెలుపే ప్రధాన లక్షంగా పెట్టుకున్న ప్రధాన పార్టీలు నిమిషం తీరికలేకుండా ఎన్నికల ప్రచారం చేస్తున్నాయి.

Lok Sabha Election 2024 TV9 Bharatvarsh Polstrat and People s insight opinion poll pridicts

టీవీ9, పోల్‌స్ట్రాట్, పీపుల్స్ ఇన్‌సైట్ సర్వే విడుదల అయ్యింది. లోక్‌సభ ఎన్నికలకు సంబంధించి ఇప్పటికే అనేక సర్వేలు, అభిప్రాయ సేకరణలు వెలువడ్డాయి. అదేవిధంగా టీవీ9 భారత్ వర్ష్, పోల్‌స్ట్రాట్, పీపుల్స్ ఇన్‌సైట్ సంయుక్తంగా సర్వే నిర్వహించి ఫలితాలను వెల్లడించింది. దేశంలోని మొత్తం 543 లోక్ సభ స్థానాల్లో నిర్వహించిన సర్వే ప్రకారం దేశంలో 362 స్థానాల్లో ఎన్డీయే విజయం సాధిస్తుందని తేలింది. ఇందులో బీజేపీ 319 సీట్లు, దాని మిత్రపక్షాలు 43 సీట్లు గెలుచుకుంటాయని సర్వే తెలిపింది.

కాంగ్రెస్ నేతృత్వంలోని ఇండియా కూటమి 149 సీట్లు గెలుచుకోవచ్చని సర్వేలో తేలింది. ఇందులో కాంగ్రెస్ 49 సీట్లు, ఇండియా కూటమిలోని ఇతర పార్టీలు 100 సీట్లు గెలుచుకుంటాయని తెలిపింది. అంతే కాకుండా 32 సీట్లు ఇతరులకు రావచ్చు అని సర్వేలో తేలింది. కర్ణాటకలో ఎవరికి ఎక్కువ సీట్లు వస్తాయని సర్వే వెల్లడించింది. కర్ణాటక రాష్ట్రంలో మొత్తం 28 లోక్‌సభ స్థానాలు ఉన్నాయి. వాటిలో నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ (ఎన్‌డీఏ) 23 సీట్లు గెలుచుకుంటుందని సర్వే అంచనా వేసింది.

కాంగ్రెస్ పార్టీ 5 సీట్లు గెలుచుకుంటుందని సర్వే అంచనా వేసింది. కర్ణాటక రాష్ట్రంలో బీజేపీ-జేడీఎస్ కూటమిలో భారతీయ జనతా పార్టీ 20 సీట్లు గెలుచుకుంటుందని సర్వే అంచనా వేసింది. బీజేపీ మిత్రపక్షమైన సెక్యులర్ జనతాదళ్ (జేడీఎస్) మూడు సీట్లు గెలుచుకుంటుందని సర్వే తెలిపింది. ఇక 20కి పైగా సీట్లు గెలుచుకుంటుందని భావిస్తున్న కాంగ్రెస్ కేవలం 5 సీట్లు మాత్రమే గెలుచుకోగలదని సర్వే వెల్లడించింది.

Lok Sabha Election 2024 TV9 Bharatvarsh Polstrat and People s insight opinion poll pridicts

ఈ సర్వేలో మొత్తం 543 లోక్‌సభ నియోజకవర్గాలు ఉన్నాయి. అన్నింటికంటే ముఖ్యంగా లోక్‌సభ నియోజకవర్గం పరిధిలోకి వచ్చే ప్రతి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఈ సర్వే శాంపిల్స్ తీసుకున్నారు. ఏప్రిల్ 1వ తేదీ నుంచి ఏప్రిల్ 13వ తేదీ వరకు సర్వే నిర్వహించి దేశవ్యాప్తంగా 4,123 అసెంబ్లీ నియోజకవర్గాల శాంపిల్ తీసుకున్నారు. కర్ణాటకలో 28 లోక్‌సభ స్థానాలు ఉండగా రాష్ట్రంలో రెండు దశల్లో ఎన్నికలు జరగనున్నాయి.

మరో14 నియోజకవర్గాలకు ఏప్రిల్ 26 వ తేదీన, మిగిలిన 14 నియోజకవర్గాలకు మే 7వ తేదీన పోలింగ్ జరగనుంది. 2019లో లోక్‌సభ ఎన్నికలు కూడా కర్ణాటకలో రెండు దశల్లో జరిగాయి. బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే కూటమి 25 సీట్లు గెలుచుకోగా, కాంగ్రెస్, జేడీఎస్ ఒక్కో సీటు గెలుచుకున్నాయి. మండ్య లోక్ సభ నియోజక వర్గంలో సుమలత అంబరీష్ స్వతంత్ర అభ్యర్థిగా గెలిచారు. ఇప్పుడు సుమలత బీజేపీలో చేరారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+