లోక్ పోల్ సర్వేతో అధికార పార్టీకి షాక్, మోదీ ఉన్న టైమ్ లో ? షాక్ !
బెంగళూరు/న్యూఢిల్లీ: కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ మే 10వ తేదీన, ఎన్నికల కౌటింగ్ మే 13వ తేదీన జరగనుంది. ఇప్పటికే పలు సంస్థలు కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల సర్వే ఫలితాలు విడుదల చేశాయి. ఇప్పుడు లోక్ పోల్ (LokPoll) సర్వే ఫలితాలు విడుదల చెయ్యడంతో బీజేపీ నాయకులు షాక్ అయ్యారు.
శనివారం ప్రధాని నరేంద్ర మోదీ బెంగళూరులో రోడ్ షో నిర్వహించారు. ఆదివారం ఉదయం కూడా ప్రధాని నరేంద్ర మోదీ రోడ్ షో నిర్వహిస్తున్నారు. ఇలాంటి సమయంలో లోక్ పోల్ కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల సర్వే ఫలితాలు విడుదల చెయ్యడం హాట్ టాపిక్ అయ్యింది. కర్ణాటకలో 113 మంది ఎమ్మెల్యేల కంటే ఎక్కువ మెజారిటీ ఉన్న పార్టీ మాత్రమే అధికారంలోకి రావడానికి అవకాశం ఉంది.

లోక్ పోల్ సర్వే ప్రకారం కర్ణాటకలో అధికారంలో ఉన్న బీజేపీకి 59 నుంచి 65 స్థానాలు మాత్రమే వస్తాయని వెలుగు చూసింది. కాంగ్రెస్ పార్టీకి 129 నుంచి 134 స్థానాలు వస్తాయని సర్వే తెలిపింది. చాలా సంవత్సరాల నుంచి కర్ణాటకలో కింగ్ మేకర్ గా అవతరిస్తున్న జేడీఎస్ పార్టీకి 23 నుంచి 28 స్థానాలు వస్తాయని, ఇతరులు 2 స్థానాల్లో విజయం సాధిస్తారని LokPoll సర్వే తెలిపింది.
లోక్ పాల్ సర్వే ప్రకారం కర్ణాటకలో బీజేపీకి 31 శాతం నుంచి 32 శాతం ఓట్లు, కాంగ్రెస్ పార్టీకి 42 శాతం నుంచి 45 శాతం ఓట్లు వస్తాయని, జేడీఎస్ పార్టీకి 14 శాతం నుంచి 18 శాతం ఓట్లు వస్తాయని తెలిపింది. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో ఇతరులకు 5 శాతం నుంచి 8 శాతం ఓట్లు వస్తాయని లోక్ పోల్ సర్వే తెలిపింది. అయితే లోక్ పోల్ సర్వే పనికిమాలిన సర్వే అంటూ బీజేపీ నాయకులు మండిపడుతున్నారు.
Final numbers of Lok poll for #KarnatakaElection2023 pic.twitter.com/XHps5z9zoJ
— Lok Poll (@LokPoll) May 6, 2023
ఇంత వరకు బీజేపీ ఇన్ని తక్కువ సీట్లు వస్తాయని ఏ సర్వే కూడా చెప్పలేదు. ప్రతి సర్వేలో ఇంచుమించు కాంగ్రెస్, బీజేపీల మధ్య 10 నుంచి 18 సీట్ల మధ్య తేడా ఉంది. అయితే లోక్ పోల్ సర్వేలో బీజేపీకి 65 స్థానాలకంటే ఎక్కువ సీట్లు రావని వెలుగు చూడటంతో బీజేపీ నాయకులు లోక్ పోల్ సర్వే మీద తీవ్రస్థాయిలో విరుచుకుపడుతున్నారు.
-
విశాఖ టు బెంగళూరు వయా తిరుపతి వందేభారత్ స్లీపర్ రెడీ - రూట్ , ముహూర్తం..!! -
ఏపీలో భారీగా మద్యం ధరల తగ్గింపు, ఏ బ్రాండ్ ఎంత..!! -
ఢిల్లీలో జగన్ రూటు మారిందా, పార్లమెంట్ సాక్షిగా - కీలక మలుపు..!! -
T20 World Cup: సూర్యకుమార్ యాదవ్ కు ఐసీసీ అనూహ్య షాక్..! -
India Post GDS 2nd Merit List 2026: పోస్టల్ జాబ్స్ రెండో మెరిట్ లిస్ట్ అప్పుడే? -
టీం ఇండియాకు బీసీసీఐ భారీ నజరానా, ఒక్కొక్కరికి ఎంతంటే..!! -
పెట్రోల్ పై కేంద్రం ఎస్మా ప్రయోగం:LPG ఉత్పత్తి పెంచాలని హుకుం -
భారీగా పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు! -
మిథున రాశి 2026 2027 జాతకం.. ఈ ఏడాది వీరి మాటే శాసనం! -
టీమిండియాపై విధ్వంసకర సెంచరీ: కెప్టెన్గా ప్రమోషన్ -
వరల్డ్ కప్ గెలిచినా తప్పని చిక్కులు! ఆ ఆటగాడిపై ఐసీసీ వేటు? -
న్యూజిలాండ్ ఫస్ట్ సిరీస్- టీ20 వరల్డ్ కప్ ఫైనల్ తర్వాత జట్టులో భారీ మార్పలు












Click it and Unblock the Notifications