ఆంధ్రప్రదేశ్-తెలంగాణకు లోకసభ ఇంచార్జులు వీరే, 17 రాష్ట్రాలకు ప్రకటన
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సహా పదిహేడురాష్ట్రాలు, ఛండీగడ్కు బీజేపీ కొత్త ఇంచార్జి, కో ఇంచార్జిలను భారతీయ జనతా పార్టీ (బీజేపీ) అధ్యక్షులు అమిత్ షా బుధవారం ప్రకటించారు. 2019 లోకసభ ఎన్నికలకు వీరు ఇంచార్జులుగా ఉంటారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మురళీధరన్, సునీల్ ధియోధర్, తెలంగాణకు అరవింద్ లింబావలీలను లోకసభ ఎన్నికల ఇంచార్జులుగా బీజేపీ నియమించింది.
రాజస్థాన్ ఇంచార్జిగా ప్రకాష్ జవదేవకర్, సుధాంశు త్రివేది ఉంటారు. అసోంకు మహేంద్ర సింహ్, బీహార్కు భూపేంద్ర యాదవ్, ఛత్తీస్గఢ్కు అనిల్ జైన్, గుజరాత్కు ఓం ప్రకాష్ మాధుర్, హిమాచల్ ప్రదేశ్కు తీర్థ్ సింహ్ రావత్, జార్ఖాండ్కు మంగల్ పాండ్య, మధ్యప్రదేశ్కు స్వతంత్ర దేవ్ సింగ్, సతీష్ ఉపాధ్యాయ, నాగాలాండ్, మణిపూర్లకు నళినీ కోహలీ, ఒడిషాకు అరుణ్ సింహ్, పంజాబ్కు కెప్టెన్ అభిమన్యు, సిక్కింకు నితిన్ నవీన్, ఉత్తరాఖండ్కు థావర్ చంద్ గెహ్లాట్, ఉత్తరప్రదేశ్కు గోవర్ధన్, దుష్యంత్ గౌతమ్, నరోత్తమ్ మిశ్రా, ఛండీగఢ్కు కెప్టెన్ అభిమన్యు ఇంచార్జులుగా ఉంటారు.