లోక్ సభ ఎన్నికల్లో బీజేపీకి మెజారిటీ సీట్లు కష్టం, నాడు మోడీ హవా, నేడు సునామి, రామ్ మాధవ్ !
న్యూఢిల్లీ: లోక్ సభ ఎన్నికల తరువాత మెజారిటీ సీట్లు రాకుంటే మిత్రపక్షాలతో కలిసి బీజేపీ అధికారంలోకి రావడం అనివార్యం అయ్యే అవకాశం ఉందని ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి రామ్ మాధవ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. లోక్ సభ ఎన్నికల్లో బీజేపీకి మెజారిటీ సీట్లు రావడం డౌట్ గా ఉందని రామ మాధవ్ చెప్పారు.
ప్రముఖ మీడియాకు ఇచ్చిన ఇంటర్వూలో బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి రామ్ మాధవ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. లోక్ సభ ఎన్నికల్లో బీజేపి 271 నియోజక వర్గాల్లో విజయం సాదిస్తే చాల సంతోషిస్తామని అన్నారు. అలా జరగకుంటే ఎన్ డీఏ మిత్రపక్షాలతో కలిసి కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వస్తుందని రామ్ మాధవ్ చెప్పారు.

2014 లోక్ సభ ఎన్నికల్లో ఉత్తర భారతదేశంలో క్లీన్ స్వీప్ చేసిన బీజేపీ 2019 లోక్ సభ ఎన్నికల్లో అనేక నియోజక వర్గాల్లో ఓటమి చెందుతుందని పలు సర్వేలు చెప్పిన విషయం తెలిసిందే. అయితే కేంద్ర ప్రభుత్వం హవా ఉన్నందున బీజేపీ ఎన్ డీఏ మిత్రపక్షాలతో అధికారంలోకి వస్తుందని రామ్ మాధవ్ ఆ ఇంటర్వూలో చెప్పారు.
2014లో జరిగిన లోక్ సభ ఎన్నికల్లో నరేంద్ర మోడీ హవా పని చేసిందని, 2019 లోక్ సభ ఎన్నికల్లో నరేంద్ర మోడీ సునామి పని చేసిందని, బీజేపీకి ఒక్క ఓటు వేస్తే ఉగ్రవాదుల మీద వెయ్యి కేజీల బాంబు వేసినట్లు అయ్యిందని ఉత్తరప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కేశవ్ ప్రసాద్ మౌర్య చెప్పిన మాటలను బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి రామ్ మాధవ్ గుర్తు చేశారు. మొత్తం మీద బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి రామ్ మాధవ్ సంచలన వ్యాఖ్యల మీద చర్చ మొదలైయ్యింది.
-
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
బంగాళాఖాతంపై ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు -
తిరుమలలో సీఎం చంద్రబాబుకు భక్తుల స్పెషల్ రిక్వెస్ట్, అక్కడే ఆదేశాలు..!! -
ఎట్టకేలకు జీవన్ రెడ్డి చేరే పార్టీ ఖరారు, అదే బాటలో..!! -
రామ్ చరణ్ బర్త్ డేకు బిగ్ సర్ ప్రైజ్: `పెద్ది` నుంచి -
త్వరలో తిరుపతి, హైదరాబాద్కు నేరుగా రైళ్లు: ఆ జిల్లాకు కేంద్రమంత్రి తీపికబురు! -
పాకిస్తాన్ క్రికెట్ కు ఓ దండం..మెయిన్ విలన్ ఆయనే: కిర్స్టెన్ -
"ధురంధర్" డైరెక్టర్ నెక్స్ట్ సినిమా ఆ స్టార్ హీరోతోనే ??? -
మేషరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, ధనుస్సు రాశులకు ఏప్రిల్ నెలలో రాజయోగం -
డైరెక్ట్ గా ఇరాన్ నుంచే భారత్ ఆయిల్ కొనుగోళ్లు: గ్యాస్ కొరతకూ చెక్ -
డొనాల్డ్ ట్రంప్ సడన్ యూటర్న్- యుద్ధ విరామం -
'ధురంధర్ 2'పై టాలీవుడ్ హీరోల ప్రశంసలు.. ప్రకాష్ రాజ్ రియాక్షన్ ఇదే!












Click it and Unblock the Notifications