దారుణం.. హెచ్ఐవి సోకిన బాలికపై రెండేళ్లు అత్యాచారం!
మహారాష్ట్రలోని లాతూర్ జిల్లాలో ఒక దారుణమైన, దిగ్భ్రాంతికరమైన ఘటన వెలుగులోకి వచ్చింది. లాతూర్లోని 'సేవాలయ హెచ్ఐవి బాధితుల షెల్టర్'లో ఆశ్రయం పొందుతున్న 16 ఏళ్ల హెచ్ఐవి పాజిటివ్ బాలికపై రెండేళ్ల నుంచి పదేపదే అత్యాచారం జరిగిందని, అంతేకాకుండా ఆమెను బలవంతంగా గర్భస్రావం చేయించినట్లు ఆరోపణలు వెల్లువెత్తాయి. ఈ ఘటనపై లాతూర్ పోలీసులు లోతైన దర్యాప్తును ప్రారంభించారు. ఈ దారుణమైన విషయాన్ని కప్పిపుచ్చడానికి ప్రయత్నించినందుకు సేవాగృహం వ్యవస్థాపకుడు , అతని భార్య, ఒక మహిళా సిబ్బందితో సహా నలుగురిని పోలీసులు అరెస్టు చేశారు.
కేసు నమోదు, నిందితుల అరెస్ట్ వివరాలు
లాతూర్ పోలీస్ సూపరింటెండెంట్ (SP) అమోల్ తాంబే వెల్లడించిన వివరాల ప్రకారం.. బాధితురాలి ఫిర్యాదు ఆధారంగా పోలీసులు భారతీయ న్యాయ సంహిత (BNS), పోక్సో చట్టాలలోని సంబంధిత నిబంధనల కింద మొత్తం ఆరుగురిపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఈ ఆరుగురిలో ఇప్పటికే ఆశ్రయ గృహం డైరెక్టర్ రవి బాపట్లే, అతని భార్య, సూపరింటెండెంట్ రచన బాపట్లే, ఉద్యోగి పూజా వాఘ్మారేలను పోలీసులు అరెస్ట్ చేశారు. ప్రధాన నిందితుడు, బాలికపై అత్యాచారం చేసినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఉద్యోగి అమిత్ మహాముని ప్రస్తుతం పరారీలో ఉన్నాడు. వీరితో పాటు, లాతూర్లోని ఒక ప్రైవేట్ ఆసుపత్రికి చెందిన ఒక గైనకాలజిస్ట్ను కూడా నిందితులలో చేర్చారు. బాధితురాలిని బలవంతంగా గర్భస్రావం చేయించింది ఆ వైద్యురాలేనని బాలిక తన వాంగ్మూలంలో పేర్కొంది.

ఈ దారుణం ఎలా వెలుగులోకి వచ్చింది?
ధరాశివ్ జిల్లాకు చెందిన ఈ బాలికను సుమారు రెండేళ్ల క్రితం లాతూర్ జిల్లాలోని హోసేగావ్లో ఉన్న 'సేవాలయ' అనే హెచ్ఐవి సోకిన పిల్లల ఆశ్రయ గృహానికి తరలించారు. బాలిక తన ఫిర్యాదులో జులై 13, 2023 నుంచి జులై 23, 2025 మధ్య ఆశ్రయ గృహంలోని అమిత్ మహాముని అనే ఉద్యోగి తనపై నాలుగు సార్లు లైంగిక దాడికి పాల్పడ్డాడని వెల్లడించింది. ఈ దారుణం గురించి తాను ఆశ్రయ గృహం యాజమాన్యానికి తెలియజేసినప్పటికీ, వారు ఈ విషయాన్ని అణచివేసి, నిందితుడిని రక్షించడానికి ప్రయత్నించారని బాలిక తీవ్ర ఆరోపణలు చేసింది.
బాలిక తన బాధను ఒక లేఖ రూపంలో రాసి ఫిర్యాదు పెట్టెలో వేసింది. అయితే ఈ విషయం తెలుసుకున్న నిందితుడు ఆ లేఖను చించివేసి బాలికను తీవ్రంగా హెచ్చరించాడని పోలీసులు వెల్లడించారు. ఇటీవల బాలిక అనారోగ్యానికి గురై ఆస్పత్రికి వెళ్లినప్పుడు ఆమె 4 నెలల గర్భవతినని వైద్య పరీక్షల్లో వెల్లడైంది. లాతూర్లోని ఒక ప్రైవేట్ ఆస్పత్రిలో ఆమె సమ్మతి లేకుండానే ఆ గైనకాలజిస్ట్చే బలవంతంగా గర్భస్రావం అయ్యేలా చేశారని బాధితురాలు పేర్కొంది.
ఈ మొత్తం దారుణం ఇటీవల బాలిక ధరాశివ్లోని తన స్వగ్రామానికి చేరుకుని అక్కడి పోలీస్ స్టేషన్ లో జీరో ఎఫ్ఐఆర్ నమోదు చేయడంతో వెలుగులోకి వచ్చింది. ధరాశివ్ పోలీసులు వెంటనే ఈ కేసును దర్యాప్తు నిమిత్తం లాతూర్ జిల్లాలోని ఔసా పోలీస్ స్టేషన్కు బదిలీ చేశారు. జీరో ఎఫ్ఐఆర్ అందిన వెంటనే కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించామని ఎస్పీ అమోల్ తాంబే స్పష్టం చేశారు. ఈ కేసును దర్యాప్తు చేస్తున్న పోలీస్ ఇన్స్పెక్టర్ సునీల్ రేజిత్వాడ్ మాట్లాడుతూ.. విషయం తీవ్రతను దృష్టిలో ఉంచుకుని, పరారీలో ఉన్న నిందితులను పట్టుకోవడానికి అనేక ప్రత్యేక బృందాలను రంగంలోకి దించామని వెల్లడించారు. ప్రధాన నిందితుడు అమిత్ మహామునిని పట్టుకోవడానికి గాలింపు చర్యలు ముమ్మరం చేశారు.
-
వంట గ్యాస్ ఇక బుక్ చేయాలంటే, ఇలా తప్పనిసరి - తాజా మార్గదర్శకాలు..!! -
రామ్చరణ్ నా ప్రాణం కంటే ఎక్కువ: అల్లు అర్జున్ -
సప్తగిరి ఎక్స్ప్రెస్, చర్లపల్లి సూపర్ ఫాస్ట్ రైళ్లకు ఇకపై -
ఉత్తర తెలంగాణా అభివృద్ధిలో గేమ్ ఛేంజర్ ఆ ఎయిర్పోర్ట్.. కేంద్రం మరో కీలక అడుగు! -
20 ఏళ్ల తేడా ఉన్న ఆ చిన్నదే ఎందుకు? ఒక్క సీన్తో ఛాన్స్ కొట్టేసింది! -
తండ్రి, తనయుడి స్థానాలు ఇవే- డీఎంకే తొలి జాబితా -
జన్మ నక్షత్రం పునర్వసు, పుష్యమి, ఆశ్లేష ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం -
H-1B Visa: హెచ్1బీ లాటరీ నోటీసుల విడుదల-స్టేటస్ ఇలా చెక్ చేసుకోండి..! -
రాజమండ్రి- కాకినాడ పోర్ట్ రైలు ప్రయాణికులకు ముఖ్య గమనిక -
ఏప్రిల్ లో బ్యాంకులకు వరుస హాలిడేస్ - స్కూళ్లకు వేసవి సెలవులపై తాజా ఉత్తర్వులు..!! -
ఇరాన్కు రోజుకు రూ. 1,319 కోట్ల ఆదాయం.. అమెరికా అంతమే లక్ష్యంగా..!! -
బంగారం ధరలు తలకిందులు












Click it and Unblock the Notifications