మహారాష్ట్రలో భారీగా పెరిగిన కరోనా కేసులు, 2 బీఏ.5 వేరియంట్: ఢిల్లీలో పాజిటివిటీ రేటు
ముంబై: దేశంలో కరోనా వైరస్ కేసులు భారీగా పెరుగుతున్నాయి. ముఖ్యంగా మహారాష్ట్రలో ఎక్కువ కేసులు నమోదవుతున్నాయి. మహారాష్ట్రలో గురువారం 4,255 కొత్త కోవిడ్ -19 కేసులు నమోదయ్యాయి. 2,879 రికవరీలు, మూడు మరణాలు సంభవించాయి. రాష్ట్రంలో యాక్టివ్ కేసుల సంఖ్య 20,634కు పెరిగాయి. అదనంగా, నాగ్పూర్లో బీఏ.5 వేరియంట్ 2 కేసులు కనుగొనబడ్డాయి.
ఒక రోగి 29 ఏళ్ల పురుషుడు కాగా, మరొకరు 54 ఏళ్ల మహిళ కోవిడ్-19 పరీక్ష కోసం వెళ్లగా.. జూన్ 6, జూన్ 9న పాజిటివ్గా గుర్తించారు. వారు గత వారంలో వరుసగా కేరళ, ముంబైకి ప్రయాణించిన చరిత్రను కలిగి ఉన్నారు. రోగులు ఇద్దరూ టీకాలు వేసుకున్నారు. హోమ్ ఐసోలేషన్లో కోలుకుంటున్నారు.
మరోవైపు, గత 10 రోజుల్లో ఢిల్లీలో 7,100 కి పైగా కరోనావైరస్ కేసులు నమోదయ్యాయి. ఈ క్రమంలో వైద్యులు, ఇతర వైద్య నిపుణులు రక్షణను తగ్గించవద్దని, అన్ని కోవిడ్-తగిన ప్రవర్తనను అనుసరించాలని ప్రజలను హెచ్చరించారు.
తాజా కేసులతో, అధికారిక గణాంకాల ప్రకారం.. జూన్ 7న నమోదైన 1.92 శాతం నుంచి జూన్ 15 నాటికి 7.01 శాతానికి పాజిటివిటీ రేటు కూడా పెరిగింది.
ఢిల్లీలో బుధవారం 1,375 కోవిడ్ కేసులు నమోదయ్యాయి, ఇది ఒక నెలలో అత్యధిక రోజువారీ సంఖ్య. కోవిడ్ -19 కేసుల సంఖ్య గత పది రోజుల్లో స్థిరమైన పెరుగుదలను నమోదు చేసింది. జూన్ 6 న 247 నుంచి జూన్ 15 న రోజువారీ సంఖ్య 1,300కి పెరిగింది, ఈ కాలంలో మొత్తం 7,175 కేసులకు చేరినట్లు డేటా వెల్లడించింది.
ఇది ఈ కాలంలో రోజువారీ కేసులలో దాదాపు 450 శాతం పెరుగుదలకు అనుగుణంగా ఉంది.
రోజువారీ కాసేలోడ్ అకస్మాత్తుగా పెరిగిపోతున్న దృష్ట్యా, వివిధ ప్రముఖ ఆసుపత్రుల వైద్యులు మాస్కులు ధరించడం, సామాజిక దూరాన్ని నిర్వహించడం, రద్దీగా ఉండే ప్రదేశాలను నివారించడం, ఇతర భద్రతా చర్యలు తీసుకోవడం వంటి అన్ని కోవిడ్-తగిన ప్రవర్తనలను అనుసరించాలని ప్రజలను కోరారు. అలాగే ప్రజలు భయాందోళనలకు గురికావద్దని కోరారు.