మహారాష్ట్రలో కరోనా విలయం: ఒక్కరోజే 49 వేల కేసులు
మహారాష్ట్రలో కరోనా కేసులు భారీగా వస్తున్నాయి. గతేడాది మాదిరిగా కేసులు నమోదవుతున్నాయి. శనివారం ఒక్కరోజు 49 వేల 447 కేసులు వచ్చాయి. గతేడాది కరోనా కేసులు వెలుగులోకి వచ్చిన తర్వాత ఈ స్థాయిలో కేసులు రావడం ఇదే తొలిసారి. కరోనా కేసులు పెరగడం వల్ల లాక్ డౌన్ విధిస్తామని ముంబై మేయర్, మహారాష్ట్ర సీఎం ఉద్దవ్ థాకరే ఇండికేషన్స్ ఇచ్చారు.
గత 24 గంటల్లో 277 మంది కరోనా వైరస్తో చనిపోయారు. దీంతో మరణాల సంఖ్య 1.88 శాతం ఉంది. రాష్ట్రంలో 21 లక్షల పైచిలుకు మంది హోం క్వారంటైన్లో ఉన్నారు. 18 వేల మందికి పైగా ఇనిస్టిట్యూషనల్ క్వారంటైన్లో ఉన్నారు. రాష్ట్రంలో 4 లక్షల పైచిలుకు యాక్టివ్ కేసులు ఉన్నాయి.
దేశంలో కరోనా సెకండ్ వేవ్ కొనసాగుతోంది. ఏ లక్షణాలు లేకున్నా వైరస్ వస్తోంది. మారుమూల ప్రాంతాలకు కూడా వైరస్ వ్యాపిస్తోంది. మాస్క్ విధిగా ధరించాలని అధికారులు కోరుతున్నారు. భౌతికదూరం పాటించాలని సజెస్ట్ చేస్తున్నారు.