70 ఏళ్లు పూర్తి: ట్విట్టర్లో మోడీ శుభాకాంక్షలు
న్యూఢిల్లీ: ఐక్యరాజ్య సమితి దినోత్సవాన్ని పురస్కరించుకుని ప్రధాని నరేంద్రమోడీ శుభాకాంక్షలు తెలిపారు. ప్రపంచాన్ని ఓ ప్రశాంత ప్రదేశంగా తీర్చిదిద్దే లక్ష్యంగా గత 70 ఏళ్లుగా ఐక్యరాజ్యసమితి కృషిచేస్తోందని ప్రధాని మోడీ ట్విట్టర్లో పేర్కొన్నారు.

గాంధీజీ చూపించిన మార్గం అనుసరనీయమని, ఐక్యరాజ్య సమితి ప్రారంభించే ప్రతి కార్యక్రమంలో కూడా భారత్ మద్దతు తప్పక ఉంటుందని ఆయన పేర్కొన్నారు. రెండో ప్రపంచ యుద్ధం తర్వాత మళ్లీ యుద్ధం రాకుండా ఉండేందుకు ముందస్తు జాగ్రత్తతో ఐక్యరాజ్య సమితిని నెలకొల్పారు.
Greetings to everyone on @UN Day. UN completes 70 years in service of humanity, committed to its goal of making the world a peaceful place.
— Narendra Modi (@narendramodi) October 24, 2015 రెండో ప్రపంచ యుద్ధం ముగియగానే 1945, అక్టోబరు 24న ఐక్యరాజ్యసమితిని ఏర్పాటు చేస్తూ ఆరోజు అమెరికా, రష్యా, జర్మనీ, బ్రిటన్ తదితర దేశాలు నిర్ణయం తీసుకున్నాయి. ఈ నిర్ణయానికి ప్రపంచంలోని మిగతా దేశాలు ఆమోదం తెలిపాయి. దీంతో ఐక్యరాజ్య సమితి ప్రపంచంలో శాంతిని నెలకొల్పేందుకు తన వంతు ప్రయత్నిస్తోంది.
The ideals & path shown by Gandhi ji are extremely relevant today & they resonate with the @UN charter & ideals of the UN.
— Narendra Modi (@narendramodi) October 24, 2015 











Click it and Unblock the Notifications