మహా రాజకీయాల్లో సంచలనం: ఒక్కటైన థాక్రే సోదరులు
దశాబ్దాల నిరీక్షణకు ఎట్టకేలకు తెరపడింది. శివసైనికులు, మహారాష్ట్ర నవనిర్మాణ సేన కార్యకర్తలు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తుండగా.. థాక్రే సోదరులు ఎట్టకేలకు ఏకమయ్యారు. మహారాష్ట్ర రాజకీయాలను మలుపు తిప్పుతూ ఉద్ధవ్ థాకరే, రాజ్ థాకరే అధికారికంగా పొత్తును ప్రకటించారు.
బాలాసాహెబ్ సాక్షిగా ఒక్కటైన కుటుంబం
బుధవారం ముంబైలోని వర్లీలో జరిగిన ఉమ్మడి విలేకరుల సమావేశంలో ఈ చారిత్రాత్మక ప్రకటన వెలువడింది. దీనికి ముందు ఉద్ధవ్, రాజ్ థాక్రేలు తమ కుటుంబ సభ్యులతో (రష్మీ థాక్రే, షర్మిల థాక్రే, ఆదిత్య థాక్రే, అమిత్ థాక్రే) కలిసి దాదర్లోని శివాజీ పార్కుకు వెళ్లారు. అక్కడ శివసేన వ్యవస్థాపకులు బాలాసాహెబ్ థాక్రే స్మారకం వద్ద నివాళులర్పించి, ఆశీస్సులు తీసుకున్నారు. అనంతరం ఒకే కారులో ప్రెస్ కాన్ఫరెన్స్కు చేరుకోవడం విశేషం.

ముంబై మేయర్ 'మరాఠీ'నే కావాలి: రాజ్ థాక్రే
మహారాష్ట్ర నవనిర్మాణ సేన (MNS) అధినేత రాజ్ థాక్రే మాట్లాడుతూ.. శివసేన (UBT), మహారాష్ట్ర నవనిర్మాణ సేన పొత్తును అధికారికంగా ఖరారు చేశారు. వివాదాల కంటే మహారాష్ట్ర ప్రయోజనాలే మాకు ముఖ్యమని ఆయన పేర్కొన్నారు. సీట్ల పంపకంపై ఇప్పుడే స్పందించనని చెబుతూ.. "ముంబై మేయర్ పీఠంపై మరాఠీ వ్యక్తే కూర్చుంటారు, అది మా కూటమి నుంచే జరుగుతుందని ధీమా వ్యక్తం చేశారు. పరోక్షంగా బీజేపీపై విమర్శలు చేస్తూ.. అభ్యర్థులను దొంగిలించే ముఠాలు తిరుగుతున్నాయని ఎద్దేవా చేశారు.
ముంబైని ముక్కలు చేయనివ్వం: ఉద్ధవ్ థాక్రే
బీజేపీపై ఉద్ధవ్ థాక్రే తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. బీజేపీ ముంబైని ముక్కలు చేయాలని చూస్తోందని ఆయన ఆరోపించారు."మరాఠీ పార్టీలు విడివిడిగా కొట్లాడితే అది అమరవీరులకు అవమానం అవుతుంది. అందుకే మన వారసత్వాన్ని కాపాడుకోవడానికి మేము ఒక్కటయ్యాం" అని ఉద్ధవ్ భావోద్వేగంగా పిలుపునిచ్చారు. ఇప్పుడు ముంబై వైపు కన్నెత్తి చూసే వారి రాజకీయ భవిష్యత్తు ముగిసినట్లేనని హెచ్చరించారు.
7 నగరాల్లో పోటీకి సిద్ధం
ఈ రెండు పార్టీలు కలిసి ముంబై, పుణె, నాసిక్ వంటి 7 ప్రధాన మున్సిపల్ కార్పొరేషన్ (BMC) ఎన్నికల్లో పోటీ చేయనున్నాయి. జనవరి 15న జరగనున్న ఈ ఎన్నికల్లో 'మరాఠీ అస్మిత' వర్సెస్ 'బీజేపీ హిందుత్వ/అభివృద్ధి' మధ్య పోరు ఆసక్తికరంగా మారనుంది.
-
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
ఏపీలో ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్..! ఇకపై ఈ మార్పు..! -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
విజయ్కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
తెలంగాణ కేబినెట్ సంచలన నిర్ణయాలు.. ఆ బిల్లులకు ఆమోదం












Click it and Unblock the Notifications