సోనూ సూద్ సోదరి కూడా పరాజయం.. ఆప్ గాలిలో తప్పని అపజయం
పంజాబ్లో అంచనాలు తలకిందులు అయ్యాయి. ఉద్దండులు ఓటమి పాలయ్యారు. చన్నీ, సిద్దూ, అమరీందర్ సింగ్ పరాజయానికి గురయ్యారు. వారి జాబితాలోనే ప్రముఖ నటుడు సోనూ సూద్ సోదరి మాళవిక సూద్ చేరారు. అయితే ఆమె 20 వేలకు పైగా ఓట్ల తేడాతో ఓటమి పాలయ్యారు. మోగా నియోజకవర్గం నుంచి ఆమె బరిలో ఉన్నారు. ఆప్ అభ్యర్థి డాక్టర్ అమన్ దీప్ కౌర్ అరోరా చేతిలో పరాజయం చెందారు. 58 వేల 813 ఓట్ల తేడాతో అమన్ దీప్ గెలుపొందారు. మాళవికకు 38 వేల 125 ఓట్లు వచ్చినట్లు సమాచారం. అంటే 20 వేల ఓట్ల తేడా ఉంది.
కరోనా సమయంలో సోనూ సూద్ చేసిన సేవలు అందరికీ గుర్తున్నాయి. అతని సోదరి కూడా సామాజిక సేవలో పాల్గొన్నారు. పంజాబ్లో ఎన్నికల సమయంలో ఆమె కాంగ్రెస్ పార్టీలో చేరారు. తన సోదరి ఎన్నికల్లో పోటీ చేస్తుందని, తాను మాత్రం రాజకీయాల్లోకి రావడం లేదని సోనూ సూద్ ప్రకటించారు. మోగా నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా బరిలోకి దిగారు. కానీ అనూహ్యంగా మొదటి నుంచి వెనుకంజలో కొనసాగుతూ వచ్చి,. చివరకు ఓడిపోయారు.

ఆప్ ధాటికి కాంగ్రెస్తోపాటు బీజేపీ పత్తా లేకుండా పోయాయి. పంజాబ్లో ఆప్ ఏకపక్షంగా ప్రభుత్వ ఏర్పాటుకు సిద్ధమైంది. తాము రాజకీయాలు చేయం అని.. ఢిల్లీ అభివృద్ధిని చూడండి.. అదే ఇక్కడ రిపీట్ చేస్తామని సైలెంట్ ప్రచారం చేసింది. ఈ వ్యూహాలే పంజాబ్లో ఆప్ పాగా వేయడానికి కారణం అయ్యాయి.
అయితే పంజాబ్లో చక్రం తిప్పాలని సిద్దూ అనుకున్నాడు. తమ పార్టీ విజయం తథ్యం అని అంచనా వేశారు. కానీ సిద్దూ వల్లే కాంగ్రెస్ ప్రభ తగ్గిందని విశ్లేషకులు అంటారు. మంత్రిగా ఉన్న సమయం నుంచి అమరీందర్తో పడలేదు. గత సెప్టెంబర్లో రాజీనామా కూడా చేసి హల్ చల్ చేశాడు. దీంతో తప్పని పరిస్థితుల్లో అమరీందర్ సింగ్ను సీఎం పదవీ నుంచి తప్పించారు. అప్పుడు పీసీసీ చీఫ్గా కొనసాగుతోన్న.. సీఎం పోస్టుపై మనసు ఉండేంది. ఇంతలో చన్నీని సీఎం చేయడంతో మింగలేక కక్కలేని పరిస్థితి. అలా ఎన్నికలకు వచ్చి.. గెలుద్దామని అనుకున్నారు. కానీ ప్రజలు ఆప్ వైపు మొగ్గుచూపారు.
-
మెగాస్టార్ కొత్త మూవీ షూటింగ్ షురూ.. క్లాప్ కొట్టిన పవన్ !! -
20 ఏళ్ల తేడా ఉన్న ఆ చిన్నదే ఎందుకు? ఒక్క సీన్తో ఛాన్స్ కొట్టేసింది! -
తెలుగు ఇండస్ట్రీ హిట్ హిందీ రీమేక్లో శ్రీలీల.. ట్రోలింగ్ చూస్తే ఏడుపే !! -
ఏప్రిల్ 1 నుంచి ఉద్యోగులకు కొత్త రూల్స్- జీతం, పన్ను సహా భారీ మార్పులు..! -
ఇరాన్కు రోజుకు రూ. 1,319 కోట్ల ఆదాయం.. అమెరికా అంతమే లక్ష్యంగా..!! -
today rashiphalalu: మీనరాశిని వదిలిపెట్టని ముఖ్యగ్రహాలు.. వీరి పంట పండుతుంది! -
రాజమండ్రి- కాకినాడ పోర్ట్ రైలు ప్రయాణికులకు ముఖ్య గమనిక -
సోషల్ మీడియాలో సెన్సేషన్ గా మారిన "అల్లు అర్జున్" రిలేటివ్.. -
2028 అమెరికా అధ్యక్షుడు ఆయనే.. భారత్ కు గుడ్ న్యూస్..!! -
రోజూ ఉదయాన్నే ఖాళీ కడుపుతో ఈ నీళ్లు తాగితే చాలు- లివర్, కిడ్నీలు క్లీన్..!! -
వంట గ్యాస్ ఇక బుక్ చేయాలంటే, ఇలా తప్పనిసరి - తాజా మార్గదర్శకాలు..!! -
సప్తగిరి ఎక్స్ప్రెస్, చర్లపల్లి సూపర్ ఫాస్ట్ రైళ్లకు ఇకపై












Click it and Unblock the Notifications