అజిత్ పవార్ విమాన ప్రమాదంపై మమత షాకింగ్ డిమాండ్- ఎన్నో అనుమానాలు
నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (అజిత్ పవార్ వర్గం) అధినేత, మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ కన్నుమూశారు. ఆయన వయస్సు 66 సంవత్సరాలు. భార్య సునేత్రా పవార్, కుమారులు పార్థ్ పవార్, జయ్ పవార్ ఉన్నారు. ఆయన ప్రయాణిస్తోన్న విమానం ప్రమాదానికి గురైంది. ఈ ఘటనలో ఆయన తుదిశ్వాస విడిచారు. ఆయనతో పాటు విమానంలో ప్రయాణిస్తోన్న మరో ముగ్గురు కూడా మరణించారు. ఆయన ప్రయాణిస్తోన్న విమానం కొద్దిసేపటి కిందటే మహారాష్ట్రలోని బారామతిలో కుప్పకూలింది.
అజిత్ పవార్కు చెందిన ప్రైవేట్ విమానం అది. ఈ ఉదయం బారామతి సమీపంలో కుప్ప కూలిపోయింది. ఈ ప్రమాదం ల్యాండింగ్ సమయంలో సంభవించిందని ప్రాథమికంగా అందిన సమాచారాన్ని బట్టి తెలుస్తోంది. ఓ కార్యక్రమంలో పాల్గొనడానికి అజిత్ పవార్ ఈ తెల్లవారు జామున బారామతికి బయలుదేరారు. బారామతికి సమీపించిన అనంతరం ఇందులో సాంకేతిక లోపాలు తలెత్తాయి. దీంతో పైలెట్ ఈ విమానాన్ని అత్యవసరంగా ల్యాండ్ చేయడానికి ప్రయత్నించారు. ఆ సమయంలో విమానం క్రాష్ ల్యాండింగ్ అయింది.

ఈ విషాద ఘటనపై పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. పలు అనుమానాలను వ్యక్తం చేశారు. సమగ్ర విచారణకు డిమాండ్ చేశారు. ఈ ఘటనపై సరైన దర్యాప్తు జరగాల్సిన అవసరం ఉందని అన్నారు. అజిత్ పవార్ మరణం మహారాష్ట్ర ప్రజలకు తీరని లోటుగా అభివర్ణించారు. ఈ ఘటన తనను కలచివేసిందని, మహారాష్ట్ర రాజకీయాలు, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీకి తీరని లోటు అని పేర్కొన్నారు.
అజిత్ పవార్ కుటుంబం, ఎన్సీపీ వ్యవస్థాపకుడు శరద్ పవార్, ఆయన కుటుంబ సభ్యులు, స్నేహితులు, అనుచరులకు మమతా బెనర్జీ ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. ఈ ఘటన.. అసాధారణంగా అభిప్రాయపడుతున్నారు మమత బెనర్జీ. దీనిపై సమగ్ర దర్యాప్తు జరిపించాలనే డిమాండ్ కు కారణం- మహారాష్ట్ర రాజకీయాల్లో ఇటీవలి కాలంలో చోటు చేసుకుంటోన్న పరిణామాలే ప్రధాన కారణమని తెలుస్తోంది.
Deeply shocked and stunned by the suddden demise of Ajit Pawar! The Deputy Chief Minister of Maharashtra and his co-passengers have died in a disastrous plane crash at Baramati today morning, and I am feeling a deep sense of loss.
— Mamata Banerjee (@MamataOfficial) January 28, 2026
My condolences to his family including his uncle…
అజిత్ పవార్ మరణవార్త తెలిసిన వెంటనే మహారాష్ట్ర మొత్తం విషాదసంద్రంలో మునిగిపోయింది. ప్రత్యేకించి- పవార్ కుటుంబానికి గట్టి పట్టు ఉన్న బారామతిలో విషాద ఛాయలు అలముకున్నాయి. నేడు జరగాల్సిన అనేక కార్యక్రమాలు రద్దయ్యాయి. అటు ప్రభుత్వం కూడా నేటి అధికారిక కార్యక్రమాలన్నింటినీ రద్దు చేసింద. పలువురు మంత్రులు దుఖాన్ని ఆపుకోలేకపోయారు. మాజీ మంత్రి, ఎన్సీపీ (శరద్ చంద్ర పవార్) నేత అనిల్ దేశ్ ముఖ్ మీడియా ముందే కన్నీరు మున్నీరు అయ్యారు.
-
వేసవి సెలవుల షెడ్యూల్ లో కీలక మార్పులు, తాజా ఉత్తర్వులు..!! -
బంగారం ధరలు.. మళ్లీ మొదటికి -
పవన్ కళ్యాణ్ని నిండాముంచిన హరీష్ శంకర్.. -
పేలిన ధరల బాంబు- ఒక్కో సిలిండర్ పై రూ. 195.50 పెంపు -
IPL తొలి మ్యాచ్ లోనే సెన్సేషన్, ఎవరీ కూపర్ కనోలీ - సూర్యవంశీని డామినేట్ చేస్తూ..!! -
పాల ధరలు భారీగా పెంపు, ఒకే సారి - కొత్త రేట్లు ఇలా..!! -
రైతు భరోసా అమలులో కీలక మార్పులు, ఇక వారికీ వర్తింపు - నిధుల జమ ముహూర్తం..!! -
Amaravati Bill: పార్లమెంట్ లో అమరావతి బిల్లు..! కాంగ్రెస్ స్టాండ్ ఇదే..! -
పెళ్లి కాకపోయి ఉంటే ఆ హీరోతో డేటింగ్ చేస్తా - అనసూయ -
జన్మ నక్షత్రం మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం -
ఈ టైంలో కరెంట్ వాడితే బాదుడే, విద్యుత్ ఛార్జీల్లో మార్పులు - నేటి నుంచే అమలు..!! -
అయోధ్య రాముని సన్నిధిలో గౌతమ్ అదానీ..!











Click it and Unblock the Notifications