నరేంద్ర మోడీ! అమిత్ షా ఆరోపణలు నిరూపించగలరా?: మమతా బెనర్జీ
కోల్కతా: పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ వేసిన పేయింటింగ్లను కొందరు చిట్ఫండ్ సంస్థల యజమానులు కోట్ల రూపాయలకు కొనుకున్నారని భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షులు అమిత్ షా తీవ్రవ్యాఖ్యలు చేశారు. దీనిపై దీదీ గట్టి కౌంటర్ ఇచ్చారు. ఈ వ్యాఖ్యలపై నిప్పులు చెరిగారు.
తనపై చేసిన ఆరోపణలు దమ్ముంటే ప్రధాని నరేంద్ర మోడీ నిరూపించాలని సవాల్ చేశారు. దమ్ముంటే పేయింటింగ్స్ ద్వారా నేను డబ్బు సంపాదించానని రుజువు చేయాలని, మీ పార్టీ నేతలకు కనీస మర్యాద కూడా తెలియదని, అందుకే అలాంటి అసత్య ఆరోపణలు చేస్తున్నారని ధ్వజమెత్తారు. దీనిపై తాను పరువునష్టం దావా వేస్తానని చెప్పారు.
తూర్పు మిడ్నాపూర్లో మంగళవారం జరిగిన బహిరంగ సభలో అమిత్ షా మాట్లాడుతూ... మమతా బెనర్జీ వేసిన పేయింటింగ్స్ను కొందరు చిట్ఫండ్ సంస్థల యజమానులు కోట్ల రూపాయలకు కొనుకున్నారని ఆరోపించారు.
కాగా, తూర్పు మిడ్నాపూర్లో మంగళవారం జరిగిన సభలో అమిత్ షా ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ నేపథ్యంలో పశ్చిమ బెంగాల్లో ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకున్నాయి. సభ అనంతరం తృణమూల్ కాంగ్రెస్, భారతీయ జనతా పార్టీ కార్యకర్తల మధ్య ఘర్షణ తలెత్తింది. ఇరువర్గాలు రాళ్లు రువ్వుకున్నాయి. దీంతో ఆర్ఏఎఫ్ బలగాలు రంగంలోకి దిగి పరిస్థితిని అదుపులోకి తెచ్చాయి.