డైనింగ్ హాల్స్లో మైనారీటీ విద్యార్థులకు అధిక సీట్లను కేటాయించండి...! బెంగాల్లో మరో వివాదం..
ఇప్పటికే కొల్కతాలో బీజేపీ,తృణముల్ కాంగ్రెస్ పార్టీల మధ్య కోల్డ్వార్ కొనసాగుతున్న నేపథ్యంలో మరో వివాదానికి తెరలేచింది...కాగా రాష్ట్ర్రంలో ఉన్న ప్రభుత్వ విద్యాలాయాల్లో మధ్యాహ్నా బోజన పథకం కొనసాగుతోంది. దీంతో ఆయా విద్యాసంస్థల్లో ఉన్న ముస్లిం మైనారీటీ విద్యార్థులకు డెబ్బై శాతం మేర సీటింగ్ను రిజర్వేషన్ కల్పించాలని ఆదేశిస్తూ విద్యాధికారులకు సర్క్యూలర్ జారీ చేయడం వివాదానికి కేంద్ర బిందువు అవుతుంది.
పశ్చిమ బెంగాల్ రాష్ష్ట్రంలో బీజేపితోపాటు అధికార పార్టీల మధ్య మరో వివాదానికి తెరలేచింది. తాజాగా రాష్ట్ర్ర ప్రభుత్వం మధ్యహ్నా భోజన పథకం నిర్వహిస్తున్నారు. దీంతో ఆయా విద్యాసంస్థలో 70శాతం కంటే ఎక్కువగా ముస్లిం విద్యార్ధులు చదువుకుంటున్న వారికి అనుగుణంగా డైనింగ్ హాల్లో ప్రత్యేకంగా సీట్లు కేటాయించాలని ఆదేశిస్తూ విద్యాశాఖ అధికారులకు సర్క్యూలర్ జారీ చేశారు..దీంతో ఈసర్య్కూలర్ తో బీజేపీ నేతలు మండిపడుతున్నారు..విద్యార్ధుల మధ్య మతాలకు సంబంధించిన వివక్ష ఎందుకని ప్రశ్నించారు.హిందూ విద్యార్థులు ఏం చేశారని వారిపై వివక్ష చూపిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
Recommended Video
1.1 The West Bengal Government has issued a circular whereby it has directed the school authorities where 70 % or more students are from the Muslim community to reserve a dining hall with seating arrangements for them. pic.twitter.com/cwYQWngDtW
— Dilip Ghosh (@DilipGhoshBJP) June 27, 2019
ఒక వర్గానికి అనుకూలంగా మమతా సర్కార్ నిర్ణయాలు తీసుకోవడంపై బీజేపీ మండుపడుతోంది..దీంతో ఆందోళనకు సైతం సిద్దం అవుతున్నారు..మరోవైపు మమతా నిర్ణయం పై ఇతర పార్టీలు కూడ ప్రశ్నిస్తున్నాయి..అయితే మమత సర్కార్ మాత్రం అది ఎప్పుడో తీసుకువచ్చిన పాత నిబంధన అంటూ స్పష్టత ఇచ్చింది.అయితే ఇప్పటికే విత్ డ్రా చేసుకున్నామని కూడ మమతా బెనర్జీ స్పష్టత ఇచ్చింది. దీనిపై తప్పుడు సర్క్యులర్ను తిరిగి జారీ చేశారని ఆమే తెలిపారు. దీంతో రెండు పార్టీల మధ్య మరో కొత్త వివాదానికి తెరలేచినట్టయింది.