Wife: అత్త కళ్లముందే భార్య గొంతు కోసి చంపేసిన భర్త, అసలు మ్యాటర్ తో షాక్, మంచోడు అనుకుంటే !
లక్నో/ఉత్తరప్రదేశ్: బంధువులు చూపించిన యువకుడికి మా కూతురిని ఇచ్చి పెళ్లి చేస్తే ఆమె సంతోషంగా ఉంటుందని యువతి కుటుంబ సభ్యులు అనుకున్నారు. యువతి తల్లిదండ్రులకు ఆస్తులు, వ్యవసాయ భూములు ఉండటంతో ఆమెను పెళ్లి చేసుకోవడానికి ఆ యువకుడు కూడా సిద్దం అయ్యాడు. పెళ్లి చేసుకున్న దంపతులు సంతోషంగా కాపురం చేశారు. బైక్ లో భార్యను తిప్పుతున్న భర్త ఆమెకు ఏంకావాలో అది తీసిచ్చాడు. ఇదంతా పెళ్లి జరిగిన కొత్తలో జరిగింది. రానురాను భర్త అతని భార్యను చితకబాదడం మొదలుపెట్టాడు. కూతురి కష్టాల గురించి తెలుసుకున్న అత్తమామలు అల్లుడికి బుద్దిమాటలు చెప్పారు. అయితే అల్లుడు మాత్రం అతనికి మూడు వచ్చినప్పుడు అతని భార్యను చితకబాది ఆమెకు సినిమా చూపిస్తున్నాడు. చివరికి అత్తమామల ముందే భార్యను పట్టుకుని చితకబాదేశాడు. అడ్డు వచ్చిన అత్తను చితకబాదేశాడు. అదే సమయంలో కూరగాయాలు కోసే కత్తి తీసుకున్న భర్త అతని అత్త ముందే అతని భార్యను దారుణంగా హత్య చెయ్యడం కలకలం రేపింది.

అమ్మాయికి పెళ్లి చెయ్యాలని అనుకున్నారు
ఉత్తరప్రదేశ్ లోని ఘాజీపూర్ సమీపంలోని నంద్ గంజ్ ఏరియాలో ప్రేమ్ కుమార్ అలియాస్ ప్రేమ్ అనే యువకుడు నివాసం ఉంటున్నాడు. బంధువులు చూపించినప ప్రేమ్ కుమార్ కు మా కూతురు స్వప్నా (పేరు మార్చడం జరిగింది)ని ఇచ్చి పెళ్లి చేస్తే ఆమె సంతోషంగా ఉంటుందని యువతి కుటుంబ సభ్యులు అనుకున్నారు.

భార్యను బాగా చూసుకున్న భర్త
స్వప్నా తల్లిదండ్రులకు ఆస్తులు, వ్యవసాయ భూములు ఉండటంతో ఆమెను పెళ్లి చేసుకోవడానికి ప్రేమ్ కుమార్ కూడా సిద్దం అయ్యాడు. పెళ్లి చేసుకున్న ప్రేమ్ కుమార్, స్వప్నా దంపతులు సంతోషంగా కాపురం చేశారు. బైక్ లో భార్య స్వప్నాను తిప్పుతున్న భర్త ప్రేమ్ కుమార్ ఆమెకు ఏంకావాలో అది తీసిచ్చాడు. ఇదంతా పెళ్లైన కొత్తలో జరిగింది.

అత్త ఆస్తుల్లో భాగం కావాలని భర్త డిమాండ్
మీ తండ్రి పేరుతో ఉన్న వ్యవసాయ భూములు తన పేరుతో రాసి తీసుకురావాలని ప్రేమ్ కుమార్ అతని భార్య స్వప్నాకు చెప్పాడు. మా కుటుంబ సభ్యుల పేరుతో ఉన్న ఆస్తులు నీ పేరు మీద రాసివ్వడానికి నేను అంగీకరించని స్వప్నా ఆమె భర్త ప్రేమ్ కుమార్ కు తేల్చి చెప్పింది. అప్పటి నుంచి ప్రేమ్ కుమార్ అతని భార్య స్వప్నాను చితకబాదడం మొదలుపెట్టాడు.

అత్త, భార్యను చితకబాదేశాడు
కూతురు స్వప్నా కష్టాల గురించి తెలుసుకున్న అత్తమామలు అల్లుడు ప్రేమ్ కుమార్ కు బుద్దిమాటలు చెప్పారు. అయితే అల్లుడు ప్రేమ్ కుమార్ మాత్రం అతనికి మూడు వచ్చినప్పుడు అతని భార్య స్వప్నాను చితకబాది ఆమెకు సినిమా చూపిస్తున్నాడు. చివరికి అత్తమామల ముందే భార్యను పట్టుకుని చితకబాదేశాడు. అడ్డు వచ్చిన అత్తను చితకబాదేశాడు.

అత్త కళ్లముందే భార్య గొంతు కోసి చంపేసిన భర్త
అదే సమయంలో కూరగాయాలు కోసే కత్తి తీసుకున్నప్రేమ్ కుమార్ అతని అత్త ముందే అతని భార్య గొంతు కోసి దారుణంగా హత్య చెయ్యడం కలకలం రేపింది. భార్యను హత్య చేసి అత్తను చితకబాదిన ప్రేమ్ కుమార్ ను అరెస్టు చేసి విచారణ చేస్తున్నామని ఘాజీపూర్ ఏఎస్పీ గోపీనాథ్ స్థానిక మీడియాకు చెప్పారు.












Click it and Unblock the Notifications