వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మరో మగాడితో రాసలీలలు! మహిళను హత్య చేసిన వృద్ధ ప్రియుడు

By Srinivas
|
Google Oneindia TeluguNews

చెన్నై: 75 ఏళ్ల వ్యక్తి 45 ఏళ్ల మహిళను హత్య చేసి అనంతరం తాను ఆత్మహత్య చేసుకున్న సంఘటన రెండు రోజుల క్రితం తమిళనాడులోని తొప్పుర్ లాడ్జిలో జరిగింది. ఈ సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. లాడ్జి సిబ్బంది డోర్ కొట్టినా తీయకపోవడంతో వారు పోలీసులకు సమాచారం అందించారు.

పోలీసులు వచ్చి తలుపులను బద్దలు కొట్టారు. లోపల ఇద్దరి శవాలు కనిపించాయి. పోలీసులు కేసు నమోదు చేసుకొని విచారించారు. విచారణలో పలు విషయాలు వెల్లడయ్యాయి. మృతులిద్దరూ సేలంకు చెందినవారు. 75 ఏళ్ల రాజగోపాలన్ సేలం కూడలి ప్రాంతంలో ఓ టీ దుకాణాన్ని నడుపుతున్నాడు.

Man kills woman, commits suicide

ఈ టీ కొట్టుకు సమీపంలో ఉంటున్న ఓ వ్యక్తి భార్య (45) సబియాతో ఈ వృద్ధుడికి వివాహేతర సంబంధం ఉంది. తమ లైంగిక వాంఛ తీర్చుకునేందుకు వీరిరువురూ తరచు ప్రయాణాలు చేస్తుండేవారు. అలా కొన్నిప్రాంతాల్లో దిగినప్పుడు లాడ్జిల్లో తమ రాసలీలలు సాగించేవారు.

జనవరి 15న వెళ్లిన వారు తోప్పూరులో ఓ లాడ్జి గదిని అద్దెకు తీసుకున్నారు. ఐతే శనివారం ఉదయం వరకూ తలుపులు తెరవకపోవడంతో అనుమానం వచ్చిన హోటల్ సిబ్బంది తలుపులు పగులగొట్టారు.

లోపల ఇద్దరూ శవాలై కనిపించడంతో పోలీసులకు సమాచారం అందించారు. మహిళను హత్య చేసి వృద్ధుడు ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు ప్రాథమికంగా గుర్తించారు. ఐతే ఆమె హత్యకు కారణం.. మరో వ్యక్తితో ఆమె వివాహేతర సంబంధాన్ని కొనసాగించడమేనని తెలుస్తోంది.

English summary
A 75-year-old man committed suicide after allegedly murdering a 45-year-old woman at a lodge in Thoppur here on night.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X