వీడు మామూలోడు కాదయ్యో.. ముగ్గురు అక్కాచెల్లెళ్లను ఒకేసారి పెళ్లాడాడు..!
ప్రస్తుతం దాంపత్య జీవితాలు దారుణంగా తయారయ్యాయి. చిన్న చిన్న విషయాలకే మనస్పర్థలు, విడాకులు, వివాహేతర సంబంధాలు, హత్యలు, ఆత్మహత్యలు ఇలా అనేక సంఘటనలు పెళ్లి చుట్టూ ముడిపడి ఉన్నాయి. అందుకే యువత వివాహం అంటేనే పారిపోతున్నారు. అలాంటి వాతావరణంలో ఓ యువకుడు ఒక్కరు కాదు.. ఇద్దరు కాదు.. ఏకంగా ముగ్గురిని ఒకేసారి వివాహం చేసుకుని అందరికీ షాక్ ఇచ్చాడు. ఉత్తర్ ప్రదేశ్ లోని జరిగిన ఈ ఘటన ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో తెగ వైరల్ అవుతోంది.
ఉత్తరప్రదేశ్ లోని ధౌరియా గ్రామానికి చెందిన సరోజ (20), సావిత్రి (19), సంతోషి (18) సొంత అక్కాచెల్లెళ్లు. అయితే సోషల్ మీడియాలో వీడియోలు చేస్తూ పాపులర్ అయ్యారు. అలా వీరు సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లుగా మారారు. అయితే వీరికి శ్యాంపురి గ్రామానికి చెందిన కెమెరామెన్ వికాస్ అలియాస్ విక్కు సాయం చేస్తూ ఉండేవాడు. ఈ క్రమంలో విక్కును ఓ ఆలయంలో ముగ్గురు అక్కాచెల్లెళ్లు వివాహం చేసుకోవడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.
వీరి కుటుంబ సభ్యులు అక్కాచెల్లెళ్లకు వేర్వేరుగా పెళ్లిళ్లు చేయాలని ప్రయత్నించారు. అయితే విడిపోవడం కంటే ఒకే వ్యక్తిని వివాహం చేసుకోవాలని నిర్ణయించుకున్నారు ఆ సోదరీమణులు. అలా అందరూ కలిసి విక్కును పెళ్లి చేసుకున్నారు. అయితే స్థానిక హిందూ సంస్థలు ఈ ఘటనపై తీవ్రంగా అభ్యంతరం తెలిపాయి.

ఇది సనాతన సంప్రదాయాలకు విరుద్ధమని తేల్చాయి. కానీ ఆ అక్కాచెల్లెళ్లు మాత్రం వినలేదు. పూర్వకాలంలో రాజులకు అనేక భార్యలు ఉండేవారు. అప్పుడు అది తప్పు కాలేదు. ఇప్పుడు ఎందుకు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు..? అని ఎదురు ప్రశ్నిస్తున్నారు. ఏదేమైనా ప్రస్తుతం ఈ ఘటన సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది.












Click it and Unblock the Notifications