ఒంటరిగావున్న సోదరుడి భార్యపై అత్యాచారం: నిందితుడి అరెస్ట్
కోయంబత్తూరు: తమిళనాడులోని పొల్లాచి సమీపంలోని ఓ గ్రామంలో దారుణ ఘటన చోటు చేసుకుంది. 37ఏళ్ల మహిళపై ఆమె భర్త సోదరుడు అత్యాచారానికి పాల్పడ్డాడు. సోమవారం రాత్రి జరిగిన ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
బాధితురాలి భర్త కొంత కాలం క్రితం చనిపోయాడని పోలీసులు తెలిపారు. కె త్రిమూర్తి(44) అనే నిందితుడు తన తమ్ముడి భార్య అయిన మహిళ ఇంటికి వెళ్లి అత్యాచారానికి పాల్పడ్డాడని చెప్పారు. మంగళవారం పొల్లాచిలోని అన్ని మహిళా పోలీస్ స్టేషన్లలో బాధితురాలి ఫిర్యాదు చేసిందని పోలీసులు తెలిపారు.

బాధితురాలి ఫిర్యాదు మేరకు నిందితుడు త్రిమూర్తిని అరెస్ట్ చేసి, రిమాండ్కు తరలించినట్లు పోలీసులు చెప్పారు. బాధితురాలిని వైద్య పరీక్షల నిమిత్తం పొల్లాచిలోని ఆస్పత్రికి తరలించినట్లు తెలిపారు. తదుపరి ఆరోగ్య పరీక్షల కోసం కోయంబత్తూరు మెడికల్ కాలేజీ ఆస్పత్రిలో ఆమె చేరినట్లు చెప్పారు.
రెండేళ్ల క్రితం బాధితురాలి భర్త చనిపోవడంతో ఆమె తన అత్తగారింటికి సమీపంలోని ఓ ఇంట్లో నివసిస్తోందని పోలీసులు తెలిపారు. ఆమెకు ఓ కొడుకు ఉన్నాడు. తన భర్త చనిపోయినప్పటి నుంచి లైంగిక వేధింపులకు గురిచేస్తున్నాడని బాధితురాలు పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొంది.
-
నిర్మలమ్మ వరాలు: మినిమం బ్యాంక్ బ్యాలెన్స్ పై సంచలన నిర్ణయం -
India Post GDS 2nd Merit List 2026: పోస్టల్ జాబ్స్ రెండో మెరిట్ లిస్ట్ అప్పుడే? -
మెగాస్టార్కి బహిరంగంగా క్షమాపణలు చెప్పిన సీఎం.. -
ఏపీలో భారీగా మద్యం ధరల తగ్గింపు, ఏ బ్రాండ్ ఎంత..!! -
T20 World Cup: సూర్యకుమార్ యాదవ్ కు ఐసీసీ అనూహ్య షాక్..! -
పెళ్లైన హీరోతో ఎఫైర్ వల్ల సినిమాల్లో బ్యాన్.. ఎవరా డ్రీమ్ గర్ల్ ?? -
ముఖానికే కాదు అక్కడ కూడా మేకప్ వేసుకోవాలన్నారు..! -
Work From Home ఇచ్చేశారు. ప్రభుత్వం, ఐటీ దిగ్గజాల కీలక ప్రకటన! -
తమిళ నాట అధికారం వారిదే, విజయ్ కు దక్కే సీట్లెన్ని- తేల్చేసిన కేకే సర్వే..!! -
చిన్నారి చీతాల గర్జన.. జ్వాలా ప్రసవంతో ఏడు దశాబ్దాల తర్వాత హఫ్ సెంచరీ -
చైనా, పాకిస్థాన్ కు ఊహించని గుడ్ న్యూస్ చెప్పిన భారత్.. -
అంచనాలను తలకిందులు చేస్తోన్న బంగారం ధరలు












Click it and Unblock the Notifications