Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

సుమలత సైలెంట్, బీజేపీతో చర్చలు, నేడే డెడ్ లైన్, రెబల్ స్టార్ ఫ్యాన్స్, మేడమ్ దారి ఎటు ?

లోక్‌సభ ఎన్నికలకు కౌంట్‌డౌన్‌ మొదలైంది. రాజకీయ పార్టీల్లో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. కర్ణాటకలో జేడీఎస్‌కు మండ్య టిక్కెట్‌ దక్కడంతో కొన్ని రోజుల నుంచి సైలెంట్‌గా ఉన్న సిట్టింగ్ ఎంపీ సుమలత అంబరీష్‌తో బీజేపీ కర్ణాటక రాష్ట్ర అధ్యక్షుడు బీవై విజయేంద్ర భేటీ అయ్యారు. మాజీ సీఎం బీఎస్ యడియూరప్ప కుమారుడితో సుమలత చర్చలు జరపడం ఇప్పుడు హాట్ టాపిక్ అయ్యింది.

ఈ సమయంలో సుమలత, విజయేంద్రల మధ్య కీలక విషయాల్లో చర్చలు జరిగినట్లు సమాచారం. మండ్య ఎంపీ సుమలత బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడి సమావేశం అనంతరం విలేకరులతో మాట్లాడుతూ నేను మండ్యను వదిలి మరెక్కడికీ వెళ్లను, నా ఉనికి మండ్యలో ఉందని, త్వరలో మండ్యలోనే తన రాజకీయ ఎత్తుగడ నిర్ణయాన్ని ప్రకటిస్తానని అన్నారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బీవై విజయేంద్రతో కొన్ని అంశాలపై చర్చించామని, శనివారం మండ్య కార్యకర్తల సమావేశం పెట్టామని ఆ అందరితో చర్చించి తుది నిర్ణయం తీసుకుంటామని సుమలత అన్నారు.

Mandya MP Sumalatha Ambarish held talks with Karnataka BJP president

తన మద్దతుదారులు, అభిమానులతో మాట్లాడిన తర్వాత నా సొంత నియోజకవర్గంలో నా నిర్ణయం తెలియజేస్తానని సుమలత అంబరీష్ చెప్పారు. మార్చి 30వ తేదీన శనివారం మండ్య కార్యకర్తలతో సుమలత ముఖ్యమైన సమావేశం నిర్వహించడం ఇప్పుడు హాట్ టాపిక్ అయ్యింది. మాజీ సీఎం, జేడీఎస్ నాయకుడు హెచ్‌డీ కుమారస్వామితో చర్చించేందుకు తనకు ఎలాంటి అభ్యంతరం లేదని మండ్య ఎంపీ సుమలత అంబరీష్ అన్నారు.

నా ఇంటికి ఎవరు వచ్చినా స్వాగతం చెబుతామని, ఆ ఇల్లు నా భర్త అంబరీష్ ఇల్లు అని, ఆయన ఉన్నప్పుడు కూడా అలాగే జరిగిందని, ఇప్పుడు కూడా ఎప్పటిలాగే మా ఇల్లు అందరికీ స్వాగతం పలుకుతుందని, నేను కూడా అందరినీ గౌరవంగా చూస్తానని, చర్చలకు ఎవరు వచ్చినా తనకు ఎలాంటి అభ్యంతరం లేదని సుమలత అన్నారు. మండ్య ఎంపీ సుమలతను కలిసి తాను చర్చలు జరుపుతానని ఇటీవల మాజీ సీఎం హెచ్‌డీ కుమారస్వామి చెప్పడంపై మీడియా అడిగిన ప్రశ్నకు సుమలత సమాధానమిచ్చారు.

ఈరోజు జరిగిన చర్చలో మీకు మండ్య టిక్కెట్‌ రాలేదని, బీజేపీ నుంచి వేరే సీటు వస్తుందా, లేక వేరే ఆఫర్ ఏమైనా ఇచ్చారా అని విలేకరులు అడిగిన ప్రశ్నకు సుమలత సమాధానం ఇచ్చారు. నేను బీజేపీని ఇంకా ఏమీ అడగలేదని, అలా అడగడం తనకు నచ్చదని, మండ్య నియోజక వర్గ ప్రజలతో చర్చించి తుది నిర్ణయం తీసుకుంటానని, ఎందుకంటే మండ్య నా నియోజకవర్గం అని సుమలత స్పష్టం చేశారు.

Mandya MP Sumalatha Ambarish held talks with Karnataka BJP president

పెద్దల సూచన మేరకు బీజేపీకి మద్దతివ్వాల్సి వస్తే మండ్యలో జేడీఎస్ అభ్యర్థి ప్రచారానికి వెళ్తారా? అనే ప్రశ్న విషయానికొస్తే తాను ప్రస్తుతానికి ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని, అవన్నీ ఇప్పుడు చెప్పలేమని. మా కార్యకర్తలు, మద్దతుదారులతో చర్చించి తదుపరి నిర్ణయం తీసుకుంటామని, అన్ని ప్రశ్నలకు ఆ రోజు సమాధానం చెబుతామని మండ్య ఎంపీ సుమలత అన్నారు. మండ్యలో పోటీ చేసే విషయంలో శనివారం మండ్య కార్యకర్తలు, మద్దతుదారులతో చర్చలు జరిపిన తరువాత తుది నిర్ణయం తీసుకుంటామని సుమలత స్పష్టం చేశారు.

సుమలత సానుకూలంగా స్పందించారని కర్ణాటక బీజేపీ అధ్యక్షుడు బీవై విజయేంద్ర అన్నారు. మండ్య రాజకీయాల గురించి ఆ నియోజక వర్గం ఎంపీ సుమలత అంబరీష్‌తో చర్చించడం నా కర్తవ్యం అని,. అందుకనుగుణంగా ఆమెతో కొన్ని అంశాలపై చర్చించామని, ఆమెను ఒప్పించే ప్రయత్నం ఇక్కడ తలెత్తలేదని, ఆమెను బీజేపీకి సహకరించాలని కోరినట్లు కర్ణాటక బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బీవై. విజయేంద్ర తెలిపారు.

మా చర్చల్లో మండ్య ఎంపీ సుమలత సానుకూలంగా స్పందించారని, తన మద్దతుదారులతో చర్చించి తదుపరి రాజకీయ నిర్ణయాన్ని ప్రకటించనున్నారని, ఈ విషయంలో అంతా సవ్యంగా సాగుతుందనే నమ్మకం తనకు ఉందని బీవై విజయేంద్ర విశ్వాసం వ్యక్తం చేశారు. సుమలత మాతోనే ఉంటారనని, ఈరోజు ఆమెకు టికెట్ రాకపోవడం తాత్కాలికంగా ఎదురుదెబ్బగా భావించవచ్చు అని, అయితే ఆమెకు బీజేపీ న్యాయం చేస్తుందని, ఆమె బీజేపీకి సంపూర్ణ మద్దతు ఇస్తారని నమ్మకం ఉంందని బీవై విజయేంద్ర అన్నారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+