Lakhs: మేడమ్ చాలా ముదురు, వాట్సాప్ లో ఇన్ట్సాల్మెంట్ లో అన్నీ చూపించి లక్షలు వసూలు, స్పాలో ?
బెంగళూరు/మైసూరు: మహిళకు వివాహం అయ్యింది. భర్తతో కలిసి సిటీకి వచ్చి అక్కడ సెటిల్ అయిపోయి సొంతంగా బ్యూటీపార్లల్, స్పా నడుపుతోంది. ఎర్రగా, బుర్రగా ఉన్న కిలాడీ లేడీ బ్యూటీపార్లల్ కు వచ్చే మహిళలు, స్పాకు వచ్చే పురుషులతో పరిచయాలు పెంచుకుని ఆట మొదలుపెట్టింది. దంపతులు పరిచయం అయితే ఇక ఆమెకు పండగే. ఖరీదైన కారు తీసుకుని తిరుగుతోంది. బ్యూటీపార్లల్ భార్య వ్యవహారం తెలుసుకున్న భర్త రగిలిపోయి ఇప్పటికే రెండుసార్లు ఆమెను కత్తితో పొడిచాడు. భర్త కత్తితో పొడిచినా కిలాడీ లేడీ ఆమె పద్దతి మార్చుకోలేదు. వాట్సాప్ లో కిలాడీ లేడీ ఆమె నగ్న ఫోటోలు, వీడియోలు అనేకమందికి షేర్ చేసింది.
Lovers: స్కెచ్ మార్చిన క్షత్రియుడు, కళ్లల్లో కారం చల్లి, వేటకొడవళ్లతో వెంటాడి, ఫినిష్ !
సిటీకి మేడమ్ షిఫ్ట్
కర్ణాటకలోని మైసూరు జిల్లాలోని హిరయపట్టణకు చెందిన సవిత అలియాస్ మంజల యాదవ్ అనే మహిళకు వివాహం అయ్యింది. కొన్ని సంవత్సరాలు హిరియపట్టణలో కాపురం ఉన్న సవిత కొన్ని సంవత్సరాల క్రితం ఆమె భర్తతో కలిసి మైసూరు సిటీకి చేరుకుని అక్కడే నివాసం ఉంటున్నది.
బ్యూటీపార్లల్, స్పా సెంటర్లు
మైసూరు చేరుకున్న సవిత సొంతంగా బ్యూటీపార్లల్ పెట్టింది. బ్యూటీపార్లల్ లో చాలా మంది పరిచయం కావడంతో మైసూరులోని విజయనగర్ లో స్పా సెంటర్ ప్రారంభించింది. ఎర్రగా, బుర్రగా ఉన్న కిలాడీ లేడీ సవిత బ్యూటీపార్లల్ కు వచ్చే మహిళలు, స్పాకు వచ్చే పురుషులతో పరిచయాలు పెంచుకుని వారికి దగ్గర అయ్యింది.
బాగా అడ్వాన్స్ అయిన ఆంటీ
సవిత చూడటానికి ఎర్రగా, బుర్రగా ఉండటం, దానికి తోడు సొంతంగా బ్యూటీపార్లల్ ఉండటంతో ప్రతిరోజు బాగా రెఢీ అయ్యి పురుషులు ఆకర్షించడం మొదలుపెట్టింది. పరిచయం అయిన దంపతుల మద్య గొడవలు పెడుతున్న సవిత తరువాత మహిళల భర్తలను వలలో వేసుకుని వారిని ఆమె వయ్యారాలు చూపించడం మొదలుపెట్టింది.
వాట్సాప్ లో నగ్న ఫోటోలు షేర్
సవిత వలలో పడిన వారికి ఆమె భోనసంగా మొదట ఆమె అర్దనగ్న ఫోటోలు వాట్సాప్ లో షేర్ చేసింది, కొన్ని రోజుల వరకు బూతులతో వాట్సాప్ లో వారితో చాటింగ్ చేసింది, తరువాత సవిత ఆమె అర్దనగ్న ఫోటోలు వాట్సాప్ లో పురుషులకు పంపించి వారిని లొంగ దీసుకుని వారి నుంచి అప్పుగా లక్షలు వసూలు చేసి ఆ డబ్బుతో ఎంజాయ్ చేసింది.
రెండుసార్లు భార్యను పొడిచిన భర్త
రోజురోజు పరాయి మగాళ్లతో తన భార్య సవిత ఎక్కువగా తిరుగుతోందని తెలుసుకున్న ఆమె భర్త ఇప్పటికే కొన్ని సార్లు ఆమెకు వార్నింగ్ ఇచ్చాడు. బ్యూటీపార్లల్ భార్య సవిత వ్యవహారం తెలుసుకున్న ఆమె భర్త రగిలిపోయి ఇప్పటికే రెండుసార్లు ఆమెను కత్తితో పొడిచాడు. భర్త కత్తితో పొడిచినా కిలాడీ లేడీ సవితా మాత్రం ఆమె పద్దతి మార్చుకోలేదు.
కేసు పెట్టిన బాధితులు
సవితతో ఎంజాయ్ చెయ్యాలని ఆశతో ఆమెకు లక్షల రూపాయలు ఇచ్చిన వారు షాక్ కు గురైనారు. డబ్బులు తిరిగి ఇవ్వాలని అడిగితే ఎవరు మీరు అంటూ సవిత ప్రశ్నించింది. ఎదురు తిరిగిన మగాళ్ల మీద సవిత దాడి చెయ్యడానికి ప్రయత్నించారు. సవిత తీరుతో విసిగిపోయిన కొందరు మైసూరులోని విజయనగర పోలీస్ స్టేషన్ లో కిలాడీ లేడీ మీద కేసు పెట్టారు.
స్పా పేరుతో సరసాలు, హైటెక్ వ్యభిచారం
పోలీసులు సవితను అదుపులోకి తీసుకుని విచారణ చేస్తే దిమ్మతిరిగిపోయే విషయాలు వెలుగు చూశాయి. సవిత నిర్వహిస్తున్న స్పాలో హైటెక్ వ్యభిచారం చేయిస్తోందని వెలుగు చూసింది. పలువురి దగ్గర లక్షల రూపాయాలు వసూలు చేసి మోసం చేసిందని, స్పా ముసుగులో హైటెక్ వ్యభిచారం చేయిస్తోందని కేసులు నమోదు చేసిన విజయగనర పోలీసులు విచారణ చేస్తున్నారు.