‘కాశ్మీర్తో హోగా.. పాకిస్థాన్ నహీ హోగా’: ఆ సైనికుడికి బెదిరింపులు
న్యూఢిల్లీ: 'కాశ్మీర్తో హోగా.. పాకిస్థాన్ నహీ హోగా' అంటూ కాశ్మీర్లోని యూరీ ప్రాంతంలో ఉగ్రవాదులు దాడులకు తెగబడిన అనంతరం పాకిస్థాన్ను హెచ్చరిస్తూ మన సైన్యంతోపాటు భారతీయుల్లో స్ఫూర్తి నింపేలా పాట పాడిన సైనికుడు మనోజ్ ఠాకూర్కు బెదిరింపులు ఎదురవుతున్నాయి.
'పాకిస్థాన్ చెవులు రిక్కించి విను.. భారత్తో పెట్టుకుంటే ప్రపంచ పటంలో నీ రూపురేఖలు లేకుండా పోతాయి. కశ్మీర్ ఉంటుంది గానీ.. పాకిస్థాన్ మాత్రం ఉండదు' అంటూ గీతాన్ని ఆలపించారు. కాగా, ఈ పాట వైరల్గా మారి సోషల్ మీడియాలో సంచలనం సృష్టించింది.

వీర జవాన్లకు సలాం చెబుతూ.. అనేకమంది నెటిజన్లు ఈ వీడియోను షేర్ చేశారు.
అయితే ఇప్పుడు మనోజ్ ఠాకూర్ చిక్కుల్లో పడినట్లు తెలుస్తోంది. అతడిని చంపేస్తామంటూ బెదిరింపులు వస్తున్నాయట. ఈ విషయాన్ని తోటి సైనికులు ఫేస్బుక్లో పోస్ట్ చేశారు. ప్రస్తుతం మనోజ్ ఠాకూర్కు కిన్నౌర్ ప్రాంతానికి పోస్టింగ్ వేశారు.

యూరీ ఉగ్రదాడిలో సుమారు 20మంది మన సైనికులు ప్రాణాలు కోల్పోయారు. మన సైన్యం కాల్పుల్లో నలుగురు ఉగ్రవాదులు హతమయ్యారు. అనంతరం భారత సైనికులు.. పీవోకేలో జరిపిన సర్జికల్ దాడుల్లో సుమారు 40మందికిపైగా ఉగ్రవాదులు హతయ్యారు. ఈ నేపథ్యంలో భారత్, పాకిస్థాన్ సరిహద్దు ప్రాంతాల్లో ఉద్రిక్తత వాతావరణం కొనసాగుతోంది.
-
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !! -
ఏపీలో స్థానిక సంస్థల పునర్విభజన- మారిపోతున్న ముఖచిత్రాలు -
PNGకి మారకపోతే LPG సిలెండర్ కట్..! కేంద్రం డెడ్ లైన్..! -
చమురు, గ్యాస్ పరిస్ధితి ఇదీ- అఖిలపక్ష భేటీలో తేల్చేసిన కేంద్రం..! -
నన్ను ఆ డైరెక్టర్ ఎక్కడెక్కడో పట్టుకున్నాడు.. కానీ అమ్మానాన్న సర్దుకుపోమన్నారు !! -
Iran: ట్రంప్ కు ఇరాన్ దిమ్మతిరిగే షాక్..! సీజ్ ఫైర్ కు కఠిన షరతులివే..! -
ఇంధన కొరత వేళ.. తెలంగాణ ఆర్టీసీ సంచలన నిర్ణయం -
‘దీదీ’ రాజీనామా.. ఎన్నికల వేళ మమత సంచలన నిర్ణయం! -
ఏపీలో తెలంగాణ సీఎం.. లోకేష్ బంపర్ ఆఫర్












Click it and Unblock the Notifications