Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

పార్లమెంట్ దాడికి ముందు మనోరంజన్ ఏం చేశాడంటే?, భగత్ సింగ్ ఫ్యాన్స్ క్లబ్ లో?, షాకింగ్ మ్యాటర్!

పార్లమెంట్ సందర్శకుల గ్యాలరీ నుండి లోక్‌సభ ఛాంబర్‌లోకి దూకిన ఇద్దరు నిందితుల్లో ఒక్కడైన డి. మనోరంజన్ 'భగత్ సింగ్ ఫ్యాన్ క్లబ్' అనే సోషల్ మీడియా పేజీతో సంబంధం కలిగి ఉన్నాడని, అసెంబ్లీలో బాంబులు విసిరిన భగత్ సింగ్ చర్యను పునరావృతం చేయాలని అతను అనుకున్నాడని ఢిల్లీ పోలీసులు చెప్పారు. మనోరంజన్ తనను తాను విప్లవకారుడిగా గుర్తించుకోవడం ఇష్టమని పోలీసు అధికారులు తెలిపారు.

పార్లమెంట్ లో కలకలం రేపిన నిందితుడు మనోరజంన్ కు గతంలో ఎలాంటి నేర నేపథ్యం లేదని పోలీసుల ప్రాథమిక విచారణలో తేలింది. మనోరంజన్ చాలా నిశ్శబ్దంగా ఉండేవాడని, కానీ అతను చదివిన పుస్తకాలను చూస్తుంటే అతను తాను విప్లవకారుడు అని అందరితో పిలిపించుకోవాలని అనుకున్నాడని కేసు దర్యాప్తు చేస్తున్న ఢిల్లీకి చెందిన ఓ సీనియర్ పోలీసు అధికారి ఒకరు వార్తా సంస్థ పీటీఐకి చెప్పారు.

Manoranjan, who threw smoke bombs in Parliament, followed the Bhagat Singh fan club page on social media

గతంలో ఢిల్లీలోని సెంట్రల్ అసెంబ్లీపై ప్రతీకాత్మకంగా బాంబు పేల్చిన భగత్ సింగ్ అభిమానిగా తాను గుర్తింపు తెచ్చుకోవాలని మనోరంజన్ అనుకున్నాడని మరో పోలీసు అధికారి తెలిపారు. స్వాతంత్ర్య పోరాటంలో భగత్ సింగ్, ఆయన బృందం చేసిన వాటిని పునరావృతం చేయాలనుకుంటున్నట్లు మనోరంజన్ అతని సన్నిహితులతో చెప్పారని పోలీసు అధికారి తెలిపారు.

బుధవారం పార్లమెంటు వెలుపల నిరసన తెలిపిన నీలం దేవి, ఈ ఏడాది ప్రారంభంలో ఢిల్లీలో జరిగిన రెజ్లర్ల నిరసనలో పాల్గొని భగత్ సింగ్ చిత్రపటంతో తన ఫోటోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారని వెలుగు చూసింది. పార్లమెంటు దాడికి ముందు నీలమ్ ఆమె X (ట్విట్టర్) చివరి పోస్ట్‌లో పార్లమెంటు, అసెంబ్లీలలో మహిళలకు 50 శాతం కోటా ఎందుకు లేదని ఆమె ప్రశ్నించారని పోలీసు అధికారులు తెలిపారు.

Manoranjan, who threw smoke bombs in Parliament, followed the Bhagat Singh fan club page on social media

బుధవారం నాడు 2001 పార్లమెంటు ఉగ్రదాడి వార్షికోత్సవం సందర్భంగా జరిగిన భారీ భద్రతా ఉల్లంఘనలో మనోరంజన్, అతని సహచరుడు సాగర్ శర్మ జీరో అవర్‌లో పబ్లిక్ గ్యాలరీ నుండి లోక్‌సభ ఛాంబర్‌కి దూకారు. కొందరు ఎంపీలు వారిని పట్టుకోవడానికి ప్రయత్నించడంతో మనోరంజన్, సాగర్ శర్మాలు నినాదాలు చేశారు. పసుపు పొగ బాంబు విసిరి నానా హంగామా చేశారు.

అదే సమయంలో నీలం, మరో నిందితుడు అమోల్ షిండే పార్లమెంటు బయట నిరసన ప్రదర్శన నిర్వహించి స్మోక్ బాంబులు పేల్చి కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. పార్లమెంటు ఆవరణంలో నియంతృత్వం పనిచేయదని నినాదాలు చేశారు. ఈ నలుగురితో సహా ఐదుగురిని అరెస్టు చేసి కఠినమైన ఉగ్రవాద నిరోధక చట్టాల కింద అభియోగాలు మోపారు. అయితే ప్రధాన నిందితుడి కోసం పోలీసులు గాలిస్తున్నారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+