వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మావోయిస్టుల ఘాతుకం: ఐఈడీతో వాహనం పేల్చివేత: 16 మంది కమాండోలు దుర్మరణం

|
Google Oneindia TeluguNews

ముంబై: మావోయిస్టులు మరోసారి పంజా విసిరారు. రక్తపాతానికి తెగబడ్డారు. దేశంలో ఎన్నికల వాతావరణం నెలకొన్న వేళ.. భారీ పేలుళ్లతో విరుచుకు పడ్డారు. కమాండోల వాహనాన్ని పేల్చివేశారు. ఈ ఘటనలో సీ-60 బెటాలియన్ కు చెందిన 16 మంది కమాండోలు దుర్మరణం పాలయ్యారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. మహారాష్ట్రలోని గడ్చిరోలి జిల్లాలో బుధవారం ఉదయం ఈ ఘటన చోటు చేసుకుంది. కమాండోలను వాహనాన్ని పేల్చి వేయడానికి మావోయిస్టులు ఐఈడీని ఉపయోగించినట్లు ప్రాథమిక సమాచారం. శక్తిమంతమైన ఐఈడీ మావోయిస్టుల చేతికి ఎలా చేరిందనే విషయం చర్చనీయాంశమౌతోంది.

Maoist blow up police vehicle in Gadchiroli, Maharashtra; 16 commandos reportedly killed

మావోయిస్టులకు కంచుకోటగా భావించే ఛత్తీస్ గఢ్ సరిహద్దులకు ఆనుకుని ఉంటుంది గడ్చిరోలి జిల్లా. ఈ జిల్లాలో ఛత్తీస్ గఢ్ సరిహద్దులకు ఆనుకుని ఉన్న కుర్ ఖేడా- జముర్ ఖేడా మార్గంలో ప్రయాణిస్తున్న కమాండోల వాహనాన్ని మావోయిస్టులు పేల్చి వేశారు. కూంబింగ్ నిర్వహించడానికి వెళ్తున్న సమయంలో ఈ ఘటన చోటు చేసుకుంది. వాహనంలో డ్రైవర్ సహా మొత్తం 15 మందికి పైగా కమాండోలు ఉన్నట్లు ప్రాథమిక సమాచారం. ఐఈడీతో వాహనాన్ని పేల్చివేయడం వల్ల 16 మంది దుర్మరణం పాలయ్యారు.

Maoist blow up police vehicle in Gadchiroli, Maharashtra; 16 commandos reportedly killed

కుర్ ఖేడా ప్రాంతంలో బుధవారం తెల్లవారు జామున మావోయిస్టులు తమ ఉనికి చాటుకున్న విషయం తెలిసిందే. కుర్ ఖేడాలో వాహనాలు, యంత్రాలకు నిప్పు పెట్టారు. ఒకేసారి 36 వాహనాలను తగులబెట్టారు మావోయిస్టులు. ఈ సమాచారం అందుకున్న వెంటనే కమాండోలు సంఘటనా స్థలానికి బయలుదేరారు. వాహనాలను తగులబెట్టిన ప్రదేశానికి పోలీసులు గానీ, కమాండోలు గానీ రావచ్చని ఊహించిన మావోయిస్టులు దీనికి అనుగుణంగా ఐఈడీని పాతిపెట్టారు. కుర్ ఖేడా-జముర్ ఖేడా మార్గంలో కమాండోల వాహనం రాగానే.. దాన్ని పేల్చివేశారు.

Maoist blow up police vehicle in Gadchiroli, Maharashtra; 16 commandos reportedly killed

సాధారణంగా మావోయిస్టులు ఎప్పుడు దాడి చేసినా.. మందుపాతరలను వినియోగిస్తారు. వాటితోనే విధ్వంసాన్ని సృష్టిస్తారు. ఛత్తీస్ గఢ్ లోని దంతెవాడ, సుక్మా జిల్లాల్లో మందుపాతరలతో సీఆర్పీఎఫ్, పోలీసుల వాహనాలను పేల్చి వేసిన ఘటనలు చాలా ఉన్నాయి. ఈ సారి మావోయిస్టులు శక్తిమంతమైన ఐఈడీలను వినియోగించడం పట్ల పోలీసులు ఆశ్చర్యపోతున్నారు. పెద్ద ఎత్తున ఐఈడీని మావోయిస్టులు ఎలా సమకూర్చుకున్నారనే విషయంపై పలు అనుమానాలు వ్యక్తమౌతున్నాయి. ఐఈడీ మావోయిస్టులకు ఎలా చేరిందనే విషయంపైనా వారు దర్యాప్తు చేస్తున్నారు.

English summary
At least 15 commandos of the C-60 force were reportedly killed on Wednesday when Naxals triggered an IED blast and blew up a police vehicle in Maharashtra’s Gadchiroli district. Vehicle was completely blown up in the attack. A team of C-60 commandos was travelling in the vehicle when it came under attack at Kurkheda near Jamurkheda. C-60 is the only force in which locals are groomed as commandos.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X