రేపు భారత్ బంద్.. స్కూళ్లు, కాలేజీల సంగతేంటి..?

కేంద్ర ప్రభుత్వం మావోయిస్టుల ఏరివేత లక్ష్యంగా చేపట్టిన 'ఆపరేషన్ కగార్‌'పై మావోయిస్టు పార్టీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ ఆపరేషన్‌ను తీవ్రంగా వ్యతిరేకిస్తూ, నిరసనలో భాగంగా రేపు (శుక్రవారం) భారత్ బంద్‌కు పిలుపునిచ్చింది.

మావోయిస్టు పార్టీ కేంద్ర అధికార ప్రతినిధి అభయ్ పేరుతో విడుదలైన ఒక ప్రకటనలో ఈ విషయం స్పష్టం చేశారు. 'ఆపరేషన్ కగార్‌'కు వ్యతిరేకంగా ఈ నెల 23వ తేదీ వరకు (నేటి వరకు) నిరసన కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు ఆ ప్రకటనలో పేర్కొన్నారు.

Maoists Call for Bharat Bandh Tomorrow Friday Protesting Operation Kagar Nationwide Strike Alert

తక్షణమే ఈ 'ఆపరేషన్ కగార్‌'ను నిలిపివేయాలని కేంద్రాన్ని డిమాండ్ చేస్తూ, మావోయిస్టు పార్టీ తమ బంద్‌ను విజయవంతం చేయాలని ప్రజలకు పిలుపునిచ్చింది. ఈ ఆపరేషన్ తమ కార్యకలాపాలను అడ్డుకోవడానికి, తమ ఉనికిని దెబ్బతీయడానికి కేంద్రం చేస్తున్న ప్రయత్నంగా మావోయిస్టులు భావిస్తున్నారు.

ప్రభుత్వాలు, భద్రతా బలగాలు తమ ఏరివేత చర్యలను ఉధృతం చేస్తున్న తరుణంలో, మావోయిస్టు పార్టీ ఇచ్చిన ఈ భారత్ బంద్ పిలుపు దేశవ్యాప్తంగా, ముఖ్యంగా మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో ఉద్రిక్తతకు దారితీసే అవకాశం ఉంది. మావోయిస్టుల కార్యకలాపాలకు ఇది బలమైన సంకేతంగా కనిపిస్తోంది. బంద్ నేపథ్యంలో అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు, భద్రతా బలగాలు అప్రమత్తమయ్యాయి. మావోయిస్టుల పిలుపుతో రేపు దేశంలో రవాణా, వ్యాపార కార్యకలాపాలపై తీవ్ర ప్రభావం పడే అవకాశం ఉంది. అయితే స్కూళ్లు, కాలేజీలపై ఈ బంద్ ప్రభావం పెద్దగా ఉండకపోవచ్చు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+