వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

భర్తను కలిసేందుకొస్తే..: ఆటోలో ఎత్తుకెళ్లి అడవుల్లో గ్యాంగ్ రేప్, అరెస్ట్

By Srinivas
|
Google Oneindia TeluguNews

బరహంపూర్: ఒడిశాలోని గంజామ్ జిల్లాలో 22 ఏళ్ల మహిళను నలుగురు వ్యక్తులు ఎత్తుకెళ్లి సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. నిందితులను నలుగురిని అరెస్టు చేసినట్లు పోలీసులు బుధవారం చెప్పారు. నలుగురు నిందితుల్లో ఓ ఆటో డ్రైవర్ కూడా ఉన్నాడు.

మహిళను అపహరించి, గ్యాంగ్ రేప్ చేశారని, ఫిర్యాదు మేరకు నలుగురిని మంగళవారం నాడు అరెస్టు చేశామని చెప్పారు. బాధిత మహిళ నయాగర్ జిల్లా నుండి తన భర్తను కలిసేందుకు భంజానగర్ వచ్చిందని చెప్పారు. నిందితులను భంజనగర్ జైలుకు తరలించినట్లు చెప్పారు.

Married woman abducted and gang raped in Odisha

నిందితులను బదాలా ప్రధాన్ (30), ప్రశాంత ప్రణిగ్రతి (30), పట్నాయక్ (33), నారాయణ్ (30)గా గుర్తించారు. నారాయణ్ ఆటో డ్రైవర్. నలుగురు నిందితులు కూడా బెలగుతకు చెందిన వారని పోలీసులు తెలిపారు.

బాధిత మహిళ ఆదివారం రోజు తన భర్తను కలిసేందుకు వచ్చిందన్నారు. ఆమె కుటుంబం చాలా పేదరికంది అని, దీంతో స్థానికంగా హోటల్‌లో ఉండేందుకు ఆమెకు డబ్బుల్లేవని, దీంతో భాంజా నగర్లోని ఆ ఆసుపత్రిలో ఆదివారం రాత్రి పూట తలదాచుతుందని, ఆ మరుసటి రోజు తన భర్తను కలవాలనుకుందని పోలీసులు తెలిపారు.

సోమవారం ఉదయం ఆమెను ఆ నలుగురు కిడ్నాప్ చేశారని చెప్పారు. ఆటోలో ఆమెను కళింగ రోడ్డులోని ఓ అడవికి తీసుకు వెళ్లారని, అక్కడ ఆమె పైన అత్యాచారానికి పాల్పడ్డారని, ఆ తర్వాత ఆమెను బెలగుంత తీసుకు వెళ్తుండగా.. ఆమె ఆటోలో నుండి దూకి తప్పించుకుందని, స్థానికులు ఆమెను కాపాడారని తెలిపారు. నిందితులను అరెస్టు చేసి, ఆటోను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. నిందితుల పైన పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు చెప్పారు.

English summary
A 22 year old married woman was allegedly gangraped after being abducted by four men in Ganjam district, following which the accused have been arrested, a police officer said on Wednesday.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X