భారత్కు భూకంప ముప్పు: తీవ్రత 8.2గా నమోదు
న్యూఢిల్లీ: భారత్లోని హిమాలయ ప్రాంతంలో పెను భూకంపం సంభవించే అవకాశం ఉందని హోం మంత్రిత్వ శాఖ వర్గాలు పేర్కొంటున్నాయి. ఈ విషయాన్ని కేంద్ర హోం మంత్రిత్వ శాఖ పరిధిలోని డిజాస్టర్ మేనేజ్మెంట్ నిపుణులు వెల్లడించారు.
ఉత్తర, ఈశాన్య భారత్లో రిక్టర్ స్కేలుపై 8 అంతకంటే ఎక్కవ తీవ్రతతో భూకంపం సంభవించే అవకాశాలున్నాయిని విపత్తు నిర్వహణ నిపుణులు సూచించారని ఓ ఆంగ్ల దినపత్రికలో కథనం వచ్చింది. మణిపూర్, సిక్కింలో మొన్న సంభవించిన భూకంపాన్ని ఉదహరిస్తూ... హిమాలయాల్లో రిక్టర్ స్కేలుపై 8.2 తీవ్రతతో సంభవిస్తుందనడానికి సూచనగా నిపుణులు విశ్లేషిస్తున్నారు.
ఇటీవల వరుసగా సంభవించిన భూకంపాల కారణంగా హిమాలయ ప్రాంతంలోని భూమి అంతర్భాగంలోని టెక్టోనిక్ ప్లేట్ల స్థితిగతులు మరోసారి మారిపోయాయని, గత భూకంపాల వల్ల ఈ ప్రాంతంలోని భూమి అంతర్భాగంలో ఉన్న టెక్టోనిక్ ప్లేట్లలో పగుళ్లు సంభవించాయని నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ డిజాస్టర్ మేనేజ్మెంట్ (ఎన్డీఎమ్) ఒక నివేదికలో పేర్కొంది.

ఈ పగుళ్ల కారణంగా నేపాల్, భూటాన్, మయన్మార్, భారత్లలో పెను భూకంపాలు సంభవించే అవకాశాలు ఎక్కువ ఉన్నాయని ఎన్డీఎమ్ డైరెక్టర్ సంతోష్ కుమార్ తెలిపారు. బీహార్, యూపీ, ఢిల్లీ ప్రాంతాల్లో కూడా త్వరలో భారీ భూకంపం రావచ్చని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.
ముఖ్యంగా కొండ ప్రాంతాల్లోని ప్రాంతాలలోని రాష్ట్రాలకు ఈ ముప్పు అధికంగా ఉందని ఆయన తెలిపారు. కొలరడో విశ్వవిద్యాలయం ప్రొఫెసర్, ప్రముఖ సెస్మాలజిస్ట్ అయిన రోజర్ బిల్హామ్ కథకం ప్రకారం ప్రస్తుతం ఉన్న పరిస్థితులను బట్టి రిక్టర్ స్కేలుపై 8 అంత కంటే ఎక్కువ తీవ్రతతో కనీసం నాలుగు భూకంపాలు సంభవించే ప్రమాదం ఉంది.
-
అంచనాలను తలకిందులు చేస్తోన్న బంగారం ధరలు -
ఉగాది నుంచి వృషభరాశి, మేషరాశి వారి జాతక ఫలం -
Work From Home ఇచ్చేశారు. ప్రభుత్వం, ఐటీ దిగ్గజాల కీలక ప్రకటన! -
ICC T20I ర్యాంకింగ్స్: దూసుకొచ్చిన సంజూ, ఇషాన్ - అభిషేక్ ఏ స్థానంలో..!! -
రైతులకు శుభవార్త.. రైతు భరోసాపై కీలక ప్రకటన చేసిన మంత్రి! -
తమిళ నాట అధికారం వారిదే, విజయ్ కు దక్కే సీట్లెన్ని- తేల్చేసిన కేకే సర్వే..!! -
2024 నాటి భీభత్సం మళ్లీ వస్తుంది: ఈ వేసవి చాలా కాలం ఉంటుంది! -
ఉగాది నుంచి మిథున రాశి, కర్కాటక రాశి వారి జాతక ఫలం -
ఇన్నాళ్లూ ఆచితూచి- ఇప్పుడు ప్రధాని మోదీపై సీఎం డైరెక్ట్ అటాక్? -
భారత్పై అమెరికా దర్యాప్తు. సెక్షన్ 301 ప్రయోగించిన ట్రంప్ -
దేశంలో తొలి `కారుణ్య మరణం`- తీర్పు చెబుతూ కన్నీళ్లు పెట్టిన సుప్రీంకోర్టు ధర్మాసనం -
తెలంగాణ నూతన డీజీపీ ఖరారు, అనూహ్య ఎంపిక..!!












Click it and Unblock the Notifications