2 కోట్లకు పైగా ఆధార్ నంబర్లు తొలగింపు.. UIDAI సంచలనం..!
భారతీయులకు ఆధార్ తప్పనిసరి. అయితే ఇటీవలి కాలంలో నకిలీ ఆధార్ కార్డులతో పథకాల్లో మోసాలకు పాల్పడుతున్నారు కొందరు. అయితే ఇలాంటి వాటిని తగ్గించి ఆధార్ డేటాబేస్ పారదర్శకతను పెంచడానికి కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు చనిపోయిన వ్యక్తుల ఆధార్ కార్డులను కేంద్ర ప్రభుత్వం డీయాక్టివేట్ చేసింది. దాదాపు 2 కోట్లకు పైగా ఆధార్ నంబర్లను యూఐడీఏఐ తొలగించినట్లు కేంద్రం స్పష్టం చేసింది.
ప్రస్తుతం సైబర్ నేరాలు విపరీతంగా పెరిగిపోతున్నాయి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్ని కఠిన చర్యలు చేపట్టినా ఈ క్రైమ్స్ మాత్రం ఆగడం లేదు.. ఇటీవలికాలంలో విపరీతంగా వాడుకలోకి వచ్చిన ఏఐ ను కూడా వినియోగించి నకిలీ ఆధార్, పాన్ కార్డులను సైతం సృష్టిస్తున్నారు. ఈ క్రమంలో ఆధార్ లో కేంద్ర ప్రభుత్వం అనేక మార్పులు తీసుకొచ్చింది. ప్రజలు సులభంగా వినియోగించేలా మరికొన్ని మార్పులను ప్రవేశపెట్టనుంది భారత విశిష్ట యూఐడీఏఐ.. కొత్తగా యాప్ అలాగే ఫేసియల్ అథెంటికేషన్ ను తీసుకురానుంది.
అయితే తాజాగా దేశవ్యాప్తంగా మరణించిన వ్యక్తులకు చెందిన 2 కోట్లకు పైగా ఆధార్ నంబర్లను డియాక్టివేట్ చేసినట్లు యూఐడీఏఐ తెలిపింది. భారత రిజిస్ట్రార్ జనరల్, రాష్ట్ర అలాగే పలు కేంద్ర మంత్రిత్వ శాఖల నుంచి వచ్చిన మరణాల నమోదు డేటాను ఆధారంగా తీసుకుని.. ఇతర డేటాతో ఆధార్ రికార్డులను సరిపోల్చిన తర్వాత యూఐడీఏఐ చనిపోయిన వ్యక్తుల ఆధార్ కార్డులను డీయాక్టివేషన్ చేసినట్లు స్పష్టం అవుతోంది.

ఇక ఈ డీయాక్టివేషన్ ప్రక్రియను కేంద్ర ప్రభుత్వం 2024లోనే ప్రారంభించింది. ఈ ఏడాది జులై నాటికే దాదాపు 1 కోటీ 17 లక్షల ఆధార్ నంబర్లను యూఐడీఏఐ డీయాక్టివేట్ చేసినట్లు స్పష్టం అవుతోంది. ఈ ఏడాది సెప్టెంబర్ నాటికి సంఖ్య కోటీ 40 లక్షలకు చేరింది. ఇక తాజాగా కేంద్రం వెల్లడించిన సమాచారం ప్రకారం.. 2025 నవంబర్ 26 నాటికి దేశంలో 2 కోట్ల ఆధార్ నంబర్లను యూఐడీఏఐ డీయాక్టివేట్ చేసింది.
-
నిర్మలమ్మ వరాలు: మినిమం బ్యాంక్ బ్యాలెన్స్ పై సంచలన నిర్ణయం -
మెగాస్టార్కి బహిరంగంగా క్షమాపణలు చెప్పిన సీఎం.. -
విశాఖ టు బెంగళూరు వయా తిరుపతి వందేభారత్ స్లీపర్ రెడీ - రూట్ , ముహూర్తం..!! -
ఏపీలో భారీగా మద్యం ధరల తగ్గింపు, ఏ బ్రాండ్ ఎంత..!! -
ఢిల్లీలో జగన్ రూటు మారిందా, పార్లమెంట్ సాక్షిగా - కీలక మలుపు..!! -
T20 World Cup: సూర్యకుమార్ యాదవ్ కు ఐసీసీ అనూహ్య షాక్..! -
India Post GDS 2nd Merit List 2026: పోస్టల్ జాబ్స్ రెండో మెరిట్ లిస్ట్ అప్పుడే? -
టీం ఇండియాకు బీసీసీఐ భారీ నజరానా, ఒక్కొక్కరికి ఎంతంటే..!! -
పెట్రోల్ పై కేంద్రం ఎస్మా ప్రయోగం:LPG ఉత్పత్తి పెంచాలని హుకుం -
భారీగా పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు! -
మిథున రాశి 2026 2027 జాతకం.. ఈ ఏడాది వీరి మాటే శాసనం! -
టీమిండియాపై విధ్వంసకర సెంచరీ: కెప్టెన్గా ప్రమోషన్












Click it and Unblock the Notifications