కొత్త ఏడాదిలో కేంద్ర ఉద్యోగులకు గుడ్ న్యూస్..! 8వ వేతన సంఘంపై..!
కేంద్రం నియమించిన 8వ వేతన సంఘం నివేదిక 18 నెలల్లో అంటే 2027 మధ్యలో వెలువడే అవకాశం ఉంది. అయితే ఈ 18 నెలల తర్వాత పెరిగే జీతాలు, పెన్షన్లను 2026 జనవరి 1 నుంచి వర్తింపచేయబోతున్నట్లు తెలుస్తోంది.
దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో పనిచేస్తున్న ఉద్యోగులకు కేంద్రం గుడ్ న్యూస్ చెప్పబోతోంది. 7వ వేతన సంఘం పదవీకాలం ఈ నెల 31తో ముగియనున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్ల కోసం 8వ వేతన సంఘాన్ని (8th Pay Commission) నవంబర్ లోనే నియమించారు. అలాగే సిఫార్సుల కోసం 18 నెలల గడువు కూడా ఇచ్చారు. అయితే దీనిపై ముందే ప్రకటన రాబోతున్నట్లు తెలుస్తోంది.
కేంద్రం నియమించిన 8వ వేతన సంఘం నివేదిక 18 నెలల్లో అంటే 2027 మధ్యలో వెలువడే అవకాశం ఉంది. అయితే ఈ 18 నెలల తర్వాత పెరిగే జీతాలు, పెన్షన్లను 2026 జనవరి 1 నుంచి వర్తింపచేయబోతున్నట్లు తెలుస్తోంది. దీనిపై కేంద్రం అధికారికంగా ప్రకటన చేయబోతున్నట్లు సమాచారం. ఈ లెక్కన ఉద్యోగులకు పెరిగిన వాస్తవ జీతాల చెల్లింపులు ఆలస్యమైనా, బకాయిలు మాత్రం ఈ అమలు తేదీ నుంచే లెక్కించి అకౌంట్లలో జమ చేస్తారు.

గతంలో 2016 జనవరి నుంచి జీతాలు సవరించగా.. జూన్ లో కేబినెట్ ఆమోదం తర్వాత బకాయిలతో కలిపి చెల్లించారు. ఈసారి కూడా అలాగే ముందుగానే జీతాల పెంపుపై ప్రకటన వస్తుందని భావిస్తున్నారు. అనంతరం కేబినెట్ ఆమోదం, ఇతర లాంఛనాలు పూర్తి చేసి 2027లో బకాయిలతో కలిపి చెల్లించే అవకాశముంది. ఉద్యోగులు 2026-27 ఆర్థిక సంవత్సరంలో జీతాల పెంపు ఆశించవచ్చని నిపుణులు చెప్తున్నారు.

అలాగే గతాన్ని గమనిస్తే 6వ వేతన సంఘం సగటున 40% జీతాలు పెంచింది. 7వ వేతన సంఘం 2.57 ఫిట్మెంట్ ఫ్యాక్టర్తో 23-25% పెంపుకు సిఫార్సు చేసింది.ఇప్పుడు 8వ వేతన సంఘం 20% నుండి 35% వరకు జీతాల పెంపు సిఫార్సు చేస్తుందని అంచనా. ఫిట్మెంట్ ఫ్యాక్టర్ 2.4 నుండి 3.0 మధ్య ఉండవచ్చని భావిస్తున్నారు. దీంతో ఎంట్రీ-లెవల్ ఉద్యోగులకు మూల వేతనాల పెంపు ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. మిగతా ఉద్యోగులకు కూడా మంచి పెంపు ఉంటుందనే అంచనాలున్నాయి.
-
ఈ రాత్రికి ఆయనొక్క మాట చెబితే చాలు.. బంగారం తలకిందులే! -
60 ఏళ్ల క్రితం ఏం జరిగింది? పరాభవ నామ సంవత్సరం.. పేరులోనే కీడు? -
ఇరాన్ వార్ నుంచి తప్పుకుంటాం కానీ..! ఎదురుదెబ్పల వేళ ట్రంప్ సంకేతం..! -
ఉస్తాద్ భగత్ సింగ్ ట్విట్టర్ రివ్యూ: బొమ్మ బ్లాక్ బస్టర్..!! -
కుంభరాశి వారికి ఉగాది నుండి జరిగేదిదే! -
తీవ్ర సంక్షోభంలో పాకిస్తాన్- ప్రధాని షరీఫ్ అనూహ్య ఆదేశాలు -
విశాఖపట్నం-తిరుపతి మధ్య మరో రెగ్యులర్ ఎక్స్ ప్రెస్-ఈ రోజుల్లో..! హాల్ట్ లు ఇవే..! -
Tenth Exams: కన్నీళ్లు తెప్పిస్తున్న దృశ్యం. ఆక్సిజన్ సాయంతో పరీక్ష రాసిన విద్యార్ధి -
`ఉస్తాద్` కోసం పవన్ రెమ్యునరేషన్ -
ఈ సీన్ పై సస్పెన్స్ వీడింది- క్లారిటీగా చెప్పిన శ్రీలీల -
H-1B Visa ఫీజు వ్యవహారం భారీ ట్విస్ట్- బ్యాక్ ఫైర్ -
ఐటెం సాంగ్ బ్యాన్ చేసిన కేంద్రం, పాన్ ఇండియా మూవీకి బిగ్ షాక్












Click it and Unblock the Notifications