Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

అజిత్ ఎంట్రీ కలకలం: ఏక్‌నాథ్ షిండే ఇంట్లో అత్యవసర భేటీ, సీఎం రాజీనామాపై తేల్చేశారు

ముంబై: మహారాష్ట్ర రాజకీయాల్లో మరోసారి చర్చనీయాంశంగా మారాయి. శరద్ పవార్ ఎన్సీపీ నుంచి అజిత్ పవార్ తోపాటు పలువురు ఎమ్మెల్యేలు ఏక్‌నాథ్ షిండే-దేవేంద్ర ఫడ్నవీస్ ప్రభుత్వంలో చేరడం షిండే శివసేనలో కలకలం రేపుతోంది. రాష్ట్ర ప్రభుత్వంలోకి అజిత్ ఎంట్రీని షిండే శివసేనలోని పలువురు ఎమ్మెల్యేలు, ఎంపీలు వ్యతిరేకిస్తుండటమే ఇందుకు కారణం. మరోవైపు, షిండే సీఎం పదవికి రాజీనామా చేస్తారంటూ ప్రచారం జరుగుతోంది.

ఈ నేపథ్యంలో బుధవారం రాత్రి సీఎం ఏక్‌నాథ్ షిండే ముంబైలోని తన నివాసం వర్షాలో పార్టీ ఎమ్మెల్యేలు, నేతలతో అత్యవసర భేటీ అయ్యారు. అజిత్ పవార్ తోపాటు ఎనిమిది మంది ఎమ్మెల్యేలు మహారాష్ట్ర ప్రభుత్వంలో చేరడంపై కీలకంగా చర్చించారు. సీఎం పదవికి రాజీనామా అంటూ వస్తున్న వార్తలపైనా ఈ సమావేశంలో చర్చించినట్లు తెలిసింది.

 Meeting at Eknath shinde house concludes, shiv sena rubbishes cm resignation rumours

అయితే, ఈ అత్యవసర భేటీ ముగిసిన తర్వాత షిండే వర్గం మహారాష్ట్ర మంత్రి శంభురాజ్ దేశాయి మాట్లాడుతూ రాజీనామా అంశంపై స్పందించారు. దాదాపు 200 మంది ఎమ్మెల్యే మద్దతును తాము కలిగి ఉన్నామని.. అలాంటప్పుడు సీఎం పదవికి ఏక్‌నాథ్ షిండే ఎందుకు రాజీనామా చేస్తారని ప్రశ్నించారు. రాజీనామా చేసే ప్రసక్తే లేదని చెప్పారు. ఏక్‌నాథ్ షిండే నాయకత్వంపై ఏ నేత కూడా అసంతృప్తితో లేరని స్పష్టం చేశారు.

మరో మంత్రి ఉదయ్ సామంత్ మాట్లాడుతూ.. తాజా భేటీలో వచ్చే లోక్‌సభ, విధానసభ సమావేశాలపై చర్చించినట్లు తెలిపారు. ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు తమ పనిలో ఎలా ముందుకు సాగాలనేదానిపై చర్చించినట్లు వెల్లడించారు. అజిత్ పవార్ తమ ప్రభుత్వంలో చేరడంపై ఎవరికీ అసంతృప్తి లేదని చెప్పారు. ఎంపీ, ఎమ్మెల్యేలంతా షిండే నాయకత్వంలోనే ఎన్నికలకు వెళతారని చెప్పారు.

కాగా, అంతకుముందు శివసేన ఎంపీ గజానణ్ కీర్తికార్ మాట్లాడుతూ.. అజిత్ పవార్ తోపాటు ఆయనతోపాటు వచ్చిన ఎమ్మెల్యేలకు పదవులు లభించడంతో ఇటు బీజేపీ, అటు శివసేన నుంచి పదవులు ఆశిస్తున్న నేతల్లో అసంతృప్తి నెలకొందని చెప్పారు. ఆ నేతల గురించి షిండే ఆలోచించాలని సూచించారు. బాలాసాహెబ్ థాక్రే కూడా ఎన్సీపీతో ఎప్పుడూ పొత్తు పెట్టుకోలేదని కొందరు ఎమ్మెల్యే చెబుతున్నారు.

శరద్ పవార్ నేతృత్వంలోని ఎన్సీపీ నుంచి అజిత్ పవార్ తోపాటు పలువురు ఎమ్మెల్యేలు మహారాష్ట్ర ప్రభుత్వంలో చేరిన విషయం తెలిసిందే. తమదే నిజమైన ఎన్సీపీ అంటూ అజిత్ ప్రకటించారు. శరద్ పవార్ కంటే ఎక్కువ ఎమ్మెల్యేలు అజిత్ పవార్ శిబిరంలోనే ఉండటం గమనార్హం. శరద్ పవార్ శిబిరంలో 17 మంది ఎమ్మెల్యేలుంటే.. అజిత్ పవార్ క్యాంపులో 30 మందికిపైగా ఎమ్మెల్యేలున్నారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+