మాఫీ కరో: యజమానికి వలసకూలీ భావోద్వేగ లేఖ, నేను దొంగను కాను అని.. కానీ...?
లాక్డౌన్ వల్ల వలసకూలీల ఇబ్బందులు అన్నీ ఇన్నీ కావు. ఉన్న చోట పని ఉండదు. తినడానికి తిండి కూడా లేకపోవడంతో.. తిరిగి సొంత రాష్ట్రానికి వెళుతున్నారు. అలా వెళుతోన్న వలసకూలీలకు విచిత్ర అనుభవాలు ఎదురవుతున్నాయి. కొందరు నడిచి వెళ్తుంటే.. మరికొందరు సైకిల్ మీద వెళ్తున్నారు. మరికొందరు ట్రక్కుల మీద వెళ్తూ.. వెళ్తూ.. ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. శనివారం ఉదయం యూపీలో జరిగిన ప్రమాదంలో కూలీలు చనిపోయారు. అయితే రాజస్థాన్లో ఓ వలసకూలీ సైకిల్ దొంగతనం చేశాడు. అవును తాను ఎందుకు చోరీ చేస్తున్నానో లేఖ కూడా రాశాడు.

250 కి.మీ పయనం
ఉత్తరప్రదేశ్లోని బరేలికి చెందిన మహమ్మద్ ఇక్బాల్.. పొట్ట కూటి కోసం రాజస్థాన్లో ఉంటున్నాడు. భారత్పూర్ జిల్లా రారలో ఉంటూ.. జీవించేవాడు. అయితే లాక్ డౌన్ వల్ల.. తిరిగి సొంత ఊరు వెళ్లాలనుకొన్నాడు. అయితే అతనికి ఓ అంగవైకల్యం ఉన్న చిన్నారి కూడా ఉన్నారు. 250 కిలోమీటర్లు ఎలా వెళ్లాలా అని ఆలోచించాడు. తాను చేసేదీ కూలీ పని అయిన.. తొలిసారి దొంగతనం చేసేందుకు సాహసించాడు.

సైకిల్ చోరీ
తప్పలేనందున.. సాహబ్ సింగ్ సైకిల్ దొంగతనం చేశాడు. అయితే తన సైకిల్ కనిపించడం లేదు అని .. సాహబ్ సింగ్ అనుకొన్నాడు. కానీ ఇల్లు క్లీన్ చేసే సమయంలో వరండాపై ఓ లేఖ కనిపించింది. అది ఇక్బాల్ పేరుతో ఉంది. మీ సైకిల్ తాను దొంగతనం చేశానని అందులో రాసుకొచ్చాడు. తన పరిస్థితిని.. వివరించాడు. తాను దొంగను కాదు అని.. కూలీనని ఇక్బాల్ తెలిపారు. కానీ నిస్సహాయ పరిస్థితిలో మీ సైకిల్ తీసుకున్నానని.. తనను క్షమించాలని కోరారు.
Recommended Video

కుమారుడి కోసం
తనకు అంగవైకల్యం ఉన్న చిన్నారి ఉన్నాడని.. సైకిల్ మీద వెళ్లడం తప్ప మరో మార్గం కనిపించలేదు అని అందులో రాశాడు. కరోనా వైరస్ లాక్ డౌన్ వల్ల దేశంలో ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయి. ఇదివరకు కూడా కొందరు సైకిల్ దొంగతనం చేసిన దాఖలాలు ఉన్నాయి.
-
పెళ్లికి రెడీ అయిన యంగ్ కపుల్.. -
తమిళనాడు, బెంగాల్, అసోం, కేరళలో గెలిచేది వీళ్లే? ఆత్మసాక్షి సర్వేలో..! -
లబ్దిదారులకు రెండు ఉచిత వంటగ్యాస్ సిలిండర్లు, రూ. 2,500 రీఛార్జ్ రేషన్ కార్డ్ -
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం -
కోట్లకు పడగెత్తిన విజయ్ రైట్ హ్యాండ్ -
సిమెంట్- స్టీల్ ధరలు భారీగా పెంపు, ఇక నుంచి..!? -
ఏపీ ప్రభుత్వం మరో ఎన్నికల హామీ అమలు, రేపే ప్రారంభం..!! -
తిరుపతిలో ఎయిర్ పోర్టును తలదన్నేలా..!! -
ఏపీ ప్రజలకు డిసెంబర్ లోగా మరో బహుమానం.. ఫిక్స్ చేసిన సీఎం చంద్రబాబు -
బిగ్ షాక్: ఏప్రిల్ 1 నుంచి పెరగనున్న పెట్రోల్, డీజిల్ ధరలు.. -
రాహుల్ గాంధీతో డేటింగ్ కోరిక తీరలేదు - బాలీవుడ్ స్టార్












Click it and Unblock the Notifications