తుపాకితో బెదిరించి అమ్మాయిపై అత్యాచారం

బాలికను వివాహితుడు గట్టిగా పట్టుకుని తుపాకితో బెదిరింది ఆమెపై అత్యాచారం చేశాడని పోలీసులు బుధవారం చెప్పారు. ఓం సింగ్ యాదవ్ (22) అనే ఆ వ్యక్తి అమ్మాయికి పరిచితుడే. అతన్ని పోలీసులు మంగళవారం అరెస్టు చేశారు.
ఎస్సీ, ఎస్టీ చట్టం కింద బాధితురాలికి అధికారులు 60 వేల రూపాయల నష్టపరిహారం ప్రకటించినట్లు రాంపూర్ కలెక్టర్ సిపి త్రిపాఠీ చెప్పారు.
పోలీసు రికార్డుల ప్రకారం రాంపూర్ జిల్లాలో ఈ నెల ఎనిమిది అత్యాచారం కేసులు నమోదయ్యాయి. గత ఆరు నెలల కాలంలో 25 లైంగిక దాడుల కేసులు నమోదయ్యాయి.












Click it and Unblock the Notifications